తెలంగాణలో పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం.. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే.. ఫలితం వెల్లడైన వెంటనే ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించేస్తారని, దీంతో కాంగ్రెస్పై ఉన్న ముఖ్యమంత్రి ఎంపికలో తర్జన భర్జన అనే అపవాదు తొలుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే.. తెలంగాణలోనూ అది సాధ్యం కాలేదు. క్షేత్రస్థాయిలో తెలంగాణ నేతలను కూర్చోబెట్టి చర్చించినా.. ఫలితం కనిపించలేదు. దీంతో ఎట్టకేలకు ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకున్నారు. ఢిల్లీ స్థాయిలోనే నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి రేవంత్ ను సీఎం సీటులో కూర్చోబెట్టారు.
అయితే.. కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణలో అధికారంలోకి వస్తే.. ఎలాంటి నిర్నయం తీసుకోవాలన్నా.. వారు ఢిల్లీకి వెళ్లాల్సిందే నంటూ.. మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన ప్రసంగం వెనువెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలను ఏకేశారు. “కాంగ్రెస్ నేతలు వాష్రూమ్కు వెళ్లాలన్నా.. చలో(వెనకాల బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ అని నినాదాలు చేశారు), గల్లిలో రోడ్డు వేయాలన్నా చలో, దానిపై కొట్టాట వచ్చి నాయకులు కలబడ్డా.. చలో, మేనిఫెస్టో తయారు చేయాలన్నా చలో, వాగ్దానాలునెరవేర్చాలన్నా చలో.. హామీలు ఇవ్వాలన్నా చలో.. ఏదైనా ఫైలుపై సంతకం చేయాలన్నా చలో.. ఇదీ కాంగ్రెస్ నేతల పరిస్థితి ” అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కట్ చేస్తే.. ఈ పరిస్థితిని తప్పించేందుకు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాగానే ఆయన స్వయంగాకొన్ని నిర్ణయాలు తీసుకుని అధికారులకు పాస్ చేశారు. కానీ, సీఎం ఎంపిక విషయంలో మాత్రం 48 గంటల పాటు అధిష్టానం.. నిర్ణయం తీసుకునే వరకు సందిగ్ధత ఏర్పడడం.. ఢిల్లీ వరకు ఈ విషయం వెళ్లడం.. వంటి పరిణామాలతో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే నిజమవుతున్నాయంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లురావడం గమనార్హం.
This post was last modified on December 5, 2023 10:41 pm
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…