సంక్రాంతి సినిమాల్లో పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో నాగార్జునని మాస్ అవతారంలో చూపించబోతున్న నా సామిరంగ మీద అభిమానులకు పెద్ద అంచనాలే ఉన్నాయి. వేగంగా షూటింగ్ జరుపుకున్నప్పటికీ అవసరమైన బజ్ తేవడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. అయితే విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ట్రైలర్ ఎలా ఉండబోతోందనే దాని మీద రేసులో ఉన్న ఇతర హీరోల అభిమానులూ ఆసక్తిని పెంచుకున్నారు. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేయబోతున్న నా సామిరంగకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం ఆకర్షణగా నిలవబోతోంది. ఇంతకీ వీడియోలో ఏం చెప్పారు.
ఎక్కడో గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామం. క్రిష్టయ్య(నాగార్జున)అంటే తప్పుడోళ్లకు దడ. అందరితో కలివిడిగా ఉంటూ ఏదైనా తేడా వస్తే దుమ్ము దుమారం రేపే టైపు. స్నేహితులు అంజి(అల్లరి నరేష్), భాస్కర్(రాజ్ తరుణ్) అంటే ప్రాణం. వరలక్ష్మి(ఆశికా రంగనాథ్)ని ప్రాణంగా ప్రేమిస్తాడు కానీ జీవిత భాగస్వామిని చేసుకోలేకపోతాడు. అయితే జాతర సందర్భంగా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తీసుకెళ్లే ప్రభల తీర్థం విషయంలో గొడవలు మొదలవుతాయి. అది వస్తే శుభం జరుగుతుందని కిష్టయ్య కావాలని దానికి అడ్డుపడుతున్న దుర్మార్గులను అడ్డు తొలగించేందుకు వెనుకాడడు. అదెలాగో తెరమీద చూడాలి.
చాలా ఏళ్ళ తర్వాత నాగార్జునని ఇంత ఊర మాస్ గా చూడటం అభిమానులకు కనువిందే. అల్లరి నరేష్ టైమింగ్, ఆశికా రంగనాథ్ గ్లామర్ తో పాటు పక్కా పల్లెటూరి నేపథ్యంలో రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ రాసిన డైలాగులు పేలేలా ఉన్నాయి. దర్శకుడు విజయ్ బిన్నీ డెబ్యూలో అనుభవం కనిపిస్తోంది. ‘ఈసారి పండక్కి నా సామిరంగ’ అంటూ ఎంఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొత్తంగా బిసి సెంటర్లలో మోత మోగించేలా ఉంది. ఓవర్ స్టయిలిష్ యాక్షన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి కమర్షియల్ టర్నింగ్ తీసుకున్న నాగార్జున సామిరంగపై నమ్మకాన్ని అమాంతం పెంచేశాడు.
This post was last modified on January 9, 2024 4:19 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…