నూటా యాభైకి పైగా సినిమాలతో దశాబ్దాల తరబడి టాలీవుడ్ అగ్ర స్థానాన్ని అనుభవించిన చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇవ్వబోతోందనే వార్త నిన్న సాయంత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాని ఊపేసింది. అధికారిక వర్గాల నుంచి సమాచారం లేకపోయినప్పటికీ క్షణాల్లో న్యూస్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ తమ ఆనందాన్ని పంచుకోవడం మొదలుపెట్టారు. నిజానికి అఫీషియల్ గా ఎలాంటి నోట్ రాలేదు. అయితే ప్రకటనలకు ముందు లీకులు సహజమే కాబట్టి వాస్తవం లేకుండా మరీ ఇంత స్థాయిలో ప్రచారం జరగకపోవచ్చు. కన్ఫర్మేషన్ అయితే రాలేదు.
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారానికి సంబంధించిన ధృవీకరణ జరిగేలా ఉంది. 2006లో పద్మ భూషణ్ అందుకున్న మెగాస్టార్ ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొన్నేళ్ళకే కాంగ్రెస్ లోకి విలీనం చేసి ఇప్పుడు పూర్తిగా సినిమాలకే అంకింతమయ్యారు. పద్మవిభూషణ్ ఆయన నటనకు ఇస్తున్న గౌరవం కాదు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది రక్త నేత్ర దానాలు చేయడంతో పాటు కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణి, సినీ కార్మికులకు నిత్యావసరాల సరుకుల అందజేత లాంటి ఎన్నో కార్యక్రమాలు దగ్గరుండి జరిపించారు.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని అన్ని విధాలుగా అర్హత ఉందని తేలాకే నిర్ణయం తీసుకుని ఉంటారని ఢిల్లీ టాక్. ఇప్పటిదాకా మూడు వందల పై చిలుకు మాత్రమే పద్మభూషణ్ పురస్కారం అందుకున్న వాళ్లలో ఉన్నారు. చిరంజీవికి వాళ్ళ సరసన చోటు దక్కితే అంతకన్నా గర్వకారణం అభిమానులకు మరొకటి ఉండదు. అదేదో అఫీషియల్ గా చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో అడుగు పెట్టడానికి చిరు సిద్ధమవుతున్నారు. పద్మవిభూషణ్ వార్త గురించి మెగా వర్గాలు కానీ టాలీవుడ్ పెద్దలు కానీ స్పందించలేదు. సో ఖరారయ్యాక శుభవార్తను పంచుకోవచ్చు.
This post was last modified on January 18, 2024 10:44 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…