Movie News

గేమ్ ఛేంజర్ మౌనానికి కారణాలివే

సంక్రాంతి వచ్చిందని ఎప్పుడో ఏడాది తర్వాత రిలీజయ్యే ప్యాన్ ఇండియా సినిమాలకు కూడా అప్డేట్లు, పోస్టర్లు వదులుతున్నారు కానీ గేమ్ ఛేంజర్ బృందం నిమ్మకు నీరెత్తనట్టు ఉందని మెగా ఫ్యాన్స్ కస్సుమంటున్నారు. టైటిల్ రివీల్ చేసి నెలలు గడిచిపోతున్నా ఇప్పటిదాకా చిన్న వీడియో కంటెంట్ రాలేదు. పోనీ ఇప్పుడు మంచి సందర్భం వచ్చిందని సంతోషపడితే దాన్ని కూడా వృథా చేస్తున్నారని అభిమానులు వాపోతున్నారు. దీపావళికి జరగండి జరగండి ఆడియో సింగల్ రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా అనౌన్స్ చేశాక చివరి నిమిషంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

అసలేం జరుగుతోందని కనుక్కునే ప్రయత్నం చేస్తే కొన్ని వివరాలు తెలిశాయి. మొదటిది ఉగాది నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టాలని దిల్ రాజు టీమ్ నిర్ణయించుకుందట. అప్పటిదాకా ఎవరెంత మొత్తుకున్నా వినే సమస్య లేదని వినికిడి. రెండోది దర్శకుడు శంకర్ చరణ్ మూవీ షూట్ తో పాటు ఇండియన్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ కన్నా ముందు అది రిలీజ్ అవుతుంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. టీజర్ కట్ ఈయనకు చెప్పకుండా ఎడిట్ చేయలేరు. సో ఎదురు చూడాలి. మూడోది సినిమా విడుదల అనుకున్న సెప్టెంబర్ ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే గేమ్ ఛేంజర్ నుంచి ఎలాంటి స్టఫ్ ఇవ్వడం లేదని సమాచారం. రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి బెంగళూరు వెళ్ళాడు. తను లేని సీన్లనే ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. కాస్త ఫ్రీ టైం దొరికాక టీజర్ పనులు చూస్తానని నిర్మాత దిల్ రాజుకి శంకర్ చెప్పినట్టు తెలిసింది. సో ఎదురు చూపులు కొనసాగించక తప్పదు. ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతున్న తమన్ ఆశలన్నీ గేమ్ ఛేంజర్ మీదే ఉన్నాయి. కెరీర్ లోనే బెస్ట్ ఆల్బమ్స్ లో ఒకటిగా ఇది నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాడు. సో గేమ్ కోసం వెయిటింగ్ చేయడం తప్ప చేయగలిగింది ఏమి లేదు. 

This post was last modified on January 14, 2024 3:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

5 minutes ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

36 minutes ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

2 hours ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

4 hours ago

మదనపల్లి ఘటన మరువకముందే… మరో మృగాడు!

మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…

5 hours ago