Movie News

మహేష్ ములాఖాత్ తర్వాత ఎవరు

నెట్ ఫ్లిక్స్ సిఈఓ టెడ్ సరండోస్ హైదరాబాద్ వచ్చి నాన్ స్టాప్ గా తెలుగు స్టార్ హీరోలను కలుసుకోవడం, వాటి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, వీటి మీద పెద్ద చర్చే జరుగుతోంది. అయినా ముంబై వెళ్లి షారుఖ్ ఖాన్, సల్మాన్, అమీర్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ప్రత్యేకంగా టాలీవుడ్ స్టార్స్ తో మీటింగులు పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. ముందు చిరంజీవి, రామ్ చరణ్ అండ్ కోతో అయ్యింది. ఆ తర్వాత మరుసటి రోజే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను కలుసుకున్నారు. ఇరవై గంటలు గడిచే లోపే కాఫీ తాగుతూ మహేష్ బాబు ఇంటికెళ్లి స్టిల్స్ ఇచ్చేశారు.

నెక్స్ట్ లిస్టులో ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం తర్వాత జాబితాలో అల్లు అర్జున్, ప్రభాస్ లు ఉన్నారు. బన్నీ అందుబాటులోనే ఉన్నాడు కానీ డార్లింగ్ గత ఇరవై రోజులకు పైగానే బయటికి రావడం లేదు. ఇక అక్కినేని ఫ్యామిలీని, దగ్గుబాటి హీరోలను కలుసుకునే అవకాశం ఉంది. రానా నాయుడు స్టార్స్ వెంకటేష్, రానాలు అభిరాం పెళ్లి వేడుకని విదేశాల్లో పూర్తి చేసుకుని భాగ్యనగరానికి వచ్చేశారు కాబట్టి ఈ కలయికని చూడొచ్చు. తమ ఓటిటిలో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరోలతో వరసబెట్టి మరీ అప్పొయింట్ మెంట్స్ తీసుకుంటున్నాడు టెడ్.

ఆయన ఉద్దేశం ఏమైనా ఫ్యాన్స్ మాత్రం ఈ మీటింగులు చూసి తెగ సంబరపడుతున్నారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ డిజిటల్ హెడ్ వచ్చి అదే పనిగా తమ హీరోలను కలుసుకుని ఫోటోలు సెల్ఫీలు పెట్టడం కన్నా కావాల్సింది ఏముంటుంది. ఇంతకీ టెడ్ ఏదో పెద్ద ప్లానింగ్ తోనే ఇండియాలో ఉన్నాడు. ఊరికే పిక్స్ తీసుకోవడానికి వచ్చేంత ఖాళీగా ఉండరు కాబట్టి ఏదో ప్రణాళిక ఉండే ఉంటుంది. మన దేశంలో కార్యకలాపాలను విస్తరించే పనిలో ఉన్న నెట్ ఫ్లిక్స్ కి ఇప్పుడీ సమావేశాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అందులోనూ టెడ్ ప్రత్యేకంగా టాలీవుడ్ కి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం స్పెషల్ గా అనిపిస్తోంది.

This post was last modified on December 9, 2023 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

51 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago