నూటా యాభైకి పైగా సినిమాలతో దశాబ్దాల తరబడి టాలీవుడ్ అగ్ర స్థానాన్ని అనుభవించిన చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇవ్వబోతోందనే వార్త నిన్న సాయంత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాని ఊపేసింది. అధికారిక వర్గాల నుంచి సమాచారం లేకపోయినప్పటికీ క్షణాల్లో న్యూస్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ తమ ఆనందాన్ని పంచుకోవడం మొదలుపెట్టారు. నిజానికి అఫీషియల్ గా ఎలాంటి నోట్ రాలేదు. అయితే ప్రకటనలకు ముందు లీకులు సహజమే కాబట్టి వాస్తవం లేకుండా మరీ ఇంత స్థాయిలో ప్రచారం జరగకపోవచ్చు. కన్ఫర్మేషన్ అయితే రాలేదు.
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారానికి సంబంధించిన ధృవీకరణ జరిగేలా ఉంది. 2006లో పద్మ భూషణ్ అందుకున్న మెగాస్టార్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొన్నేళ్ళకే కాంగ్రెస్ లోకి విలీనం చేసి ఇప్పుడు పూర్తిగా సినిమాలకే అంకింతమయ్యారు. పద్మవిభూషణ్ ఆయన నటనకు ఇస్తున్న గౌరవం కాదు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది రక్త నేత్ర దానాలు చేయడంతో పాటు కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణి, సినీ కార్మికులకు నిత్యావసరాల సరుకుల అందజేత లాంటి ఎన్నో కార్యక్రమాలు దగ్గరుండి జరిపించారు.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని అన్ని విధాలుగా అర్హత ఉందని తేలాకే నిర్ణయం తీసుకుని ఉంటారని ఢిల్లీ టాక్. ఇప్పటిదాకా మూడు వందల పై చిలుకు మాత్రమే పద్మభూషణ్ పురస్కారం అందుకున్న వాళ్లలో ఉన్నారు. చిరంజీవికి వాళ్ళ సరసన చోటు దక్కితే అంతకన్నా గర్వకారణం అభిమానులకు మరొకటి ఉండదు. అదేదో అఫీషియల్ గా చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో అడుగు పెట్టడానికి చిరు సిద్ధమవుతున్నారు. పద్మవిభూషణ్ వార్త గురించి మెగా వర్గాలు కానీ టాలీవుడ్ పెద్దలు కానీ స్పందించలేదు. సో ఖరారయ్యాక శుభవార్తను పంచుకోవచ్చు.
This post was last modified on January 18, 2024 10:44 am
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…