సలార్ బ్లాక్ బస్టర్ అయినందుకు హోంబాలే ఫిలిమ్స్ గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది. హీరో ప్రభాస్ తో పాటు క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం హాజరయ్యింది. సినిమా టోన్ కు తగ్గట్టు అందరూ నల్లని దుస్తుల్లో రావడం గమనార్హం. చాలా మంది సతీసమేతంగా విచ్చేయడం విశేషం. అయితే వేడుకలో అఖిల్ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అది కూడా వెరైటీగా తలకు బ్యాండ్ పెట్టుకుని, భుజం చుట్టూ వార్మ్ క్లాత్ (వస్త్రం) లాంటిది కప్పుకుని డిఫరెంట్ గా కనిపించాడు. ఇంకేముంది సలార్ 2లో అఖిల్ ఉన్నాడనే యాంగిల్ లో ఫ్యాన్స్ వెరైటీ విశ్లేషణలు, అంచనాలు మొదలుపెట్టారు.
దీనికి సంబంధించిన కారణాలు స్పష్టంగా తెలియలేదు కానీ ప్రభాస్ ఆహ్వానం మీదే వచ్చాడని ఇన్ సైడ్ టాక్. అయితే డార్లింగ్ పిలవాలనుకుంటే చాలా పెద్ద లిస్టు అవుతుంది. కానీ ప్రత్యేకంగా అఖిల్ కు మాత్రమే ఇన్విటేషన్ వెళ్తే ఎవరికైనా సందేహం రావడం సహజం. హోంబాలే ఫిలిమ్స్ తనతో ఏదైనా మూవీ ప్లాన్ చేస్తుందేమో క్లారిటీ లేదు కానీ సంథింగ్ సంథింగ్ తరహాలో ఏదో గుట్టు అయితే ఉంది. యూట్యూబ్ ఛానల్ లో అఫీషియల్ గా విడుదల చేసిన వీడియోలో అఖిల్ ని జస్ట్ ఒక ఫ్రేమ్ లో మాత్రమే చూపించారు. ఓపెన్ టెర్రస్ మీద చాలా గ్రాండ్ గా జరిగింది.
దీని సంగతి కాసేపు పక్కనపెడితే ఇలా ప్రైవేట్ ఈవెంట్స్ లో తప్ప అఖిల్ కొత్త సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో అర్థం కాక అభిమానుల ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి. యువి క్రియేషన్స్ ప్లాన్ చేసిన ప్యాన్ ఇండియా మూవీ లాక్ అయ్యింది కానీ ఎందుకనో మొదలుపెట్టడంలో ఆలస్యం చేస్తున్నారు. ఏజెంట్ డిజాస్టర్ దెబ్బకు అఖిల్ బాగా నెమ్మదించాడు. కొడుకు విషయంలో జోక్యం చేసుకోనని, పూర్తి స్వాతంత్రం తనదేనని నాగార్జున చెప్పేశాడు కాబట్టి కెరీర్ ప్లానింగ్ విషయంలో అఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. సంక్రాంతికి అనౌన్స్ మెంట్ వస్తుందనుకుంటే అదేమీ జరగలేదు.
This post was last modified on January 16, 2024 8:14 pm
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6…
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…
ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…
భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన…
ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…