Movie News

చిరంజీవికి రెండో ‘పద్మ’ పురస్కారం?

నూటా యాభైకి పైగా సినిమాలతో దశాబ్దాల తరబడి టాలీవుడ్ అగ్ర స్థానాన్ని అనుభవించిన చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇవ్వబోతోందనే వార్త నిన్న సాయంత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాని ఊపేసింది. అధికారిక వర్గాల నుంచి సమాచారం లేకపోయినప్పటికీ క్షణాల్లో న్యూస్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ తమ ఆనందాన్ని పంచుకోవడం మొదలుపెట్టారు. నిజానికి అఫీషియల్ గా ఎలాంటి నోట్ రాలేదు. అయితే ప్రకటనలకు ముందు లీకులు సహజమే కాబట్టి వాస్తవం లేకుండా మరీ ఇంత స్థాయిలో ప్రచారం జరగకపోవచ్చు. కన్ఫర్మేషన్ అయితే రాలేదు.

జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారానికి సంబంధించిన ధృవీకరణ జరిగేలా ఉంది. 2006లో పద్మ భూషణ్ అందుకున్న మెగాస్టార్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొన్నేళ్ళకే కాంగ్రెస్ లోకి విలీనం చేసి ఇప్పుడు పూర్తిగా సినిమాలకే అంకింతమయ్యారు. పద్మవిభూషణ్ ఆయన నటనకు ఇస్తున్న గౌరవం కాదు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది రక్త నేత్ర దానాలు చేయడంతో పాటు కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణి, సినీ కార్మికులకు నిత్యావసరాల సరుకుల అందజేత లాంటి ఎన్నో కార్యక్రమాలు దగ్గరుండి జరిపించారు.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని అన్ని విధాలుగా అర్హత ఉందని తేలాకే నిర్ణయం తీసుకుని ఉంటారని ఢిల్లీ టాక్. ఇప్పటిదాకా మూడు వందల పై చిలుకు మాత్రమే పద్మభూషణ్ పురస్కారం అందుకున్న వాళ్లలో ఉన్నారు. చిరంజీవికి వాళ్ళ సరసన చోటు దక్కితే అంతకన్నా గర్వకారణం అభిమానులకు మరొకటి ఉండదు. అదేదో అఫీషియల్ గా చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో అడుగు పెట్టడానికి చిరు సిద్ధమవుతున్నారు. పద్మవిభూషణ్ వార్త గురించి మెగా వర్గాలు కానీ టాలీవుడ్ పెద్దలు కానీ స్పందించలేదు. సో ఖరారయ్యాక శుభవార్తను పంచుకోవచ్చు. 

This post was last modified on January 18, 2024 10:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

16 minutes ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

1 hour ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

1 hour ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

2 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

2 hours ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

2 hours ago