నెట్ ఫ్లిక్స్ సిఈఓ టెడ్ సరండోస్ హైదరాబాద్ వచ్చి నాన్ స్టాప్ గా తెలుగు స్టార్ హీరోలను కలుసుకోవడం, వాటి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, వీటి మీద పెద్ద చర్చే జరుగుతోంది. అయినా ముంబై వెళ్లి షారుఖ్ ఖాన్, సల్మాన్, అమీర్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ప్రత్యేకంగా టాలీవుడ్ స్టార్స్ తో మీటింగులు పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. ముందు చిరంజీవి, రామ్ చరణ్ అండ్ కోతో అయ్యింది. ఆ తర్వాత మరుసటి రోజే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను కలుసుకున్నారు. ఇరవై గంటలు గడిచే లోపే కాఫీ తాగుతూ మహేష్ బాబు ఇంటికెళ్లి స్టిల్స్ ఇచ్చేశారు.
నెక్స్ట్ లిస్టులో ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం తర్వాత జాబితాలో అల్లు అర్జున్, ప్రభాస్ లు ఉన్నారు. బన్నీ అందుబాటులోనే ఉన్నాడు కానీ డార్లింగ్ గత ఇరవై రోజులకు పైగానే బయటికి రావడం లేదు. ఇక అక్కినేని ఫ్యామిలీని, దగ్గుబాటి హీరోలను కలుసుకునే అవకాశం ఉంది. రానా నాయుడు స్టార్స్ వెంకటేష్, రానాలు అభిరాం పెళ్లి వేడుకని విదేశాల్లో పూర్తి చేసుకుని భాగ్యనగరానికి వచ్చేశారు కాబట్టి ఈ కలయికని చూడొచ్చు. తమ ఓటిటిలో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరోలతో వరసబెట్టి మరీ అప్పొయింట్ మెంట్స్ తీసుకుంటున్నాడు టెడ్.
ఆయన ఉద్దేశం ఏమైనా ఫ్యాన్స్ మాత్రం ఈ మీటింగులు చూసి తెగ సంబరపడుతున్నారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ డిజిటల్ హెడ్ వచ్చి అదే పనిగా తమ హీరోలను కలుసుకుని ఫోటోలు సెల్ఫీలు పెట్టడం కన్నా కావాల్సింది ఏముంటుంది. ఇంతకీ టెడ్ ఏదో పెద్ద ప్లానింగ్ తోనే ఇండియాలో ఉన్నాడు. ఊరికే పిక్స్ తీసుకోవడానికి వచ్చేంత ఖాళీగా ఉండరు కాబట్టి ఏదో ప్రణాళిక ఉండే ఉంటుంది. మన దేశంలో కార్యకలాపాలను విస్తరించే పనిలో ఉన్న నెట్ ఫ్లిక్స్ కి ఇప్పుడీ సమావేశాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అందులోనూ టెడ్ ప్రత్యేకంగా టాలీవుడ్ కి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం స్పెషల్ గా అనిపిస్తోంది.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…