Movie News

హనుమాన్ దర్శకుడికి వెయ్యి కోట్ల ఆఫర్

ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగుతున్న పేరు. హనుమాన్ సినిమాతో అతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. కాన్ఫిడెన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌లా నిలిచే ప్రశాంత్ వర్మ.. పరిమిత బడ్జెట్లో ‘హనుమాన్’ చిత్రాన్ని ఒక విజువల్ వండర్‌లా తీర్చిదిద్దిన తీరు అందరినీ అబ్బురపరిచింది. దీనికి కొనసాగింపుగా రానున్న ‘జై హనుమాన్’ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమాతో పాటు మరికొన్ని భారీ చిత్రాలు చేయడానికి ప్రశాంత్ ప్రణాళికలు రచించుకున్నాడు.

కాగా అతను పురాణ గాథలు తీయడానికి రెడీ అయితే వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఒక నిర్మాత రెడీ అయ్యాడట. ‘హనుమాన్’ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ప్రశాంత్. అందులో ఒకదాంట్లో అతనీ విషయం వెల్లడించాడు.

పురాణ గాథలతో సినిమాలు తీస్తానంటే వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టడానికి తాను సిద్ధం అంటూ ఒక ఎన్నారై తనకు ఆఫర్ ఇచ్చినట్లు ప్రశాంత్ వెల్లడించాడు. రామాయణం, మహాభారత గాథలను తాను తీయాలనుకున్నానని.. రాజమౌళి మహాభారతం తీస్తానన్నాడు కాబట్టే ఆ ఆలోచన విరమించుకున్నానని.. బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి రామాయణం తీయకపోతే తనే తీస్తానని ప్రశాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘హనుమాన్’ మూడొందల కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుండగా.. ‘జై హనుమాన్’ కనీసం ఐదొందల కోట్ల సినిమా అవుతుందని భావిస్తున్నారు. కాబట్టి ప్రశాంత్ వర్మ మాటలు ఇప్పుడు అతిశయోక్తిలా కనిపించినా.. అతడి విజన్ ప్రకారం చూస్తే వెయ్యి కోట్ల సినిమాలు చేసే రోజులు కూడా భవిష్యత్తులో వస్తే ఆశ్చర్యం లేదు. జై హనుమాన్ వందల కోట్ల బడ్జెట్లోనే తెరకెెక్కే అవకాశముంది.

This post was last modified on January 31, 2024 9:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…

3 minutes ago

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

1 hour ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

2 hours ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

3 hours ago

అన్వేషణ హద్దు దాటేస్తుందా?

నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది...! యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితమే.…

3 hours ago

హ‌రీష్‌రావు కంచుకోట‌ను క‌విత బ‌ద్ద‌లు కొట్ట‌గ‌లదా?

బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి.. అంత‌కుమించి మాట‌ల మాంత్రీకుడు.. త‌న్నీరు హ‌రీష్ రావు గురించి చెప్ప‌డానికి ఇవి చాలు.…

3 hours ago