గత ఏడాది విరూపాక్షతో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా గాంజా శంకర్ ప్రకటించి నెలలు దాటేసింది. సంపత్ నంది దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకుంది. ఎప్పుడో అక్టోబర్ లో చిన్న కాన్సెప్ట్ టీజర్ వదిలారు కానీ ఆ తర్వాత చడీ చప్పుడు లేదు. మాములుగా నిర్మాత నాగవంశీ దీని గురించి ఎక్కడో ఒక చోట ప్రస్తావన తెచ్చేవారు కానీ మ్యాడ్ నుంచి గుంటూరు కారం దాకా ఏ ఇంటర్వ్యూలోనూ ఈ టాపిక్ రాలేదు. హీరోయిన్ గా పూజా హెగ్డేననే టాక్ వచ్చినా దాని నిర్ధారణ కూడా జరగలేదు. అయితే తెరవెనుక అనఫీషియల్ కథ వేరే వినిపిస్తోంది.
దాని ప్రకారం గాంజా శంకర్ ప్రస్తుతం హోల్డ్ లో ఉంది. దానికి కారణం బడ్జెట్ ఇష్యూసట. ముందు వేసుకున్న లెక్కల ప్రకారం ఓటిటి నుంచి భారీ ఆఫర్లు రాలేదట.కేవలం థియేట్రికల్ రైట్స్ తో అంత రికవరీ కావడం కష్టమని గుర్తించి కాస్ట్ కటింగ్ కు ఏమేం చేయాలో ఆలోచించే పనిలో దర్శన నిర్మాతలున్నట్టు వినికిడి. విరూపాక్షతో సాయి ధరమ్ తేజ్ తిరిగి సక్సెస్ ట్రాక్ లో పడినా ఒక్కసారిగా తన మార్కెట్ అమాంతం పెరిగిపోలేదు. పైగా అది కేవలం తన ఇమేజ్ మీద ఆడిన సినిమా కాదు. హారర్ ఎలిమెంట్స్ తో దర్శకుడు కార్తీక్ దండు పనితనం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.
నిర్మాణంలో ఉన్నా సరే ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండే సితార టీమ్ ఒక్క గాంజా శంకర్ విషయంలోనే సైలెంట్ గా ఉండటం వల్ల ఈ డౌట్లు రావడం సహజం. ఎప్పుడూ లేనంత ఊర మాస్ గా సాయి ధరమ్ తేజ్ ని చూపించేందుకు సంపత్ నంది పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. గతంలో సీటిమార్ కు సైతం బడ్జెట్ సమస్యలు ఫేస్ చేసిన ఈ మాస్ దర్శకుడు ఈసారి కూడా అడ్డంకిని ఎలా దాటతాడో చూడాలి. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న గాంజా శంకర్ కు సంబందించిన ఇతర డీటెయిల్స్ వీలైనంత త్వరగా ఫ్యాన్స్ కి అందిస్తే నిజమో కాదో తెలియని పుకార్లకు చెక్ పెట్టేయొచ్చు.
This post was last modified on January 30, 2024 2:24 pm
సరైన సినిమాలు రాలేదనే కారణం స్పష్టంగా కనిపిస్తున్నా ఎన్నికల ప్రభావం బాక్సాఫీస్ మీద తీవ్రంగా పడిన మాట వాస్తవం. వార్…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం దాదాపు ముగిసింది. ఈ వార్త రాసే సమయానికి ఇంకా కొన్ని చోట్ల మాత్రమే పోలింగ్…
మంచు విష్ణు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. కన్నప్ప. ఈ చిత్రాన్ని విష్ణు అనే కాదు.. మంచు ఫ్యామిలీనే…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…