Movie News

దిల్‍ రాజు జాక్‍పాట్‍తో టాలీవుడ్‍లో హడావుడి

కరోనా తగ్గే వరకు సినిమా షూటింగ్సే వద్దనుకున్న తెలుగు సినిమా వాళ్లు ఇప్పుడు వరుసగా చాలా సినిమాలను తిరిగి మొదలు పెట్టేసారు. ముఖ్యంగా నిర్మాణ దశ చివర్లో వున్న సినిమాలను వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇందుకు కారణం ఓటిటిల నుంచి వస్తోన్న మెగా డీల్స్ సొంతం చేసుకోవడమేనని అర్థమవుతోంది. వి చిత్రానికి ముప్పయ్‍ కోట్లకు పైగా అమెజాన్‍ చెల్లించడంతో ఇంతకాలం ‘ఓటిటిల నుంచి ఎంత వస్తుందిలే’ అని లైట్‍ తీసుకున్న వారిని పరుగులు పెట్టిస్తోంది. హీరో రేంజ్‍, మార్కెట్‍ దృష్టిలో వుంచుకుని ఓటిటి సంస్థలు అమౌంట్‍ కోట్‍ చేస్తున్నాయి. థియేటర్ల నుంచి ఎంతయితే వస్తుందో అంత ఓటిటిలు ఇస్తామని ముందుకు రావడంతో నిర్మాతలు చలాకీగా పనులు మొదలు పెట్టేసారు.

కరోనా టైమ్‍లో షూటింగ్‍ వ్యయం మామూలుగా కంటే అధికమయినా కానీ ఆరు నెలలుగా ఆపుకుని కూర్చున్న సినిమాలను అమ్మేసే అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు. విశేషం ఏమిటంటే ఇప్పుడు తమ సినిమాలు థియేటర్లలో విడుదల కాకపోయినా ఫర్వాలేదని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ విపత్తులో సినిమా రిలీజయ్యి, వసూళ్లు రాకపోతే బయ్యర్ల గోల ఎక్కువగా వుంటుంది. అదే ఓటిటిలు అయితే ఒకేసారి అమ్మేసుకుని హ్యాపీగా గుండెల మీద చెయ్యేసుకుని పడుకోవచ్చు.

This post was last modified on September 2, 2020 1:23 am

Share
Show comments
Published by
suman

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

5 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

7 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

8 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

8 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

9 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

11 hours ago