ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగుతున్న పేరు. హనుమాన్ సినిమాతో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. కాన్ఫిడెన్స్కి కేరాఫ్ అడ్రస్లా నిలిచే ప్రశాంత్ వర్మ.. పరిమిత బడ్జెట్లో ‘హనుమాన్’ చిత్రాన్ని ఒక విజువల్ వండర్లా తీర్చిదిద్దిన తీరు అందరినీ అబ్బురపరిచింది. దీనికి కొనసాగింపుగా రానున్న ‘జై హనుమాన్’ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమాతో పాటు మరికొన్ని భారీ చిత్రాలు చేయడానికి ప్రశాంత్ ప్రణాళికలు రచించుకున్నాడు.
కాగా అతను పురాణ గాథలు తీయడానికి రెడీ అయితే వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఒక నిర్మాత రెడీ అయ్యాడట. ‘హనుమాన్’ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ప్రశాంత్. అందులో ఒకదాంట్లో అతనీ విషయం వెల్లడించాడు.
పురాణ గాథలతో సినిమాలు తీస్తానంటే వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టడానికి తాను సిద్ధం అంటూ ఒక ఎన్నారై తనకు ఆఫర్ ఇచ్చినట్లు ప్రశాంత్ వెల్లడించాడు. రామాయణం, మహాభారత గాథలను తాను తీయాలనుకున్నానని.. రాజమౌళి మహాభారతం తీస్తానన్నాడు కాబట్టే ఆ ఆలోచన విరమించుకున్నానని.. బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి రామాయణం తీయకపోతే తనే తీస్తానని ప్రశాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
‘హనుమాన్’ మూడొందల కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుండగా.. ‘జై హనుమాన్’ కనీసం ఐదొందల కోట్ల సినిమా అవుతుందని భావిస్తున్నారు. కాబట్టి ప్రశాంత్ వర్మ మాటలు ఇప్పుడు అతిశయోక్తిలా కనిపించినా.. అతడి విజన్ ప్రకారం చూస్తే వెయ్యి కోట్ల సినిమాలు చేసే రోజులు కూడా భవిష్యత్తులో వస్తే ఆశ్చర్యం లేదు. జై హనుమాన్ వందల కోట్ల బడ్జెట్లోనే తెరకెెక్కే అవకాశముంది.
This post was last modified on January 31, 2024 9:57 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…