Political News

తనకు టికెట్ కన్ఫర్మ్ అంటోన్న రోజా

వైసీపీ ఎమ్మెల్యేలలో 11 మంది సిట్టింగ్ ల స్థానాలను సీఎం జగన్ మార్చిన సంగతి తెలిసిందే. దాంతోపాటు మరో 45 మందితో సెకండ్ లిస్ట్ కూడా రెడీ అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే గోదావరి, గుంటూరు జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలతో జగన్ నిన్న భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి రోజాకు కూడా ఈసారి టికెట్ దక్కకపోవచ్చు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై, ఆ ప్రచారంపై రోజా స్పందించారు. తనకు టికెట్ రాదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తు శునకానందం పొందుతున్నారని రోజా ఫైర్ అయ్యారు.

అయితే, వారి ఆశలు ఫలించవని. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారని, రెండు నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకుంటున్నారని రోజా అన్నారు. తమ నియోజకవర్గాలలో కష్టపడి పనిచేసిన వారికి సీట్లు ఎక్కడికి పోవని అన్నారు. మంత్రులు తమ నియోజకవర్గంతో పాటు వేరే ఒక నియోజకవర్గంలో కూడా పట్టు కలిగి ఉంటారని, అందుకే రెండు నియోజకవర్గాల బాధ్యతను కలిపి మంత్రికి అప్పగిస్తుంటారని చెప్పారు.

ఒకవేళ ఎవరికైనా సీటు దక్కకుంటే అది వారి పొరపాటు అని, అది జగన్ పొరపాటు కాదని అన్నారు. కొందరు వాళ్లకు వాళ్లే సీట్లు రాలేదని ఊహించుకుంటే ఏమీ చేయలేమని చెప్పారు. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వారితో రెండు మూడు పర్యాయాలు చర్చించిన తర్వాతే జగన్ నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. గుడ్డిగా ఎక్కడా సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేయలేదని అన్నారు.

This post was last modified on December 19, 2023 4:18 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

5 mins ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

1 hour ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

3 hours ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

4 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

5 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

5 hours ago