ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద హనుమాన్ నమ్మశక్యం కానీ ఫీట్లు చేస్తున్నాడు. మహేష్ బాబుకి చాలా బలమైన బేస్ ఉన్న యుఎస్ లో గుంటూరు కారంని ఎక్కడో మైళ్ళ దూరంలో వెనక్కు నెట్టేసి ఏకంగా రాజమౌళి రికార్డుల మీద కన్నేస్తున్నాడు. కేవలం నాలుగు రోజులకే 3 మిలియన్ మార్క్ దాటేసి సరికొత్త బెంచ్ మార్కులను నెలకొల్పుతున్నాడు. ప్రస్తుతం హనుమాన్ కన్నా ముందు వరసలో ఉన్నవాటిని చూస్తే ఆదిపురుష్ 3.16, సాహు 3.23, భరత్ అనే నేను 3.41, రంగస్థలం 3.51, అల వైకుంఠపురములో 3.63, బాహుబలి బిగినింగ్ 8.47, సలార్ 8.90, ఆర్ఆర్ఆర్ 14.83, బాహుబలి కంక్లూజన్ 20.76 మిలియన్లతో ఉన్నాయి.
వీటిలో హనుమాన్ చాలా సులభంగా బాహుబలి బిగినింగ్ ని ఫుల్ రన్ లో దాటడం ఖాయంగా కనిపిస్తోంది. సలార్ ని క్రాస్ చేసే అవకాశాలు కొట్టిపారేయలేం. కాకపోతే ఇప్పుడున్న దూకుడుని ఇదే తరహాలో కొనసాగించాల్సి ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు సాధ్యమేననే అంచనాలో ఉన్నారు. జనవరి 22 అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ఇండియాకు రాలేకపోయినా ఎన్ఆర్ఐల్లో జై శ్రీరామ్ భావన బలంగా తిరుగుతోంది. దాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నారు కూడా. అందులో భాగంగానే హనుమాన్ ని థియేటర్లో ఎంజాయ్ చేసే వాళ్ళ సంఖ్య భారీగా ఉండబోతోంది.
ఎందరో టాలీవుడ్ హీరోలకు కలగా మిగిలిపోయిన 3 మిలియన్ మార్క్ ని తేజ సజ్జ అందుకోవడం షాకే. ఇది తన ఇమేజ్ వల్ల వచ్చిందని కాదు కానీ ఇంత భారీ ఫాంటసీ డ్రామాలో అతనే హీరో కావడం ఖచ్చితంగా కెరీర్ పరంగా చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. దగ్గరలో చెప్పుకోదగ్గ కొత్త రిలీజులేవి లేవు. నెలాఖరున వచ్చేవి కూడా హనుమాన్ కి అడ్డంకిగా నిలిచేవి కాదు. సో ఎంత లేదన్నా కనీసం రెండు వారాల పాటు హనుమాన్ విధ్వంసం కొనసాగటం ఖాయం. అక్కడి ఆడియన్స్ కి థాంక్స్ చెప్పేందుకు హనుమాన్ టీమ్ యుఎస్ ట్రిప్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉందట. ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
This post was last modified on January 16, 2024 3:07 pm
ఏపీలోని అన్నమయ్య జిల్లా వెలసిన ఒంటమిట్ల రాములోరికి శుక్రవారం భారీ బంగారు కిరీటాలు విరాళంగా అందాయి. రాములోరితో పాటుగా సీతమ్మ…
"మాది బీసీ పక్షపాత పార్టీ. ఇంకా చెప్పాలంటే.. బీసీల పార్టీ" అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యా ఖ్యానించారు.…
ఖాకీ చొక్కను వదిలి ఖద్దరు చొక్కా వేసుకున్న వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం సాయంత్రం…
"మీరు చెబుతున్న మాటలను బట్టి.. మీరు అడుగుతున్న గడువును బట్టి.. బీఆర్ఎస్ సభను నిర్వహించరాదన్న ఉద్దేశం కనిపిస్తోందని మేం భావించేలా…
రెండు దశాబ్దాల కెరీర్ అయిపోయినా ఇంకా హీరోయిన్ గా చెలామణి అవుతున్న అతికొద్ది మందిలో త్రిష స్థానం మొదటిదని చెప్పాలి.…
తాజాగా టీడీపీ కార్యకర్త ఒకరు.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన…