నిర్మాతల కష్టం అర్థం చేసుకోవాలని హీరోలకు పిలుపునిచ్చాడు నేచురల్ స్టార్ నాని. కరోనా కారణంగా నిర్మాతలు కుదేలైపోయారని.. ఈ నేపథ్యంలో పారితోషకాలు తగ్గించుకోవాలని అతను సూచించాడు. ఏ సినిమా అయినా లాభం రావాలన్న ఉద్దేశంతోనే మొదలుపెడతామని.. ఆశించినంత వసూళ్లు రావన్నపుడు తప్పకుండా పారితోషకం తగ్గించాలని.. నిర్మాతలకు నష్టం రాకుండా చూసుకోవడం మన బాధ్యత అని నటీనటులు, టెక్నీషియన్లను ఉద్దేశించి అతనన్నాడు.
అలాగని హీరోలందరూ తమ పారితోషకాన్ని తగ్గించుకోవాలని తాను జనరల్ స్టేట్మెంట్ ఇవ్వనని.. ఒక సినిమాకు నష్టాలు వస్తున్నాయి, ఆశించిన లాభాలు రావట్లేదు అన్నపుడు పారితోషకం తగ్గించుకోవడమో, లేదా కొంత వెనక్కి ఇవ్వడమో చేయాలని.. నిర్మాతకు ఏమీ మిగలదనుకుంటే జీరో పారితోషకానికి కూడా వెనుకాడకూడదని నాని అన్నాడు.
ఇక శుక్రవారం అర్ధరాత్రి అమేజాన్ ప్రైమ్ ద్వారా తన సినిమా ‘వి’ విడుదల కాబోతుండటం గురించి నాని స్పందిస్తూ.. థియేటర్లలోనే తన సినిమా రిలీజ్ కావాలని కోరుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ తప్ప మరో మార్గం లేదని.. 200 దేశాల్లో ఈ చిత్రం విడుదల కాబోతుండటం సంతోషమే అని నాని అన్నాడు. ఈ సినపిమా అనుభవం గురించి నాలుగేళ్ల తర్వాత కూడా కథలు కథలుగా చెప్పుకోవచ్చని అతనన్నాడు.
తన కొత్త సినిమాల గురించి చెబుతూ.. ‘టక్ జగదీష్’ షూటింగ్ను అక్టోబరు మొదటి వారంలో తిరిగి మొదలుపెడతామని.. అది పూర్తయ్యాక ‘ట్యాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్లో ‘శ్యామ్ సింగ రాయ్’ ఆరంభమవుతుందని.. ఇవి కాక రెండు సినిమాలు ఒప్పుకున్నానని నాని తెలిపాడు. అందులో ఒకటి ఓ స్టార్ డైరెక్టర్తో ఉంటుందని, మరొకటి కొత్త దర్శకుడితో చేస్తానని నాని వెల్లడించాడు.
This post was last modified on September 4, 2020 1:55 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…