సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది మృణాల్ ఠాకూర్. ఆ చిత్రంలో సీత పాత్రలో తనను తప్ప ఇంకొకరిని ఊహించుకోలేని పెర్ఫార్మన్స్ ఇచ్చిందామె. అందం, అభినయం రెండింటితోను కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది మృణాల్. ఆ సినిమా తర్వాత కూడా ఆమెకు తెలుగులో మంచి మంచి అవకాశాలే వస్తున్నాయి.
ఇప్పటికే హాయ్ నాన్నతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో కూడా ఆమెనే కథానాయకగా అనుకుంటున్నాట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఇలా క్రేజీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న మృణాల్.. తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఆమె నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సరసన సినిమా చేయబోతుందట. అది కూడా ఒకటి కాదు రెండు సినిమాల్లోనట.
ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న అయలాన్ సినిమాను రూపొందించిన రవికుమార్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ చిత్రానికి మృణాల్ కథనాయకగా ఎంపికైనట్లు తాజా సమాచారం. ఈ సినిమాకు మృణాల్ సంతకం కూడా చేసేసిందట. అంతేకాక లారెన్స్ నటించనున్న మరో సినిమాకు కూడా మృణాల్ ను కథానాయికగా పరిశీలిస్తున్నారట. ఆ చిత్రాన్ని రమేష్ వర్మ రూపొందించబోతున్నాడు. అయితే లారెన్స్ సరసన మృణాల్ అనే వార్తను సోషల్ మీడియా జనాలు చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.
వీళ్ళిద్దరికీ అసలు జోడి ఎలా కుదురుతుంది అని ప్రశ్నిస్తున్నారు. అది కూడా రెండు సినిమాల్లో లారెన్స్ సరసన నటించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. తెలుగులో ఇంత మంచి కెరీర్ ఉండగా.. తమిళంలో లారెన్స్ కు జోడిగా నటించాల్సిన అవసరం ఏంటి అని మృణాల్ ను అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తమిళంలోకి వెళ్తే ఎవరైనా పెద్ద హీరోతో సినిమా చేస్తే బాగుండేదని అంటున్నారు. మరి మృణాల్- లారెన్స్ జోడి గురించి వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. అది మ్యాటర్ సంగీతం
This post was last modified on January 3, 2024 12:01 am
గత ఏడాది డిసెంబర్ లో అఖండ 2 తాండవం తర్వాత బాలకృష్ణ నుంచి కొత్త సినిమా రాలేదు. ముందు పీరియాడిక్…
వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్న రవితేజకు.. ‘ఇరుముడి’ రూపంలో ఒక మోస్తరు విజయం దక్కినా చాలని చూశారు అభిమానులు. కానీ…
ఇటీవల ఇద్దరు ఫోక్ డ్యాన్సర్లకు సంబంధించిన వ్యక్తిగత వివాదం సోషల్ మీడియాలో, మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే…
ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పుకూలిన ఘటన షాకింగ్…
మలయాళం నుంచి కథానాయికలను తెలుగులోకి తీసుకురావడం కొత్త కాదు. నయనతార, మమత మోహన్ దాస్, కీర్తి సురేష్ లాంటి చాలామంది…
పుష్ప, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమాల తర్వాత బన్నీ…