సంక్రాంతి సినిమాల్లో పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో నాగార్జునని మాస్ అవతారంలో చూపించబోతున్న నా సామిరంగ మీద అభిమానులకు పెద్ద అంచనాలే ఉన్నాయి. వేగంగా షూటింగ్ జరుపుకున్నప్పటికీ అవసరమైన బజ్ తేవడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. అయితే విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ట్రైలర్ ఎలా ఉండబోతోందనే దాని మీద రేసులో ఉన్న ఇతర హీరోల అభిమానులూ ఆసక్తిని పెంచుకున్నారు. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేయబోతున్న నా సామిరంగకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం ఆకర్షణగా నిలవబోతోంది. ఇంతకీ వీడియోలో ఏం చెప్పారు.
ఎక్కడో గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామం. క్రిష్టయ్య(నాగార్జున)అంటే తప్పుడోళ్లకు దడ. అందరితో కలివిడిగా ఉంటూ ఏదైనా తేడా వస్తే దుమ్ము దుమారం రేపే టైపు. స్నేహితులు అంజి(అల్లరి నరేష్), భాస్కర్(రాజ్ తరుణ్) అంటే ప్రాణం. వరలక్ష్మి(ఆశికా రంగనాథ్)ని ప్రాణంగా ప్రేమిస్తాడు కానీ జీవిత భాగస్వామిని చేసుకోలేకపోతాడు. అయితే జాతర సందర్భంగా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తీసుకెళ్లే ప్రభల తీర్థం విషయంలో గొడవలు మొదలవుతాయి. అది వస్తే శుభం జరుగుతుందని కిష్టయ్య కావాలని దానికి అడ్డుపడుతున్న దుర్మార్గులను అడ్డు తొలగించేందుకు వెనుకాడడు. అదెలాగో తెరమీద చూడాలి.
చాలా ఏళ్ళ తర్వాత నాగార్జునని ఇంత ఊర మాస్ గా చూడటం అభిమానులకు కనువిందే. అల్లరి నరేష్ టైమింగ్, ఆశికా రంగనాథ్ గ్లామర్ తో పాటు పక్కా పల్లెటూరి నేపథ్యంలో రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ రాసిన డైలాగులు పేలేలా ఉన్నాయి. దర్శకుడు విజయ్ బిన్నీ డెబ్యూలో అనుభవం కనిపిస్తోంది. ‘ఈసారి పండక్కి నా సామిరంగ’ అంటూ ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొత్తంగా బిసి సెంటర్లలో మోత మోగించేలా ఉంది. ఓవర్ స్టయిలిష్ యాక్షన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి కమర్షియల్ టర్నింగ్ తీసుకున్న నాగార్జున సామిరంగపై నమ్మకాన్ని అమాంతం పెంచేశాడు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…