Political News

అమిత్ టార్గెట్ సాధ్యమేనా ?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణాపై చాలా పెద్ద ఆశలే పెట్టుకున్నట్లున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ పదిసీట్లు గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇపుడున్న నాలుగు సిట్టింగ్ స్ధానాలకు అదనంగా మరో ఆరు సీట్లలో గెలవాలని అమిత్ షా సమీక్షలో కచ్చితంగా చెప్పారు. 35 శాతం ఓట్ల షేరుతో బీజేపీ పదిసీట్లలో గెలవాల్సిందే అని స్పష్టంగా ఆదేశించారు. ఒక్కరోజు పర్యటన కోసం ఢిల్లీ నుండి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు.

ఈ సందర్భంగా నలుగు ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురం అర్వింద్, సోయం బాబూరావుతో పాటు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తదితర సీనియర్లతో మాట్లాడారు. సిట్టింగ్ స్ధానాల్లో మళ్ళీ నలుగురు పోటీచేయాల్సిందే అని చెప్పేశారు. మిగిలిన ఆరు స్ధానాలతో పాటు మిగిలిన ఏడు స్ధానాల్లో కూడా అంటే 13 స్ధానాల్లో బలమైన అభ్యర్ధులను పోటీలోకి దింపాలని చెప్పారు. ఇందుకోసం గట్టి అభ్యర్ధుల వేట మొదలుపెట్టాలని చెప్పారు. పార్టీ నేతలంతా ఏకతాటిపైన పనిచేస్తే గెలుపు అంత కష్టంకాదన్నారు.

2018 ఎన్నికల్లో కేవలం ఒక్క అసెంబ్లీకే పరిమితమైన బీజేపీ తాజా ఎన్నికల్లో 8 సీట్లలో గెలవటాన్ని ప్రస్తావించారు. అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో రెండోస్ధానంలో ఉన్న విషయాన్ని కూడా గుర్తుచేశారు. ఇప్పటినుండే అభ్యర్ధుల గెలుపుకోసం పార్టీ నేతలు, క్యాడర్ మొత్తం కష్టపడితే పార్టీకి 35 శాతం ఓట్లు షేర్ రావటం కష్టంకాదని అమిత్ అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో అమిత్ షా తెలంగాణా ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు.

అమిత్ చెప్పిన లెక్కలన్నీ పేపర్ మీద చూడటానికి బాగానే ఉంటుంది కాని గ్రౌండ్ లెవల్లో ఎంతవరకు పనిచేస్తుంన్నది పెద్ద అనుమానం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి ప్రజాపాలన మొదలుట్టారు. సిక్స్ గ్యారెంటీస్ అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రజావాణి కార్యక్రమంతో జనాలకు దగ్గరవుతున్నారు. సమస్యలపై వెంటనే ప్రభుత్వం స్పందిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. ఈ పరిస్ధితుల్లో బీజేపీకి పదిసీట్లు వస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 

This post was last modified on December 29, 2023 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

OTT రూటు… ఇది కరెక్టు పాయింటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళకు చెందిన నాలుగు నిర్మాతల మండళ్లు ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో…

16 minutes ago

బడ్జెట్ 10 కోట్లు… వసూళ్లు 200 కోట్లు

మన దగ్గర మిడ్ రేంజ్ హీరోల మీద వంద కోట్ల బడ్జెట్లు పెట్టేస్తున్నారు నిర్మాతలు. తీరా చూస్తే తెర మీద…

50 minutes ago

నవ్వుల నాగ‌బాబు… జ‌బ‌ర్ద‌స్త్‌ను లేప‌గ‌ల‌డా?

తెలుగు టీవీ చ‌రిత్ర‌లోనే అత్యంత విజ‌య‌వంత‌మైన షోగా జ‌బ‌ర్ద‌స్త్‌ను చెప్పొచ్చు. అందులో డ‌బుల్ మీనింగ్‌లు, బాడీ షేమింగ్‌ల గురించి అభ్యంత‌రాలు…

1 hour ago

ప్రొడ్యూసర్ కిరణ్ సక్సెస్ అయినట్టేనా

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాను నటించకుండా నిర్మించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. సుమారు నలభైకి పైగా కొత్తవాళ్లను పరిచయం…

4 hours ago

ఆదిత్య ధర్ స్టోరీలు అమ్మేసుకున్న ఫ్రెండు

ఆదిత్య ధర్.. గత నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. దురంధర్, దురంధర్-2 చిత్రాలతో అతను రేపిన సంచలనం అంతా…

4 hours ago

కేరళలో వివాదం చేసి తెలుగులో స్పందించిన నటుడు

ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…

5 hours ago