ఈ ఏడాది సంక్రాంతి సీజన్ ఆరంభానికి కొన్ని వారాలు ముందు వరకు పండుగకు రిలీజ్ అయ్యే సినిమాల్లో అన్నిటికంటే చిన్నది లాగా కనిపించింది హనుమాన్. కానీ ఎవరు ఊహించని విధంగా ఇది సంక్రాంతి సినిమాల్లో బిగ్గెస్ట్ మూవీగా అవతరిస్తోంది. రిలీజ్ కు ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ నుంచే అదిరిపోయే టాక్ తెచ్చుకొని.. హౌస్ ఫుల్స్ తో నడవడం మొదలైంది హనుమాన్.
ఇక అక్కడి నుంచి ఈ సినిమా అస్సలు తగ్గట్లేదు. పెద్ద పెద్ద చిత్రాలకు కూడా లేనంతగా ఈ సినిమా టికెట్ల కోసం డిమాండ్ ఏర్పడింది. పెట్టిన షోలు పెట్టినట్లు సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. అదనపు షోల కోసం డిమాండ్ విపరీతంగా ఉంది. బుక్ మై షోలో హనుమాన్ టికెట్ల అమ్మకాల ట్రెండ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.
హనుమాన్ ఒక్కదానికి అమ్ముడు అవుతున్న టికెట్లు.. మిగతా మూడు సంక్రాంతి సినిమాల సేల్స్ కంటే ఎక్కువ ఉండడం విశేషం. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు 24 గంటల వ్యవధిలో హనుమాన్ కు బుక్ మై షో లో 3.96 లక్షల టికెట్లు అమ్ముడైతే.. మహేష్ బాబు మూవీ గుంటూరు కారం టికెట్లు లక్షన్నర సేల్ అయ్యాయి.
నాగార్జున సినిమా నా సామి రంగకు 96 వేల టిక్కెట్లు.. వెంకటేష్ మూవీ సైంధవ్ కు 47 వేల చొప్పున టిక్కెట్లు తెగాయి. బడ్జెట్, బిజినెస్, స్టార్ కాస్ట్ పరంగా హనుమాన్ కంటే పెద్ద సినిమాలు అయిన గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్ మూడు కలిపినా కూడా టికెట్ల అమ్మకాలు మూడు లక్షలు లోపే ఉన్నాయి. కానీ హనుమాన్ 24 గంటల వ్యవధిలో వీటి కంటే లక్ష టికెట్లు ఎక్కువే సేల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. హనుమాన్ ప్రభంజనానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు.
This post was last modified on January 15, 2024 11:18 pm
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. సమావేశాలను వారు ప్రత్యక్షంగా…