సోలో రిలీజ్ వచ్చేలా చూస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఫిలిం ఛాంబర్ కు ఈగల్ నిర్మాతలు పంపిన లేఖా విన్నపానికి ఇంకా స్పందన రాని నేపథ్యంలో పోటీ తప్పదని అర్థమైపోయింది. సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడం వల్ల తమకు దక్కాల్సిన ప్రయోజనాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ డిమాండ్ చేయడంలో న్యాయముంది. అయితే ఊరి పేరు భైరవకోన, యాత్ర 2 ప్రొడ్యూసర్లను సంప్రదించకుండా కేవలం టిల్లు స్క్వేర్ వాయిదాని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సమస్యకు కారణమయ్యింది. ఏ పిఆర్ఓను అడిగినా దొరికే సమాచారాన్ని చెక్ చేసుకోలేదనే కామెంట్స్ ఓపెన్ గా వినిపిస్తున్నాయి.
ఈ లెక్కన ఈగల్ మరో మూడు సినిమాలతో తలపడక తప్పదు. ఈగల్ కి ఏషియన్ సంస్థ0 పంపిణిపరంగా మద్దతు ఇస్తుండగా, భైరవకోన-యాత్ర 2లకు మైత్రి అందండలు దక్కాయని వినిపిస్తోంది. వీటి పంపిణి వ్యవహారంలో దిల్ రాజు దూరంగా ఉన్నట్టు సమాచారం. కాంపిటీషన్ లేకుండా చూసుకుంటామని నిర్మాతల మండలి తరఫున మాట ఇచ్చింది ఆయనే కావడంతో ఏదైనా సమాధానం లేదా వివరణ ఇస్తే బాగుంటుందని రవితేజ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. పొరపాటో మరొకటో ఏదైనా ఇప్పుడు ఈగల్ ని ఒంటరిగా బాక్సాఫీస్ బరిలో దిగేలా చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది.
విడుదలకు పదిహేడు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈగల్ ప్రమోషన్లు ఇంకా ఊపందుకోలేదు. మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో బిజీగా ఉన్న రవితేజ దానికో బ్రేక్ ఇచ్చి ఈగల్ రిలీజ్ కు ముందు అవసరమైన పబ్లిసిటీలో భాగం కాబోతున్నాడు. సంక్రాంతి పండగను వదులుకోవడం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే సూపర్ హిట్ లేదా బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సిందే. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో పాటు టీమ్ మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ అయినప్పటికీ ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ పాయింట్ ని చూపించబోతున్నారట. పండగ తర్వాత వస్తున్న పెద్ద హీరో సినిమా కూడా ఇదే.
This post was last modified on January 21, 2024 12:56 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…