భార్యా భర్తల మధ్య విడాకులు ఆ జంటకు వర్తిస్తుంది కానీ పిల్లలకు రెండు కుటుంబాల మధ్య అనుబంధాన్ని కాదు. రేణు దేశాయి తో విడిపోయినా పవన్ కళ్యాణ్ వారసుడిగానే అకీరా నందన్ ని చూస్తున్నారు అభిమానులు. కుర్రాడు టీనేజ్ వయసు దాటేస్తున్నాడు. చదువు కొనసాగిస్తున్నాడు కానీ రూపం మాత్రం హీరో లక్షణాలకు మ్యాచ్ అవుతోందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా మొత్తం మెగా అల్లు ఫ్యామిలీలు బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. జనసేన పనుల వల్ల ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప పిల్లా పీచుతో సహా మెగా గ్యాంగ్ మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా అకీరా, ఆద్య ఇద్దరూ కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతోంది. బాబు మీసాలు గెడ్డంతో దర్శక నిర్మాతలకు తన మీద ఒక ఐడియా వచ్చేలా క్లూస్ ఇస్తున్నాడు. టాలీవుడ్ కు పరిచయం చేయడం గురించి రేణు దేశాయ్ పలు సందర్భాల్లో అంతా ఆసక్తి లేదనే సంకేతం ఇచ్చినప్పటికీ అంతర్గతంగా లాంచ్ చేయించే ప్లాన్ అయితే జరుగుతోందట. అయితే పవన్ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తాడనేది కీలకం. పవన్ ఆఖరి సంతానం ఇంకా చాలా చిన్న వయసు కాబట్టి ఫ్యాన్స్ చూపు అకీరా మీదే ఉంది. తగిన శిక్షణ ఇచ్చి దింపితే మంచి కెరీర్ సెట్ చేసుకోవచ్చని అంటున్నారు.
ఇది తేలడానికి టైం అయితే పడుతుంది. ఎందుకంటే వారసుల విషయాల్లో తల్లితండ్రుల నిర్ణయాలే కీలకం. చిరంజీవి, పవన్ చెబితే రేణు దేశాయ్ నో అనకపోవచ్చు కానీ ఎంట్రీ ఎప్పుడు అనేదే సస్పెన్స్. ఒక్కసారి ఎస్ అనాలే కానీ నిర్మాతలు క్యూ కట్టేస్తారు. పైగా పవన్ సినిమాల మీద ఎక్కువ ఆసక్తి చూపించడం లేదు. కేవలం జనసేనని బలపరచడం కోసం రెమ్యునరేషన్లు తీసుకుని నటించడమే కానీ సీరియస్ కెరీర్ మీద ఫోకస్ పెట్టడం లేదు. అలాంటప్పుడు ఫ్యాన్స్ సహజంగా అకీరానే కోరుకుంటారు. మరి జూనియర్ పవర్ స్టార్ ఎప్పుడు వచ్చేది కాలమే సమాధానం చెప్పాలి.
This post was last modified on January 15, 2024 4:54 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…