కేవలం ఇంకో వారం రోజుల్లో గుంటూరు కారం థియేటర్లలో అడుగు పెట్టనుంది. సెన్సార్ అయిపోయింది. రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నిడివితో ఫైనల్ కట్ లాక్ చేసుకున్నారు. రీ రికార్డింగ్ పనులు పూర్తయ్యాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రైలర్ లాంచ్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదిరిపోయే పోస్టర్లు తప్ప ఇప్పటిదాకా సాలిడ్ గా అనిపించే వీడియో కంటెంట్ ఏదీ త్రివిక్రమ్ బృందం వదల్లేదు. అయినా సరే హైప్ కి ఏ మాత్రం కొదవ లేకుండా మహేష్ బాబు మేనేజ్ చేస్తున్నాడు.
తాజా అప్డేట్ ప్రకారం గుంటూరు కారంకి అర్ధరాత్రి ప్రీమియర్లు వేసే దిశగా తీవ్ర సమాలోచనలు జరుగుతున్నాయట. సలార్ లాగే నైజామ్ మిడ్ నైట్ షోలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఆ మేరకు ఎంపిక కొన్ని సింగల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించేందుకు గల సాధ్యాసాధ్యాలు, ఇబ్బందులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి ఆట ఏఎంబిలో ఉండొచ్చని తెలిసింది. తెల్లవారుఝామున 4 గంటలకు కన్ఫర్మే కానీ ఒంట గంట వ్యవహారం ఇంకో రెండు మూడు రోజుల్లో తేలనుంది. కథ గురించి ఓ వర్గంలో జరుగుతున్న ప్రచారం పట్ల నాగవంశీ సెటైరిక్ ట్విట్లు వేస్తున్నారు.
ఏది జరిగినా గుంటూరు కారం మొదటి రోజు ర్యాంపేజ్ ఓ రేంజ్ లో ఉండబోతోంది. నైజామ్ లో రికార్డులు బద్దలు కావడం ఖాయమే. టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన జిఓ జనవరి 9 లోపు రావొచ్చని డిస్ట్రిబ్యూటర్లు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి రిలీజులన్నీ హైక్ అడిగే ఆలోచనలో ఉన్నాయి. హనుమాన్, సైంధవ్ రెండూ భారీ బడ్జెట్ చిత్రాలే. నా సామిరంగ అంత ఖర్చు కాకపోయినా నాగార్జున హీరో కాబట్టి పెద్ద సినిమా కిందకే వస్తుంది. జనవరి 11 రాత్రి హనుమాన్ ప్రీమియర్లు వేసే ప్లాన్ లో ఉండగా గుంటూరు కారం తీసుకునే నిర్ణయం బాక్సాఫీస్ ని వాడివేడిగా మార్చబోతోంది.
This post was last modified on January 5, 2024 1:49 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…