సంక్రాంతి సినిమాల్లో పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో నాగార్జునని మాస్ అవతారంలో చూపించబోతున్న నా సామిరంగ మీద అభిమానులకు పెద్ద అంచనాలే ఉన్నాయి. వేగంగా షూటింగ్ జరుపుకున్నప్పటికీ అవసరమైన బజ్ తేవడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. అయితే విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ట్రైలర్ ఎలా ఉండబోతోందనే దాని మీద రేసులో ఉన్న ఇతర హీరోల అభిమానులూ ఆసక్తిని పెంచుకున్నారు. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేయబోతున్న నా సామిరంగకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం ఆకర్షణగా నిలవబోతోంది. ఇంతకీ వీడియోలో ఏం చెప్పారు.
ఎక్కడో గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామం. క్రిష్టయ్య(నాగార్జున)అంటే తప్పుడోళ్లకు దడ. అందరితో కలివిడిగా ఉంటూ ఏదైనా తేడా వస్తే దుమ్ము దుమారం రేపే టైపు. స్నేహితులు అంజి(అల్లరి నరేష్), భాస్కర్(రాజ్ తరుణ్) అంటే ప్రాణం. వరలక్ష్మి(ఆశికా రంగనాథ్)ని ప్రాణంగా ప్రేమిస్తాడు కానీ జీవిత భాగస్వామిని చేసుకోలేకపోతాడు. అయితే జాతర సందర్భంగా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తీసుకెళ్లే ప్రభల తీర్థం విషయంలో గొడవలు మొదలవుతాయి. అది వస్తే శుభం జరుగుతుందని కిష్టయ్య కావాలని దానికి అడ్డుపడుతున్న దుర్మార్గులను అడ్డు తొలగించేందుకు వెనుకాడడు. అదెలాగో తెరమీద చూడాలి.
చాలా ఏళ్ళ తర్వాత నాగార్జునని ఇంత ఊర మాస్ గా చూడటం అభిమానులకు కనువిందే. అల్లరి నరేష్ టైమింగ్, ఆశికా రంగనాథ్ గ్లామర్ తో పాటు పక్కా పల్లెటూరి నేపథ్యంలో రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ రాసిన డైలాగులు పేలేలా ఉన్నాయి. దర్శకుడు విజయ్ బిన్నీ డెబ్యూలో అనుభవం కనిపిస్తోంది. ‘ఈసారి పండక్కి నా సామిరంగ’ అంటూ ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొత్తంగా బిసి సెంటర్లలో మోత మోగించేలా ఉంది. ఓవర్ స్టయిలిష్ యాక్షన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి కమర్షియల్ టర్నింగ్ తీసుకున్న నాగార్జున సామిరంగపై నమ్మకాన్ని అమాంతం పెంచేశాడు.
This post was last modified on January 9, 2024 4:19 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…