భారత్ లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. టీ20 ఫార్మాట్ లో అత్యంత విజయవంతమైన టోర్నీగా ఐపీఎల్ ఖ్యాతి గడిచింది. వేల కోట్ల రూపాయల వ్యాపారం ఐపీఎల్ చుట్టూ జరగడంతో ప్రపంచ క్రికెట్లో ప్రతి ఆటగాడు ఐపీఎల్ లోని ఏదో ఒక జట్టుకు ఆడాలని భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇక, ఐపీఎల్ తర్వాతే ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ అత్యంత ధనిక బోర్డుగా అవతరించింది. కోట్లు కుమ్మరించి మరి స్టార్ ఆటగాళ్లను కొనేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలోనే 2024 ఐపీఎల్ సీజన్లో ఆడబోయే ఆటగాళ్ల కోసం ఈ రోజు జరిగిన ఐపీఎల్ మినీ ఆక్షన్ లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి.
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ను 24.75 కోట్ల రూపాయలకు కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా స్టార్క్ అవతరించాడు. ఇప్పటివరకు ఏ ఆటగాడికి ఇంత పెద్ద మొత్తం చెల్లించలేదు. ఇక, ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 20.50 కోట్లు పెట్టి ఖరీదు చేసింది. కివీస్ బ్యాటర్ డెరైల్ మిచెల్ ను సీఎస్కే 14 కోట్ల భారీ ధరకు కొనేసింది. ఇక, న్యూజిలాండ్ ఓపెనర్ రాచిన్ రవీంద్రకు భారీ ధర పలుకుతుందని ఆశించినా..చివరకు చెన్నై సూపర్ కింగ్స్ అతడిని 1.80 కోట్లకు కొనేసింది. ఈసారి వేలంలో హర్షల్ పటేల్ జాక్ పాట్ కొట్టాడు. 11.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ అతడిని సొంతం చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక, వరల్డ్ కప్ లో అదరగొట్టిన శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంకను 4.6 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
ఇటువంటి స్టార్ ప్లేయర్లనే కాకుండా సమీర్ రిజ్వీ వంటి అనామక క్రికెటర్లు కూడా ఈ వేలంలో మంచి ధర దక్కించుకున్నారు. శుభమ్ దూబే, కుమార్ కుశాగ్ర వంటి కొత్త ఆటగాళ్లకూ విపరీతమైన గిరాకీ ఏర్పడింది. 20 లక్షల కనీస ధర ఉన్న సమీర్ రిజ్వీని 8.4 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీ…ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ లో 9 ఇన్నింగ్స్ లు ఆడి 2 సెంచరీలతో 455 పరుగులు సాధించాడు. ఝార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కుమార్ కుశాగ్ర కుమార్ కుశాగ్రను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.7.2 కోట్లకు కొనుగోలు చేసింది. 19 ఏళ్ల కుశాగ్ర దేవధర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు.
This post was last modified on December 19, 2023 9:55 pm
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…