Movie News

మహేష్ ములాఖాత్ తర్వాత ఎవరు

నెట్ ఫ్లిక్స్ సిఈఓ టెడ్ సరండోస్ హైదరాబాద్ వచ్చి నాన్ స్టాప్ గా తెలుగు స్టార్ హీరోలను కలుసుకోవడం, వాటి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, వీటి మీద పెద్ద చర్చే జరుగుతోంది. అయినా ముంబై వెళ్లి షారుఖ్ ఖాన్, సల్మాన్, అమీర్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ప్రత్యేకంగా టాలీవుడ్ స్టార్స్ తో మీటింగులు పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. ముందు చిరంజీవి, రామ్ చరణ్ అండ్ కోతో అయ్యింది. ఆ తర్వాత మరుసటి రోజే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను కలుసుకున్నారు. ఇరవై గంటలు గడిచే లోపే కాఫీ తాగుతూ మహేష్ బాబు ఇంటికెళ్లి స్టిల్స్ ఇచ్చేశారు.

నెక్స్ట్ లిస్టులో ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం తర్వాత జాబితాలో అల్లు అర్జున్, ప్రభాస్ లు ఉన్నారు. బన్నీ అందుబాటులోనే ఉన్నాడు కానీ డార్లింగ్ గత ఇరవై రోజులకు పైగానే బయటికి రావడం లేదు. ఇక అక్కినేని ఫ్యామిలీని, దగ్గుబాటి హీరోలను కలుసుకునే అవకాశం ఉంది. రానా నాయుడు స్టార్స్ వెంకటేష్, రానాలు అభిరాం పెళ్లి వేడుకని విదేశాల్లో పూర్తి చేసుకుని భాగ్యనగరానికి వచ్చేశారు కాబట్టి ఈ కలయికని చూడొచ్చు. తమ ఓటిటిలో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన హీరోలతో వరసబెట్టి మరీ అప్పొయింట్ మెంట్స్ తీసుకుంటున్నాడు టెడ్.

ఆయన ఉద్దేశం ఏమైనా ఫ్యాన్స్ మాత్రం ఈ మీటింగులు చూసి తెగ సంబరపడుతున్నారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ డిజిటల్ హెడ్ వచ్చి అదే పనిగా తమ హీరోలను కలుసుకుని ఫోటోలు సెల్ఫీలు పెట్టడం కన్నా కావాల్సింది ఏముంటుంది. ఇంతకీ టెడ్ ఏదో పెద్ద ప్లానింగ్ తోనే ఇండియాలో ఉన్నాడు. ఊరికే పిక్స్ తీసుకోవడానికి వచ్చేంత ఖాళీగా ఉండరు కాబట్టి ఏదో ప్రణాళిక ఉండే ఉంటుంది. మన దేశంలో కార్యకలాపాలను విస్తరించే పనిలో ఉన్న నెట్ ఫ్లిక్స్ కి ఇప్పుడీ సమావేశాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అందులోనూ టెడ్ ప్రత్యేకంగా టాలీవుడ్ కి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం స్పెషల్ గా అనిపిస్తోంది.

This post was last modified on December 9, 2023 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

5 hours ago