భార్యా భర్తల మధ్య విడాకులు ఆ జంటకు వర్తిస్తుంది కానీ పిల్లలకు రెండు కుటుంబాల మధ్య అనుబంధాన్ని కాదు. రేణు దేశాయి తో విడిపోయినా పవన్ కళ్యాణ్ వారసుడిగానే అకీరా నందన్ ని చూస్తున్నారు అభిమానులు. కుర్రాడు టీనేజ్ వయసు దాటేస్తున్నాడు. చదువు కొనసాగిస్తున్నాడు కానీ రూపం మాత్రం హీరో లక్షణాలకు మ్యాచ్ అవుతోందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా మొత్తం మెగా అల్లు ఫ్యామిలీలు బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. జనసేన పనుల వల్ల ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప పిల్లా పీచుతో సహా మెగా గ్యాంగ్ మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా అకీరా, ఆద్య ఇద్దరూ కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతోంది. బాబు మీసాలు గెడ్డంతో దర్శక నిర్మాతలకు తన మీద ఒక ఐడియా వచ్చేలా క్లూస్ ఇస్తున్నాడు. టాలీవుడ్ కు పరిచయం చేయడం గురించి రేణు దేశాయ్ పలు సందర్భాల్లో అంతా ఆసక్తి లేదనే సంకేతం ఇచ్చినప్పటికీ అంతర్గతంగా లాంచ్ చేయించే ప్లాన్ అయితే జరుగుతోందట. అయితే పవన్ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తాడనేది కీలకం. పవన్ ఆఖరి సంతానం ఇంకా చాలా చిన్న వయసు కాబట్టి ఫ్యాన్స్ చూపు అకీరా మీదే ఉంది. తగిన శిక్షణ ఇచ్చి దింపితే మంచి కెరీర్ సెట్ చేసుకోవచ్చని అంటున్నారు.
ఇది తేలడానికి టైం అయితే పడుతుంది. ఎందుకంటే వారసుల విషయాల్లో తల్లితండ్రుల నిర్ణయాలే కీలకం. చిరంజీవి, పవన్ చెబితే రేణు దేశాయ్ నో అనకపోవచ్చు కానీ ఎంట్రీ ఎప్పుడు అనేదే సస్పెన్స్. ఒక్కసారి ఎస్ అనాలే కానీ నిర్మాతలు క్యూ కట్టేస్తారు. పైగా పవన్ సినిమాల మీద ఎక్కువ ఆసక్తి చూపించడం లేదు. కేవలం జనసేనని బలపరచడం కోసం రెమ్యునరేషన్లు తీసుకుని నటించడమే కానీ సీరియస్ కెరీర్ మీద ఫోకస్ పెట్టడం లేదు. అలాంటప్పుడు ఫ్యాన్స్ సహజంగా అకీరానే కోరుకుంటారు. మరి జూనియర్ పవర్ స్టార్ ఎప్పుడు వచ్చేది కాలమే సమాధానం చెప్పాలి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…