స్టార్ హీరోల సినిమాలకు హీరోయిన్ల కొరత ఏర్పడి కథానాయికను ఫిక్స్ చేయకుండానే షూటింగ్కు వెళ్లపోతున్నాయి కొన్ని చిత్ర బృందాలు. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న ‘రాబిన్ హుడ్’ ఈ కోవకే చెందుతుంది. మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘విశ్వంభర’ త్వరలోనే మొదలవుతుండగా ఇంకా కథానాయిక ఖరారు కాలేదు.
అలాగే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబినేషన్లో మొదలైన సినిమాకు కూడా హీరోయిన్ ఫిక్స్ చేయకుండానే షూటింగ్కు వెళ్లిపోయారు. రెండు షెడ్యూళ్ల చిత్రీకరణ కూడా పూర్తయింది. ఐతే షూటింగ్ మధ్య దశకు చేరుకున్న ఈ చిత్రానికి ఎట్టకేలకు హీరోయిన్ ఓకే అయింది. కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ను బాలయ్యకు జోడీగా ఎంపిక చేసినట్లు తాజా సమాచారం.
నాని ‘జెర్సీ’, సిద్ధు జొన్నలగడ్డ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించిన శ్రద్ధ.. ఇటీవలే ‘సైంధవ్’ చిత్రంతో పలకరించింది. ఆ సినిమా, అందులో శ్రద్ధ పాత్ర పెద్దగా ఇంపాక్ట్ వేయలేకపోయాయి. ఐతే సీనియర్ హీరో పక్కన శ్రద్ధ బాగానే సూటైంది అనిపించింది. దీంతో బాలయ్యకు జోడీగా ఆమెను ఎంపిక చేశారు.
బాలయ్య పక్కన కూడా ఆమె బాగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో బాలయ్య నెవర్ బిఫోర్ రోల్లో కనిపించబోతున్నాడు. సినిమా ఫుల్ మాస్గా, వయొలెంట్గా ఉంటుందని ప్రి లుక్ పోస్టర్ చూస్తే అర్థమైంది. ఇలాంటి సినిమాల్లో హీరోయిన్కు అంత ప్రాధాన్యం ఉండకపోవచ్చు. కానీ పెద్ద సినిమా కాబట్టి పారితోషకం బాగానే ఉంటుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. బహుశా దసరాను టార్గెట్గా పెట్టుకుని ఉండొచ్చు.
This post was last modified on January 31, 2024 9:39 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…