నెట్ ఫ్లిక్స్ సిఈఓ టెడ్ సరండోస్ హైదరాబాద్ వచ్చి నాన్ స్టాప్ గా తెలుగు స్టార్ హీరోలను కలుసుకోవడం, వాటి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, వీటి మీద పెద్ద చర్చే జరుగుతోంది. అయినా ముంబై వెళ్లి షారుఖ్ ఖాన్, సల్మాన్, అమీర్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ప్రత్యేకంగా టాలీవుడ్ స్టార్స్ తో మీటింగులు పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. ముందు చిరంజీవి, రామ్ చరణ్ అండ్ కోతో అయ్యింది. ఆ తర్వాత మరుసటి రోజే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను కలుసుకున్నారు. ఇరవై గంటలు గడిచే లోపే కాఫీ తాగుతూ మహేష్ బాబు ఇంటికెళ్లి స్టిల్స్ ఇచ్చేశారు.
నెక్స్ట్ లిస్టులో ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం తర్వాత జాబితాలో అల్లు అర్జున్, ప్రభాస్ లు ఉన్నారు. బన్నీ అందుబాటులోనే ఉన్నాడు కానీ డార్లింగ్ గత ఇరవై రోజులకు పైగానే బయటికి రావడం లేదు. ఇక అక్కినేని ఫ్యామిలీని, దగ్గుబాటి హీరోలను కలుసుకునే అవకాశం ఉంది. రానా నాయుడు స్టార్స్ వెంకటేష్, రానాలు అభిరాం పెళ్లి వేడుకని విదేశాల్లో పూర్తి చేసుకుని భాగ్యనగరానికి వచ్చేశారు కాబట్టి ఈ కలయికని చూడొచ్చు. తమ ఓటిటిలో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరోలతో వరసబెట్టి మరీ అప్పొయింట్ మెంట్స్ తీసుకుంటున్నాడు టెడ్.
ఆయన ఉద్దేశం ఏమైనా ఫ్యాన్స్ మాత్రం ఈ మీటింగులు చూసి తెగ సంబరపడుతున్నారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ డిజిటల్ హెడ్ వచ్చి అదే పనిగా తమ హీరోలను కలుసుకుని ఫోటోలు సెల్ఫీలు పెట్టడం కన్నా కావాల్సింది ఏముంటుంది. ఇంతకీ టెడ్ ఏదో పెద్ద ప్లానింగ్ తోనే ఇండియాలో ఉన్నాడు. ఊరికే పిక్స్ తీసుకోవడానికి వచ్చేంత ఖాళీగా ఉండరు కాబట్టి ఏదో ప్రణాళిక ఉండే ఉంటుంది. మన దేశంలో కార్యకలాపాలను విస్తరించే పనిలో ఉన్న నెట్ ఫ్లిక్స్ కి ఇప్పుడీ సమావేశాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అందులోనూ టెడ్ ప్రత్యేకంగా టాలీవుడ్ కి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం స్పెషల్ గా అనిపిస్తోంది.
This post was last modified on December 9, 2023 10:58 am
నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…
ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదని ఎదురు చూస్తున్న…
అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న దేవర ఆడియోలోని మొదటి లిరికల్ సాంగ్ ఈ వారమే విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితంపై స్పందించారు. ఇంకా ఫలితం…
ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటే తాడేపల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే.. ఇది 41 రోజుల…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…