నిర్మాతల కష్టం అర్థం చేసుకోవాలని హీరోలకు పిలుపునిచ్చాడు నేచురల్ స్టార్ నాని. కరోనా కారణంగా నిర్మాతలు కుదేలైపోయారని.. ఈ నేపథ్యంలో పారితోషకాలు తగ్గించుకోవాలని అతను సూచించాడు. ఏ సినిమా అయినా లాభం రావాలన్న ఉద్దేశంతోనే మొదలుపెడతామని.. ఆశించినంత వసూళ్లు రావన్నపుడు తప్పకుండా పారితోషకం తగ్గించాలని.. నిర్మాతలకు నష్టం రాకుండా చూసుకోవడం మన బాధ్యత అని నటీనటులు, టెక్నీషియన్లను ఉద్దేశించి అతనన్నాడు.
అలాగని హీరోలందరూ తమ పారితోషకాన్ని తగ్గించుకోవాలని తాను జనరల్ స్టేట్మెంట్ ఇవ్వనని.. ఒక సినిమాకు నష్టాలు వస్తున్నాయి, ఆశించిన లాభాలు రావట్లేదు అన్నపుడు పారితోషకం తగ్గించుకోవడమో, లేదా కొంత వెనక్కి ఇవ్వడమో చేయాలని.. నిర్మాతకు ఏమీ మిగలదనుకుంటే జీరో పారితోషకానికి కూడా వెనుకాడకూడదని నాని అన్నాడు.
ఇక శుక్రవారం అర్ధరాత్రి అమేజాన్ ప్రైమ్ ద్వారా తన సినిమా ‘వి’ విడుదల కాబోతుండటం గురించి నాని స్పందిస్తూ.. థియేటర్లలోనే తన సినిమా రిలీజ్ కావాలని కోరుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ తప్ప మరో మార్గం లేదని.. 200 దేశాల్లో ఈ చిత్రం విడుదల కాబోతుండటం సంతోషమే అని నాని అన్నాడు. ఈ సినపిమా అనుభవం గురించి నాలుగేళ్ల తర్వాత కూడా కథలు కథలుగా చెప్పుకోవచ్చని అతనన్నాడు.
తన కొత్త సినిమాల గురించి చెబుతూ.. ‘టక్ జగదీష్’ షూటింగ్ను అక్టోబరు మొదటి వారంలో తిరిగి మొదలుపెడతామని.. అది పూర్తయ్యాక ‘ట్యాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్లో ‘శ్యామ్ సింగ రాయ్’ ఆరంభమవుతుందని.. ఇవి కాక రెండు సినిమాలు ఒప్పుకున్నానని నాని తెలిపాడు. అందులో ఒకటి ఓ స్టార్ డైరెక్టర్తో ఉంటుందని, మరొకటి కొత్త దర్శకుడితో చేస్తానని నాని వెల్లడించాడు.
This post was last modified on September 4, 2020 1:55 pm
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…