Movie News

ఇద్దరి మౌనం వెనుక కారణముందేమో

హైదరాబాద్ లో జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు, రాజమౌళిలు గెస్టులుగా రావడం ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిన విషయమే. ట్రైలర్ చూసి మెంటల్ వచ్చిందని మహేష్, వర్మ లాంటి అరుదైన దర్శకుల జాబితాలో సందీప్ రెడ్డి వంగాకు చోటివ్వాలని జక్కన్న ఇలా ఇద్దరూ కలిసి ఓ రేంజ్ లో పొగిడారు. కట్ చేస్తే సినిమా విడుదలై ఇవాళ్టికి నాలుగో రోజు. సోషల్ మీడియాలో వీళ్ళ స్పందన కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఎలాంటి ట్వీట్లు, స్టోరీలు కనిపించడం లేదు. మహేష్ అంటే గుంటూరు కారం షూటింగ్ లో బిజీ ఉండి ఇంకా కుదరలేదనుకోవచ్చు

కానీ రాజమౌళికి తగినంత సమయం ఉంది. తన మద్దతు అవసరమైన చిన్న చిత్రాలకే ప్రసాద్ ఐమాక్స్ వెళ్లి చూసినప్పుడు యానిమల్ కోసం ఓ మూడున్నర గంటలు కేటాయించడం పెద్ద మ్యాటర్ కాదు. అసలింతకీ చూశారో లేదోననే అనుమానం తీరాల్సి ఉంది. ఒకవేళ చూశాక ఇంత అడల్ట్ కంటెంట్, సన్నివేశాలు ఉంటాయని ఊహించలేదు కాబట్టి ఇప్పుడేమైనా ప్రశంసలు గుప్పిస్తే ఏమైనా విమర్శలు వస్తాయని అనుమానంగా ఉందో ఏమిటో. అయినా వారం తిరక్కుండానే వందల కోట్లు దాటేసిన మూవీకి ఆడియన్స్ మద్దతు దొరికినప్పుడు ఇక ఆలోచించడానికి ఏముంది.

గతంలో పలు సందర్భాల్లో మహేష్ ఆలస్యంగా సినిమా చూడటం వల్ల లేట్ గా స్పందించిన ఉదంతాలున్నాయి. మహేష్, రాజమౌళి ఇద్దరూ కోరుకోవాలే కానీ ఇంట్లోనే క్యూబ్ ద్వారా లేదా డిజిటల్ కీ ద్వారా నిమిషాల్లో షో ఏర్పాటు చేసుకునే వెసులుబాటు యానిమల్ నిర్మాతలు ఇస్తారు. కానీ వాడుకోవడం లేదంటే బహుశా ఆగమనే మెసేజ్ వచ్చిందేమో. సూపర్ స్టారని మహేష్ తోనే అనిపించుకున్న రన్బీర్ కపూర్ మళ్లోసారి హైదరాబాద్ వచ్చి సక్సెస్ మీట్ లో పాల్గొనే ఆలోచనలో ఉన్నాడు. అన్నట్టు సందీప్ వంగా నానిమల్ ఇంటర్వ్యూ చేసుకున్న నాని కూడా ఇంకా యానిమల్ చూసినట్టు లేడు.

This post was last modified on December 4, 2023 12:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

8 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

11 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago