కరోనా తగ్గే వరకు సినిమా షూటింగ్సే వద్దనుకున్న తెలుగు సినిమా వాళ్లు ఇప్పుడు వరుసగా చాలా సినిమాలను తిరిగి మొదలు పెట్టేసారు. ముఖ్యంగా నిర్మాణ దశ చివర్లో వున్న సినిమాలను వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇందుకు కారణం ఓటిటిల నుంచి వస్తోన్న మెగా డీల్స్ సొంతం చేసుకోవడమేనని అర్థమవుతోంది. వి చిత్రానికి ముప్పయ్ కోట్లకు పైగా అమెజాన్ చెల్లించడంతో ఇంతకాలం ‘ఓటిటిల నుంచి ఎంత వస్తుందిలే’ అని లైట్ తీసుకున్న వారిని పరుగులు పెట్టిస్తోంది. హీరో రేంజ్, మార్కెట్ దృష్టిలో వుంచుకుని ఓటిటి సంస్థలు అమౌంట్ కోట్ చేస్తున్నాయి. థియేటర్ల నుంచి ఎంతయితే వస్తుందో అంత ఓటిటిలు ఇస్తామని ముందుకు రావడంతో నిర్మాతలు చలాకీగా పనులు మొదలు పెట్టేసారు.
కరోనా టైమ్లో షూటింగ్ వ్యయం మామూలుగా కంటే అధికమయినా కానీ ఆరు నెలలుగా ఆపుకుని కూర్చున్న సినిమాలను అమ్మేసే అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు. విశేషం ఏమిటంటే ఇప్పుడు తమ సినిమాలు థియేటర్లలో విడుదల కాకపోయినా ఫర్వాలేదని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ విపత్తులో సినిమా రిలీజయ్యి, వసూళ్లు రాకపోతే బయ్యర్ల గోల ఎక్కువగా వుంటుంది. అదే ఓటిటిలు అయితే ఒకేసారి అమ్మేసుకుని హ్యాపీగా గుండెల మీద చెయ్యేసుకుని పడుకోవచ్చు.
This post was last modified on September 2, 2020 1:23 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…