Movie News

ఇద్దరి మౌనం వెనుక కారణముందేమో

హైదరాబాద్ లో జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు, రాజమౌళిలు గెస్టులుగా రావడం ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిన విషయమే. ట్రైలర్ చూసి మెంటల్ వచ్చిందని మహేష్, వర్మ లాంటి అరుదైన దర్శకుల జాబితాలో సందీప్ రెడ్డి వంగాకు చోటివ్వాలని జక్కన్న ఇలా ఇద్దరూ కలిసి ఓ రేంజ్ లో పొగిడారు. కట్ చేస్తే సినిమా విడుదలై ఇవాళ్టికి నాలుగో రోజు. సోషల్ మీడియాలో వీళ్ళ స్పందన కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఎలాంటి ట్వీట్లు, స్టోరీలు కనిపించడం లేదు. మహేష్ అంటే గుంటూరు కారం షూటింగ్ లో బిజీ ఉండి ఇంకా కుదరలేదనుకోవచ్చు

కానీ రాజమౌళికి తగినంత సమయం ఉంది. తన మద్దతు అవసరమైన చిన్న చిత్రాలకే ప్రసాద్ ఐమాక్స్ వెళ్లి చూసినప్పుడు యానిమల్ కోసం ఓ మూడున్నర గంటలు కేటాయించడం పెద్ద మ్యాటర్ కాదు. అసలింతకీ చూశారో లేదోననే అనుమానం తీరాల్సి ఉంది. ఒకవేళ చూశాక ఇంత అడల్ట్ కంటెంట్, సన్నివేశాలు ఉంటాయని ఊహించలేదు కాబట్టి ఇప్పుడేమైనా ప్రశంసలు గుప్పిస్తే ఏమైనా విమర్శలు వస్తాయని అనుమానంగా ఉందో ఏమిటో. అయినా వారం తిరక్కుండానే వందల కోట్లు దాటేసిన మూవీకి ఆడియన్స్ మద్దతు దొరికినప్పుడు ఇక ఆలోచించడానికి ఏముంది.

గతంలో పలు సందర్భాల్లో మహేష్ ఆలస్యంగా సినిమా చూడటం వల్ల లేట్ గా స్పందించిన ఉదంతాలున్నాయి. మహేష్, రాజమౌళి ఇద్దరూ కోరుకోవాలే కానీ ఇంట్లోనే క్యూబ్ ద్వారా లేదా డిజిటల్ కీ ద్వారా నిమిషాల్లో షో ఏర్పాటు చేసుకునే వెసులుబాటు యానిమల్ నిర్మాతలు ఇస్తారు. కానీ వాడుకోవడం లేదంటే బహుశా ఆగమనే మెసేజ్ వచ్చిందేమో. సూపర్ స్టారని మహేష్ తోనే అనిపించుకున్న రన్బీర్ కపూర్ మళ్లోసారి హైదరాబాద్ వచ్చి సక్సెస్ మీట్ లో పాల్గొనే ఆలోచనలో ఉన్నాడు. అన్నట్టు సందీప్ వంగా నానిమల్ ఇంటర్వ్యూ చేసుకున్న నాని కూడా ఇంకా యానిమల్ చూసినట్టు లేడు.

Satya

Recent Posts

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

60 minutes ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

2 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

2 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

3 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

3 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

4 hours ago