సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది మృణాల్ ఠాకూర్. ఆ చిత్రంలో సీత పాత్రలో తనను తప్ప ఇంకొకరిని ఊహించుకోలేని పెర్ఫార్మన్స్ ఇచ్చిందామె. అందం, అభినయం రెండింటితోను కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది మృణాల్. ఆ సినిమా తర్వాత కూడా ఆమెకు తెలుగులో మంచి మంచి అవకాశాలే వస్తున్నాయి.
ఇప్పటికే హాయ్ నాన్నతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో కూడా ఆమెనే కథానాయకగా అనుకుంటున్నాట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఇలా క్రేజీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న మృణాల్.. తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఆమె నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సరసన సినిమా చేయబోతుందట. అది కూడా ఒకటి కాదు రెండు సినిమాల్లోనట.
ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న అయలాన్ సినిమాను రూపొందించిన రవికుమార్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ చిత్రానికి మృణాల్ కథనాయకగా ఎంపికైనట్లు తాజా సమాచారం. ఈ సినిమాకు మృణాల్ సంతకం కూడా చేసేసిందట. అంతేకాక లారెన్స్ నటించనున్న మరో సినిమాకు కూడా మృణాల్ ను కథానాయికగా పరిశీలిస్తున్నారట. ఆ చిత్రాన్ని రమేష్ వర్మ రూపొందించబోతున్నాడు. అయితే లారెన్స్ సరసన మృణాల్ అనే వార్తను సోషల్ మీడియా జనాలు చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.
వీళ్ళిద్దరికీ అసలు జోడి ఎలా కుదురుతుంది అని ప్రశ్నిస్తున్నారు. అది కూడా రెండు సినిమాల్లో లారెన్స్ సరసన నటించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. తెలుగులో ఇంత మంచి కెరీర్ ఉండగా.. తమిళంలో లారెన్స్ కు జోడిగా నటించాల్సిన అవసరం ఏంటి అని మృణాల్ ను అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తమిళంలోకి వెళ్తే ఎవరైనా పెద్ద హీరోతో సినిమా చేస్తే బాగుండేదని అంటున్నారు. మరి మృణాల్- లారెన్స్ జోడి గురించి వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. అది మ్యాటర్ సంగీతం
This post was last modified on January 3, 2024 12:01 am
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…