Political News

అమిత్ టార్గెట్ సాధ్యమేనా ?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణాపై చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నట్లున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ పదిసీట్లు గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇపుడున్న నాలుగు సిట్టింగ్ స్ధానాలకు అదనంగా మరో ఆరు సీట్లలో గెలవాలని అమిత్ షా సమీక్షలో కచ్చితంగా చెప్పారు. 35 శాతం ఓట్ల షేరుతో బీజేపీ పదిసీట్లలో గెలవాల్సిందే అని స్పష్టంగా ఆదేశించారు. ఒక్కరోజు పర్యటన కోసం ఢిల్లీ నుండి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు.

ఈ సందర్భంగా నలుగు ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురం అర్వింద్, సోయం బాబూరావుతో పాటు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తదితర సీనియర్లతో మాట్లాడారు. సిట్టింగ్ స్ధానాల్లో మళ్ళీ నలుగురు పోటీచేయాల్సిందే అని చెప్పేశారు. మిగిలిన ఆరు స్ధానాలతో పాటు మిగిలిన ఏడు స్ధానాల్లో కూడా అంటే 13 స్ధానాల్లో బలమైన అభ్యర్ధులను పోటీలోకి దింపాలని చెప్పారు. ఇందుకోసం గట్టి అభ్యర్ధుల వేట మొదలుపెట్టాలని చెప్పారు. పార్టీ నేతలంతా ఏకతాటిపైన పనిచేస్తే గెలుపు అంత కష్టంకాదన్నారు.

2018 ఎన్నికల్లో కేవలం ఒక్క అసెంబ్లీకే పరిమితమైన బీజేపీ తాజా ఎన్నికల్లో 8 సీట్లలో గెలవటాన్ని ప్రస్తావించారు. అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో రెండోస్ధానంలో ఉన్న విషయాన్ని కూడా గుర్తుచేశారు. ఇప్పటినుండే అభ్యర్ధుల గెలుపుకోసం పార్టీ నేతలు, క్యాడర్ మొత్తం కష్టపడితే పార్టీకి 35 శాతం ఓట్లు షేర్ రావటం కష్టంకాదని అమిత్ అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో అమిత్ షా తెలంగాణా ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు.

అమిత్ చెప్పిన లెక్కలన్నీ పేపర్ మీద చూడటానికి బాగానే ఉంటుంది కాని గ్రౌండ్ లెవల్లో ఎంతవరకు పనిచేస్తుంన్నది పెద్ద అనుమానం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి ప్రజాపాలన మొదలుట్టారు. సిక్స్ గ్యారెంటీస్ అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రజావాణి కార్యక్రమంతో జనాలకు దగ్గరవుతున్నారు. సమస్యలపై వెంటనే ప్రభుత్వం స్పందిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. ఈ పరిస్ధితుల్లో బీజేపీకి పదిసీట్లు వస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 

This post was last modified on December 29, 2023 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

9 hours ago