ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకడు. కేజీఎఫ్ సలార్ సినిమాలతో అతను మామూలు క్రేజ్ సంపాదించలేదు. ప్రశాంత్ దర్శకత్వంలో నటించడానికి పెద్ద పెద్ద స్టార్లు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఇటీవలే సలార్ పార్ట్-1తో పలకరించిన ప్రశాంత్.. తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. నిజానికి అతను సలార్-1 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. కేజీఎఫ్-1 రిలీజ్ అవ్వగానే ప్రశాంత్ ముందుగా సినిమా కమిట్ అయింది తారక్ తోనే. కానీ దానికంటే ముందు సలార్ మొదలై.. పూర్తయింది. రిలీజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు కూడా వెంటనే తారక్- ప్రశాంత్ కాంబినేషన్ కార్యరూపం దాల్చేలా లేదు.
ప్రశాంత్ ఖాళీ అయ్యే సమయానికి తారక్ ఫ్రీగా లేడు. దేవరకు సంబంధించి కొంత షూట్, డబ్బింగ్ పనితో పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొనాల్సి ఉంది. మరోవైపు హిందీ సినిమా వార్-2 చిత్రీకరణకు హాజరు కావాలి. ఇంకో ఏడాది పాటు ఎన్టీఆర్.. ప్రశాంత్ కు అందుబాటులోకి రావడం కష్టమే. ఈ విషయంలో ఇద్దరికీ అండర్ స్టాండింగ్ ఉండడంతో ప్రశాంత్ ఆలోచన కూడా మారిపోయింది.
ముందు అనుకున్నట్లు ఎన్టీఆర్ సినిమా తర్వాత కాకుండా.. ముందే సలార్-2 చేసేయబోపోతున్నాడు. అది రిలీజ్ అయితే ఒక పని అయిపోతుంది. తర్వాత ప్రశాంతంగా ఎన్టీఆర్ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు ప్రశాంత్. అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలు కూడా ప్రశాంత్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ప్రశాంత్ కు కేజీఎఫ్ -3 రూపంలో ఇంకో కమిట్మెంట్ కూడా ఉంది.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…