నిన్న వైజాగ్ లో జరిగిన హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో సహా అందరూ హాజరై అభిమానులకు మంచి జోష్ ఇచ్చారు. న్యాచురల్ స్టార్ నాని డిసెంబర్ ని మరో సంక్రాంతితో పోలుస్తూ ఖచ్చితంగా ఈ మూవీ అందరికీ నచ్చుతుందని హామీ ఇచ్చేశాడు. ఇదంతా బాగానే ఉంది నిర్వాహకుల అత్యుత్సాహం వల్ల చేసిన ఒక పొరపాటు సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారానికి దారి తీసింది. యాంకర్ సుమ కొందరు సెలబ్రిటీ జంటల ఫోటోలు చూపిస్తూ టీమ్ ని ప్రశ్నలు అడిగే గేమ్ లో భాగంగా స్క్రీన్ మీద విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు సేదతీరుతున్న పిక్ చూపించారు.
దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. విజయ్, రష్మికలు వేర్వేరుగా ఒకే లొకేషన్ లో తీసుకున్న ఫోటోలను పక్కపక్కన పెట్టేసి దానికేదో నిర్వచనం ఇవ్వాలనుకోవడం మిస్ ఫైర్ అయ్యింది. హఠాత్తుగా ఇది జరిగే సరికి నాని ఏమనాలో అర్థం కాక నవ్వు ఎక్స్ ప్రెషన్ ఇవ్వగా, మృణాల్ ఠాకూర్ వాటీజ్ దిస్ అంటూ ఆశ్చర్యపోవడం స్పష్టంగా కనిపించింది. కెమెరామెన్, ఎడిటర్ మీద జోకు వేస్తూ సుమ ఏదో కవర్ చేయబోయింది కానీ లైవ్ ఈవెంట్ కావడంతో దాని తాలూకు వీడియోలు బయటికి వచ్చేసి ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఇదేం వాడకమని అంటున్నారు.
ఇదంతా నానికి తెలిసి జరిగింది కాదు. సరదాగా ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని సడన్ సర్ప్రైజ్ లు నిర్వాహకులు ప్లాన్ చేయడం సహజం. కానీ కొన్ని సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య ఏముందో వాళ్లే బహిర్గతంగా చెప్పే దాకా గాసిప్ గానే తీసుకోవాలి. అన్ స్టాపబుల్ షోలోనూ బయటపడని సంగతి మర్చిపోకూడదు. అలాంటిది లక్షలాది మంది చూస్తున్న వేడుకలో ఇలా ప్రైవేట్ ఫోటోలతో ఏదో చేయబోయి ఇంకేదో టార్గెట్ చేసుకున్నారు. డిసెంబర్ 7 విడుదల కాబోతున్న హాయ్ నాన్న ప్రమోషన్ల కోసం నాని ఎడతెరపి లేకుండా తిరుగుతూనే ఉన్నాడు
This post was last modified on November 30, 2023 11:29 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…