Movie News

గేమ్ ఛేంజర్ మౌనానికి కారణాలివే

సంక్రాంతి వచ్చిందని ఎప్పుడో ఏడాది తర్వాత రిలీజయ్యే ప్యాన్ ఇండియా సినిమాలకు కూడా అప్డేట్లు, పోస్టర్లు వదులుతున్నారు కానీ గేమ్ ఛేంజర్ బృందం నిమ్మకు నీరెత్తనట్టు ఉందని మెగా ఫ్యాన్స్ కస్సుమంటున్నారు. టైటిల్ రివీల్ చేసి నెలలు గడిచిపోతున్నా ఇప్పటిదాకా చిన్న వీడియో కంటెంట్ రాలేదు. పోనీ ఇప్పుడు మంచి సందర్భం వచ్చిందని సంతోషపడితే దాన్ని కూడా వృథా చేస్తున్నారని అభిమానులు వాపోతున్నారు. దీపావళికి జరగండి జరగండి ఆడియో సింగల్ రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా అనౌన్స్ చేశాక చివరి నిమిషంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

అసలేం జరుగుతోందని కనుక్కునే ప్రయత్నం చేస్తే కొన్ని వివరాలు తెలిశాయి. మొదటిది ఉగాది నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టాలని దిల్ రాజు టీమ్ నిర్ణయించుకుందట. అప్పటిదాకా ఎవరెంత మొత్తుకున్నా వినే సమస్య లేదని వినికిడి. రెండోది దర్శకుడు శంకర్ చరణ్ మూవీ షూట్ తో పాటు ఇండియన్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ కన్నా ముందు అది రిలీజ్ అవుతుంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. టీజర్ కట్ ఈయనకు చెప్పకుండా ఎడిట్ చేయలేరు. సో ఎదురు చూడాలి. మూడోది సినిమా విడుదల అనుకున్న సెప్టెంబర్ ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే గేమ్ ఛేంజర్ నుంచి ఎలాంటి స్టఫ్ ఇవ్వడం లేదని సమాచారం. రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి బెంగళూరు వెళ్ళాడు. తను లేని సీన్లనే ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. కాస్త ఫ్రీ టైం దొరికాక టీజర్ పనులు చూస్తానని నిర్మాత దిల్ రాజుకి శంకర్ చెప్పినట్టు తెలిసింది. సో ఎదురు చూపులు కొనసాగించక తప్పదు. ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతున్న తమన్ ఆశలన్నీ గేమ్ ఛేంజర్ మీదే ఉన్నాయి. కెరీర్ లోనే బెస్ట్ ఆల్బమ్స్ లో ఒకటిగా ఇది నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాడు. సో గేమ్ కోసం వెయిటింగ్ చేయడం తప్ప చేయగలిగింది ఏమి లేదు. 

This post was last modified on January 14, 2024 3:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీ కోరినట్టుగానే.. ‘వాల్తేర్’తోనే విశాఖ రైల్వే జోన్

కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…

38 minutes ago

హమ్మయ్యా… బెర్తులన్నీ సేఫ్

తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

3 hours ago

ర్యాంకులపై వైసీపీ రచ్చ..చంద్రబాబు కౌంటర్

సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…

7 hours ago

పేదల గుండెకు బాబు సర్కారు భరోసా

ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…

8 hours ago

రతన్ టాటా మిస్టరీ ట్విస్ట్.. అతని పేరు మీద 500 కోట్లు

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…

9 hours ago

“జ‌గ‌న్‌ది.. పొలిటిక‌ల్ రేప్‌.. నా మాట విను!”

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయకుడు సాకే శైల‌జానాథ్‌.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం…

9 hours ago