నందమూరి బాలకృష్ణ.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఏమాత్రం పొంతన కుదరని కాంబినేషన్ ఇది. బాలయ్య అంటే ఊర మాస్.. త్రివిక్రమ్ అంటే క్లాస్.. ఈ కలయికలో సినిమా వస్తుందని ఎవరూ ఊహించరు. ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నం ఏదీ జరగలేదు. ఇకముందు కూడా జరుగుతుందనే అంచనాలు లేవు. ఐతే త్రివిక్రమ్.. బాలయ్యను డైరెక్ట్ చేయట్లేదు కానీ.. ఆయనతో చేతులు కలుపుతున్నాడు.
‘భగవంత్ కేసరి’ తర్వాత బాలయ్య.. బాబీ దర్శకత్వంలో నటించనున్న సినిమాలో త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి త్రివిక్రమ్ సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారా బాలయ్యతో ఏర్పడిన అనుబంధంతో ఆయన కొడుకు అరంగేట్ర చిత్రం కోసం త్రివిక్రమ్ సాయం పట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ అరంగేట్రానికి సమయం దగ్గర పడ్డట్లే కనిపిస్తోంది. వచ్చే ఏడాది మోసజ్ఞ ఎంట్రీ ఇస్తాడని బాలయ్య ఇప్పటికే ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం కథ వేట ముమ్మరంగా సాగుతోంది. ఇందుకోసం అనిల్ రావిపూడి సహా కొందరు స్టార్ దర్శకుల సాయం తీసుకుంటున్నాడట బాలయ్య. అందరి సలహాలు సూచనల ఆధారంగా ఒక మంచి కథను రెడీ చేసి.. మోక్షజ్ఞను తెరపైకి తీసుకురావాలని బాలయ్య ప్రయత్నిస్తున్నాడట. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
మోక్షజ్ఞ కోసం త్రివిక్రమ్ పూర్తిగా కథ అందిస్తారని చెప్పలేం కానీ మంచి ఇన్ పుట్స్ ఇచ్చి కథ రెడీ చేయించే అవకాశాలను కొట్టి పారేయలేం. ఇదే నిజమైతే త్రివిక్రమ్ లాంటి అనుభవజ్ఞుడైన రచయిత, దర్శకుడి టచ్ మోక్షజ్ఞ ఎంట్రీకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.
This post was last modified on December 5, 2023 10:49 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…