దర్శకుడు తేజ హీరో రానా కాంబోలో తెరకెక్కుతున్న రాక్షస రాజులో చాలా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని యూనిట్ టాక్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వేదికగా గత మూడు తరాల్లో జరిగిన విపరీత రాజకీయాలను ఇందులో చూపించబోతున్నట్టు తెలిసింది. తోడల్లుళ్ల పాలిటిక్స్, పవర్ కోసం హత్యలు చేయించే క్రూర మనస్తత్వాలు, ఒకే కుటుంబంలో భిన్న ధృవాల్లాంటి వ్యక్తుల మధ్య ఎలుక పిల్లి చెలగాటాలు ఇలా ఎన్నో అంశాలు స్పృశించబోతున్నారట. నేనే రాజు నేనే మంత్రి దీని ముందు నథింగ్ అనిపించే రేంజ్ లో తేజ పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని ఇన్ సైడ్ టాక్.
లేకపోతే సీత, అహింస లాంటి డిజాస్టర్ల తర్వాత నమ్మి ఇంకో అవకాశం రావడమంటే మాటలు కాదు. అది కూడా చాలా క్యాలికులేటెడ్ గా ఉండే సురేష్ బాబు నుంచి. రాక్షస రాజు అన్ని భాషల్లో సంచలనం సృష్టించే కంటెంట్ కావడం వల్లే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. దీన్ని కేవలం ఒక వర్షన్ కే పరిమితం చేయకుండా ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తారట. రానాకు సై అంటే సై అనే మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం ఎవరైనా సీనియర్ స్టార్ హీరో అయితే బాగుంటుందని తేజ రెండు మూడు ఆప్షన్లు పెట్టుకుని ట్రై చేస్తున్నారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఈ లిస్టులో ఉన్నారట.
బాహుబలి, నేనే రాజు నేనే మంత్రి, భీమ్లా నాయక్ తప్ప రానా కెరీర్ లో గత కొన్నేళ్లలో చెప్పుకోదగ్గ సినిమా లేదు. అనారోగ్యం వల్ల కొంత బ్రేక్ వచ్చినా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ వ్యవహారాలన్నీ తనే చూసుకోవాల్సి రావడంతో నటన మీద అంతగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. డిస్ట్రిబ్యూషన్ లో సురేష్ బాబు యాక్టివ్ గా ఉన్నట్టు కనిపిస్తున్నా వాటికి సంబంధించిన కీలక నిర్ణయాలు రానానే తీసుకుంటున్నట్టు టాక్. రాక్షస రాజుతో ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయిన రానా బడ్జెట్ ఎంతైనా ఖర్చు పెట్టమని తేజకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారట. ఆయనది వాడుకోవడమే ఆలస్యం.
This post was last modified on January 25, 2024 7:53 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…