తెలంగాణలో పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం.. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే.. ఫలితం వెల్లడైన వెంటనే ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించేస్తారని, దీంతో కాంగ్రెస్పై ఉన్న ముఖ్యమంత్రి ఎంపికలో తర్జన భర్జన అనే అపవాదు తొలుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే.. తెలంగాణలోనూ అది సాధ్యం కాలేదు. క్షేత్రస్థాయిలో తెలంగాణ నేతలను కూర్చోబెట్టి చర్చించినా.. ఫలితం కనిపించలేదు. దీంతో ఎట్టకేలకు ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకున్నారు. ఢిల్లీ స్థాయిలోనే నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి రేవంత్ ను సీఎం సీటులో కూర్చోబెట్టారు.
అయితే.. కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణలో అధికారంలోకి వస్తే.. ఎలాంటి నిర్నయం తీసుకోవాలన్నా.. వారు ఢిల్లీకి వెళ్లాల్సిందే నంటూ.. మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రసంగం వెనువెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలను ఏకేశారు. “కాంగ్రెస్ నేతలు వాష్రూమ్కు వెళ్లాలన్నా.. చలో(వెనకాల బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ అని నినాదాలు చేశారు), గల్లిలో రోడ్డు వేయాలన్నా చలో, దానిపై కొట్టాట వచ్చి నాయకులు కలబడ్డా.. చలో, మేనిఫెస్టో తయారు చేయాలన్నా చలో, వాగ్దానాలునెరవేర్చాలన్నా చలో.. హామీలు ఇవ్వాలన్నా చలో.. ఏదైనా ఫైలుపై సంతకం చేయాలన్నా చలో.. ఇదీ కాంగ్రెస్ నేతల పరిస్థితి ” అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కట్ చేస్తే.. ఈ పరిస్థితిని తప్పించేందుకు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాగానే ఆయన స్వయంగాకొన్ని నిర్ణయాలు తీసుకుని అధికారులకు పాస్ చేశారు. కానీ, సీఎం ఎంపిక విషయంలో మాత్రం 48 గంటల పాటు అధిష్టానం.. నిర్ణయం తీసుకునే వరకు సందిగ్ధత ఏర్పడడం.. ఢిల్లీ వరకు ఈ విషయం వెళ్లడం.. వంటి పరిణామాలతో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే నిజమవుతున్నాయంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లురావడం గమనార్హం.
This post was last modified on December 5, 2023 10:41 pm
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…