నందమూరి బాలకృష్ణ.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఏమాత్రం పొంతన కుదరని కాంబినేషన్ ఇది. బాలయ్య అంటే ఊర మాస్.. త్రివిక్రమ్ అంటే క్లాస్.. ఈ కలయికలో సినిమా వస్తుందని ఎవరూ ఊహించరు. ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నం ఏదీ జరగలేదు. ఇకముందు కూడా జరుగుతుందనే అంచనాలు లేవు. ఐతే త్రివిక్రమ్.. బాలయ్యను డైరెక్ట్ చేయట్లేదు కానీ.. ఆయనతో చేతులు కలుపుతున్నాడు.
‘భగవంత్ కేసరి’ తర్వాత బాలయ్య.. బాబీ దర్శకత్వంలో నటించనున్న సినిమాలో త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి త్రివిక్రమ్ సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారా బాలయ్యతో ఏర్పడిన అనుబంధంతో ఆయన కొడుకు అరంగేట్ర చిత్రం కోసం త్రివిక్రమ్ సాయం పట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ అరంగేట్రానికి సమయం దగ్గర పడ్డట్లే కనిపిస్తోంది. వచ్చే ఏడాది మోసజ్ఞ ఎంట్రీ ఇస్తాడని బాలయ్య ఇప్పటికే ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం కథ వేట ముమ్మరంగా సాగుతోంది. ఇందుకోసం అనిల్ రావిపూడి సహా కొందరు స్టార్ దర్శకుల సాయం తీసుకుంటున్నాడట బాలయ్య. అందరి సలహాలు సూచనల ఆధారంగా ఒక మంచి కథను రెడీ చేసి.. మోక్షజ్ఞను తెరపైకి తీసుకురావాలని బాలయ్య ప్రయత్నిస్తున్నాడట. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
మోక్షజ్ఞ కోసం త్రివిక్రమ్ పూర్తిగా కథ అందిస్తారని చెప్పలేం కానీ మంచి ఇన్ పుట్స్ ఇచ్చి కథ రెడీ చేయించే అవకాశాలను కొట్టి పారేయలేం. ఇదే నిజమైతే త్రివిక్రమ్ లాంటి అనుభవజ్ఞుడైన రచయిత, దర్శకుడి టచ్ మోక్షజ్ఞ ఎంట్రీకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.
This post was last modified on December 5, 2023 10:49 pm
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…