నందమూరి బాలకృష్ణ.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఏమాత్రం పొంతన కుదరని కాంబినేషన్ ఇది. బాలయ్య అంటే ఊర మాస్.. త్రివిక్రమ్ అంటే క్లాస్.. ఈ కలయికలో సినిమా వస్తుందని ఎవరూ ఊహించరు. ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నం ఏదీ జరగలేదు. ఇకముందు కూడా జరుగుతుందనే అంచనాలు లేవు. ఐతే త్రివిక్రమ్.. బాలయ్యను డైరెక్ట్ చేయట్లేదు కానీ.. ఆయనతో చేతులు కలుపుతున్నాడు.
‘భగవంత్ కేసరి’ తర్వాత బాలయ్య.. బాబీ దర్శకత్వంలో నటించనున్న సినిమాలో త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి త్రివిక్రమ్ సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారా బాలయ్యతో ఏర్పడిన అనుబంధంతో ఆయన కొడుకు అరంగేట్ర చిత్రం కోసం త్రివిక్రమ్ సాయం పట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ అరంగేట్రానికి సమయం దగ్గర పడ్డట్లే కనిపిస్తోంది. వచ్చే ఏడాది మోసజ్ఞ ఎంట్రీ ఇస్తాడని బాలయ్య ఇప్పటికే ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం కథ వేట ముమ్మరంగా సాగుతోంది. ఇందుకోసం అనిల్ రావిపూడి సహా కొందరు స్టార్ దర్శకుల సాయం తీసుకుంటున్నాడట బాలయ్య. అందరి సలహాలు సూచనల ఆధారంగా ఒక మంచి కథను రెడీ చేసి.. మోక్షజ్ఞను తెరపైకి తీసుకురావాలని బాలయ్య ప్రయత్నిస్తున్నాడట. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
మోక్షజ్ఞ కోసం త్రివిక్రమ్ పూర్తిగా కథ అందిస్తారని చెప్పలేం కానీ మంచి ఇన్ పుట్స్ ఇచ్చి కథ రెడీ చేయించే అవకాశాలను కొట్టి పారేయలేం. ఇదే నిజమైతే త్రివిక్రమ్ లాంటి అనుభవజ్ఞుడైన రచయిత, దర్శకుడి టచ్ మోక్షజ్ఞ ఎంట్రీకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.
This post was last modified on December 5, 2023 10:49 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…