సంక్రాంతి సినిమాల్లో పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో నాగార్జునని మాస్ అవతారంలో చూపించబోతున్న నా సామిరంగ మీద అభిమానులకు పెద్ద అంచనాలే ఉన్నాయి. వేగంగా షూటింగ్ జరుపుకున్నప్పటికీ అవసరమైన బజ్ తేవడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. అయితే విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ట్రైలర్ ఎలా ఉండబోతోందనే దాని మీద రేసులో ఉన్న ఇతర హీరోల అభిమానులూ ఆసక్తిని పెంచుకున్నారు. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేయబోతున్న నా సామిరంగకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం ఆకర్షణగా నిలవబోతోంది. ఇంతకీ వీడియోలో ఏం చెప్పారు.
ఎక్కడో గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామం. క్రిష్టయ్య(నాగార్జున)అంటే తప్పుడోళ్లకు దడ. అందరితో కలివిడిగా ఉంటూ ఏదైనా తేడా వస్తే దుమ్ము దుమారం రేపే టైపు. స్నేహితులు అంజి(అల్లరి నరేష్), భాస్కర్(రాజ్ తరుణ్) అంటే ప్రాణం. వరలక్ష్మి(ఆశికా రంగనాథ్)ని ప్రాణంగా ప్రేమిస్తాడు కానీ జీవిత భాగస్వామిని చేసుకోలేకపోతాడు. అయితే జాతర సందర్భంగా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తీసుకెళ్లే ప్రభల తీర్థం విషయంలో గొడవలు మొదలవుతాయి. అది వస్తే శుభం జరుగుతుందని కిష్టయ్య కావాలని దానికి అడ్డుపడుతున్న దుర్మార్గులను అడ్డు తొలగించేందుకు వెనుకాడడు. అదెలాగో తెరమీద చూడాలి.
చాలా ఏళ్ళ తర్వాత నాగార్జునని ఇంత ఊర మాస్ గా చూడటం అభిమానులకు కనువిందే. అల్లరి నరేష్ టైమింగ్, ఆశికా రంగనాథ్ గ్లామర్ తో పాటు పక్కా పల్లెటూరి నేపథ్యంలో రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ రాసిన డైలాగులు పేలేలా ఉన్నాయి. దర్శకుడు విజయ్ బిన్నీ డెబ్యూలో అనుభవం కనిపిస్తోంది. ‘ఈసారి పండక్కి నా సామిరంగ’ అంటూ ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొత్తంగా బిసి సెంటర్లలో మోత మోగించేలా ఉంది. ఓవర్ స్టయిలిష్ యాక్షన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి కమర్షియల్ టర్నింగ్ తీసుకున్న నాగార్జున సామిరంగపై నమ్మకాన్ని అమాంతం పెంచేశాడు.
This post was last modified on January 9, 2024 4:19 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…