ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద హనుమాన్ నమ్మశక్యం కానీ ఫీట్లు చేస్తున్నాడు. మహేష్ బాబుకి చాలా బలమైన బేస్ ఉన్న యుఎస్ లో గుంటూరు కారంని ఎక్కడో మైళ్ళ దూరంలో వెనక్కు నెట్టేసి ఏకంగా రాజమౌళి రికార్డుల మీద కన్నేస్తున్నాడు. కేవలం నాలుగు రోజులకే 3 మిలియన్ మార్క్ దాటేసి సరికొత్త బెంచ్ మార్కులను నెలకొల్పుతున్నాడు. ప్రస్తుతం హనుమాన్ కన్నా ముందు వరసలో ఉన్నవాటిని చూస్తే ఆదిపురుష్ 3.16, సాహు 3.23, భరత్ అనే నేను 3.41, రంగస్థలం 3.51, అల వైకుంఠపురములో 3.63, బాహుబలి బిగినింగ్ 8.47, సలార్ 8.90, ఆర్ఆర్ఆర్ 14.83, బాహుబలి కంక్లూజన్ 20.76 మిలియన్లతో ఉన్నాయి.
వీటిలో హనుమాన్ చాలా సులభంగా బాహుబలి బిగినింగ్ ని ఫుల్ రన్ లో దాటడం ఖాయంగా కనిపిస్తోంది. సలార్ ని క్రాస్ చేసే అవకాశాలు కొట్టిపారేయలేం. కాకపోతే ఇప్పుడున్న దూకుడుని ఇదే తరహాలో కొనసాగించాల్సి ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు సాధ్యమేననే అంచనాలో ఉన్నారు. జనవరి 22 అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ఇండియాకు రాలేకపోయినా ఎన్ఆర్ఐల్లో జై శ్రీరామ్ భావన బలంగా తిరుగుతోంది. దాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నారు కూడా. అందులో భాగంగానే హనుమాన్ ని థియేటర్లో ఎంజాయ్ చేసే వాళ్ళ సంఖ్య భారీగా ఉండబోతోంది.
ఎందరో టాలీవుడ్ హీరోలకు కలగా మిగిలిపోయిన 3 మిలియన్ మార్క్ ని తేజ సజ్జ అందుకోవడం షాకే. ఇది తన ఇమేజ్ వల్ల వచ్చిందని కాదు కానీ ఇంత భారీ ఫాంటసీ డ్రామాలో అతనే హీరో కావడం ఖచ్చితంగా కెరీర్ పరంగా చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. దగ్గరలో చెప్పుకోదగ్గ కొత్త రిలీజులేవి లేవు. నెలాఖరున వచ్చేవి కూడా హనుమాన్ కి అడ్డంకిగా నిలిచేవి కాదు. సో ఎంత లేదన్నా కనీసం రెండు వారాల పాటు హనుమాన్ విధ్వంసం కొనసాగటం ఖాయం. అక్కడి ఆడియన్స్ కి థాంక్స్ చెప్పేందుకు హనుమాన్ టీమ్ యుఎస్ ట్రిప్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉందట. ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
This post was last modified on January 16, 2024 3:07 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…