తెలుగు సినిమాలు సంబంధించి క్రేజీయెస్ట్ సీజన్ అంటే సంక్రాంతినే అనడంలో మరో మాట లేదు. రిలీజ్ అయ్యే సినిమాలకు మంచి టాక్ వస్తే మామూలుగా వచ్చేదాంతో పోలిస్తే 20 30 శాతం అదనపు వసూళ్లు వస్తాయి. అలవైకుంఠ పురములో, వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలు వాటి స్థాయిని మించి వసూళ్ల మోత మోగించాయంటే అందుకు కారణం సంక్రాంతికి రిలీజ్ కావడమే. అందుకే ఈ పండక్కి సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు పోటీ పడతారు. చాలా ముందు నుంచే బెర్తులు బుక్ చేసుకుంటారు.
అయితే సంక్రాంతికి హిట్ టాక్ వస్తే అదనపు వసూళ్లు రావడం నిజమే కానీ.. ఈ టైంలో పోటీ ఎక్కువ ఉంటే థియేటర్లు ఆశించిన స్థాయిలో దక్కవు. దీనికి తోడు టాక్ తేడా కొట్టిందంటే దారుణంగా దెబ్బతింటుందా సినిమా.
అందరూ పాజిటివ్ యాంగిలే చూస్తున్నారు తప్ప ఈ నెగిటివ్ కోణాన్ని పట్టించుకోవడం లేదు. ఒక వీకెండ్లో మామూలుగా నాలుగు క్రేజున్న సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేయడమే చాలా కష్టం అవుతుంది. 2016లో ఇలాగే సంక్రాంతికి నాలుగు పేరున్న సినిమాలు వస్తేనే థియేటర్ల సర్దుబాటుకు చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటిది ఈసారి ఐదు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఐదు రేసులో నిలిచాయి అంటే థియేటర్లు మామూలు రోజుల్లో దక్కే దానికంటే చాలావరకు తగ్గి పోతాయి.
ఈ పరిస్థితుల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకునే సినిమాకు ఆటోమేటిగ్గా థియేటర్లు పెరుగుతాయి. అదే సమయంలో టాక్ బాలేని సినిమాకు ఉన్న థియేటర్లో కూడా తగ్గిపోతాయి. ప్రేక్షకులకు కూడా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టాక్ బాలేని సినిమా వైపు అసలు చూడరు. కాబట్టి ఆ సినిమా పూర్తిగా అన్యాయం అయిపోతుంది. ఎంత మంచి వాడవురా లాంటి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయి ఇలాగే వాష్ అవుట్ అయిపోయాయి. తమ సినిమాల పట్ల అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ.. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని.. సంక్రాంతి రేసులోకి దిగితే మంచిది.
This post was last modified on December 29, 2023 11:40 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…