సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య పోటీకి సై అంటుంది హనుమాన్. పైగా గుంటూరు కారం లాంటి భారీ చిత్రానికి పోటీగా జనవరి 12నే ఈ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇది మరీ రిస్క్ అంటున్న వాళ్లు లేకపోలేదు. అయితే తమ సినిమా మీద ధీమాతోనే సంక్రాంతి పోటీకి సిద్ధమయ్యామని అంటున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
దర్శకుడిగా తాను, హీరోగా తేజ చిన్న వాళ్ళమే అని.. సంక్రాంతికి రావడానికి తమకు పెద్ద పెద్ద స్టార్స్ లేరని.. తమకు ఉన్న ఒకే ఒక్క స్టార్ హనుమాన్ అందుకే నమ్మకంతోనే సంక్రాంతికి వస్తున్నామని.. తాము చిన్న వాళ్ళమే అయినా తమ సినిమా కంటెంట్ పెద్దదని హనుమాన్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ప్రశాంత్ వర్మ తెలిపాడు.
ఇక జనవరి 12న గుంటూరు కారంతో పోటీ గురించి మాట్లాడుతూ.. ఈ డేట్ ముందుగా ప్రకటించింది తామే అని, చాలా ముందుగానే ఆ డేట్ తోనే నార్త్ ఇండియా అంతటా అగ్రిమెంట్లు కూడా జరిగిపోయాయని.. కాబట్టి కచ్చితంగా 12నే తమ సినిమాను రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రశాంత్ చెప్పాడు. హీరో మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తమ ఫేవరెట్ అని.. కాబట్టి జనవరి 12న గుంటూరు కారం ఫస్ట్ షో తామూ చూస్తామని ప్రశాంత్ అన్నాడు.
మరోవైపు ఆదిపురుష్ సినిమా తర్వాత హనుమాన్ విషయంలో ఒత్తిడి పెరిగిందా అని విలేకరులు అడగ్గా.. అలాంటిదేమీ లేదని, తన సినిమా టీజర్ వైరల్ అయ్యాక కూడా ఎంత మాత్రం ప్రెజర్ ఫీల్ కాలేదని.. తాను ముందు నుంచి ఎలా అనుకున్నానో అలాగే సినిమా తీశానని ప్రశాంత్ వర్మ తెలిపాడు.
This post was last modified on December 19, 2023 4:23 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…