దశాబ్దాలు గడుస్తున్నా ఒకప్పటి హీరోయిన్, ఐటెం సాంగ్స్ డ్రీం గర్ల్ సిల్క్ స్మిత అంటే తెలుగు తమిళ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఎమోషన్. కేవలం ఆమె పాట కోసమే జనం థియేటర్లకు వెళ్లేవారంటే అతిశయోక్తి కాదు. ఓసారి దాసరి గారు సిల్క్ మీద తీయాల్సిన పాటను వద్దనుకున్నారని తెలుసుకుని డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా సినిమానే కొనమని చెప్పేశారంటే ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సిల్క్ స్మిత జీవితం పూల బాట కాదు. చాలా వివాదాలు చూడాల్సి వచ్చింది. వ్యక్తిగత జీవితంలో చెలరేగిన అలజడుల గురించి అప్పటి పత్రికల్లో ఎన్నో కథనాలు వచ్చేవి.
వీటి ఆధారంగానే విద్యా బాలన్ టైటిల్ పాత్రలో 2011లో మిలన్ లుత్రియా దర్శకత్వంలో ది డర్టీ పిక్చర్ తీశారు. కమర్షియల్ మంచి విజయం సాధించడంతో పాటు ప్రశంసలు చాలానే వచ్చాయి. కొంత కాంట్రావర్సి కూడా రేగింది. ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదనుకుంటున్న టైంలో చంద్రికా రవితో ప్యాన్ ఇండియా లెవెల్ లో ఇంకో మూవీకి శ్రీకారం చుడుతున్నారు. జయరామ్ దర్శకత్వంలో ఇది రూపొందనుంది. ఇంకా పేరు నిర్ణయించలేదు కానీ అన్ టోల్డ్ స్టోరీ అని ట్యాగ్ లైన్ పెట్టి ప్రపంచానికి తెలియని కథను చూపిస్తామని మేకర్స్ హింట్ ఇస్తున్నారు.
చంద్రిక రవి అంటే ఆ మధ్య వీరసింహారెడ్డిలో మనోభావాల్ దెబ్బ తిన్నాయే పాటలో బాలయ్యతో ఆడిపాడిన భామనే. లుక్స్ పరంగా బాగానే అనిపిస్తోంది కానీ అసలు డర్టీ పిక్చర్ కన్నా డర్టీగా ఇంకేం చూపిస్తారనే సందేహం కలుగుతోంది. అయినా ఒక దివంగత తార గురించి అందులోనూ విషాదంగా అనుమానాస్పద రీతిలో చనిపోయిన స్టార్ మీద కేవలం బిజినెస్ కోసం సినిమాలు తీయడం ఎంతవరకు సబబని నిన్నటి తరం అభిమానులు నిలదీస్తున్నారు. ఒకవేళ కాంట్రావర్సి వాడుకోవడమే కాన్సెప్ట్ అయితే ఏం చేయలేం. కనీసం ఆవిడ ఆత్మహత్య వెనుక అసలు రహస్యాన్ని బయటికి తీస్తే సంతోషమే.
This post was last modified on December 2, 2023 1:10 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…