Movie News

గేమ్ ఛేంజర్ విడుదల తేదీ ఖరారు

మెగాభిమానులు ఎదురు చూసి చూసి ఆఖరికి ఆలోచించడమే మానేసిన రామ్ చరణ్ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ విడుదల తేదీని నిర్మాత దిల్ రాజు నిర్ణయించుకున్నట్టే కనిపిస్తోంది. నిన్న సలార్ ప్రీమియర్ చూసి బయటికి వస్తున్న సందర్భంగా ఒక అభిమాని గుంపులో నుంచి మా సినిమా రిలీజ్ ఎప్పుడని అడగటం, ఆయన స్పందిస్తూ సెప్టెంబర్ అని చెప్పింది మైకులో స్పష్టంగా వినిపించడం జరిగిపోయాయి. ఒకవేళ రెస్పాండ్ అవ్వాలనే ఉద్దేశం లేకపోతే వినిపించనట్టు వెళ్ళిపోయేవారు కానీ అదే పనిగా నెల పేరుని నొక్కి చెప్పడం చూస్తే ఖరారు అని అనుకోవచ్చు.

ఎస్విసి నుంచి అనఫీషియల్ గా అందుతున్న అప్డేట్ ప్రకారం గేమ్ ఛేంజర్ ని 2024 సెప్టెంబర్ 6న తీసుకురాలని ప్రాధమికంగా ఫిక్స్ అయినట్టు తెలిసింది. దర్శకుడు శంకర్ కూడా అంగీకరించారట. ఇండియన్ 2 ఏప్రిల్ లేదా ఆగస్ట్ ఈ రెండు నెలల మధ్యలో ఏదో ఒకదానికి లాక్ చేయడం ఖాయమే కాబట్టి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయించి ఫస్ట్ కాపీ ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఒకవేళ అదే నిజమైతే 2025 సంక్రాంతికి మాత్రమే గేమ్ ఛేంజర్ వస్తుందని నిరాశ పడిన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పినట్టే. అధికారికంగా అయితే చెప్పలేదు.

సెప్టెంబర్ ఏడున వినాయక చవితి పండగ ఉంది. ఎలాగూ బాక్సాఫీస్ పరంగా అది మంచి నెలే కాబట్టి ఓపెనింగ్స్, వసూళ్ల పరంగా టెన్షన్ పడాల్సిన పని లేదు. తమన్ పాటలు జనవరి నుంచి ఒక్కొక్కటిగా రిలీజ్ చేసే అవకాశముంది. గత కొన్ని నెలలుగా దిల్ రాజుని గేమ్ ఛేంజర్ గురించి అడిగినప్పుడంతా శంకర్ మీదకు తోసేసి స్మార్ట్ గా తప్పించుకుంటున్నారు తప్ప ఫలానా టైం అని చెప్పలేదు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ పొలిటికల్ పీరియాడిక్ డ్రామాలో ఎస్జె సూర్య విలన్ గా నటించాడు. చూస్తుంటే చరణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులు ఇంకో పది నెలల్లో తీరిపోయేలానే ఉన్నాయి.

This post was last modified on December 23, 2023 9:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

11 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago