ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి మే 9 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా వార్తలు హోరెత్తిపోతున్న టైంలో ఇది కూడా అదే దారి పడుతుందేమోననే అనుమానాలు బలంగానే ఉన్నాయి. అయితే వైజయంతి టీమ్ మాత్రం అలాంటిదేమి లేదని అంటోంది. ఖచ్చితంగా చెప్పిన డేట్ కి వస్తామని, ఎలాంటి ఒత్తిడి లేదని క్లారిటీ ఇస్తోంది. సో ఇంకో మూడున్నర నెలల్లో ఇండియన్ స్క్రీన్ మీద డార్లింగ్ ఇవ్వబోతున్న అతి పెద్ద విజువల్ ట్రీట్ కి ఫ్యాన్స్ రెడీ అయిపోవచ్చు. ఇక అసలు పాయింట్ కి వద్దాం.
ఇందులో ప్రత్యేక క్యామియోల్లో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలు ఉంటారని ఇప్పటిదాకా ఉన్న అనధికార లీక్. అఫీషియల్ గా చెప్పలేదు కానీ బలమైన సోర్స్ నుంచే బయటికి వచ్చింది. తాజాగా తెలిసిన ట్విస్టు ఏంటంటే అతిథి పాత్రల లిస్టు ఆగదట. క్లైమాక్స్ కు ముందు వచ్చే కీలక ఘట్టంలో కృపాచార్యగా న్యాచురల్ స్టార్ నాని కనిపిస్తాడని అంటున్నారు. అంతే కాదు పరశురాముడిగా కొన్ని నిముషాలు తెరను ఊపేసే క్యారెక్టర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ని సంప్రదించినట్టు తెలిసింది. అయితే ఈ రెండు ఖరారుగా ఔనా కాదనేది ఇప్పుడే చెప్పలేం. కొంత వేచి చూడక తప్పదు.
చూస్తుంటే నాగ అశ్విన్ అంచనాలకు మించి ఏదో చేయబోతున్నాడని అర్థమవుతోంది. ప్రస్తుతానికి రెండు భాగాలుగా రూపొందుతున్న కల్కి 2898 ఏడి ఆరు వందల సంవత్సరాల క్రితం బ్యాక్ డ్రాప్ తో మొదలై భవిష్యత్తుకు చేరుకుంటుంది పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒకవైపు జరుపుతూనే ఇంకోవైపు బ్యాలన్స్ షూటింగ్ ని వేగంగా పూర్తి చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న కల్కిలో దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, అనుపమ్ ఖేర్ తదితర బాలీవుడ్ క్యాస్టింగ్ తో తో పాటు తెలుగు తమిళ రంగానికి చెందిన ఎందరో నటీనటులు ఇందులో భాగం పంచుకున్నారు.
This post was last modified on January 29, 2024 11:30 am
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…