సెప్టెంబరు 5 కోసం ఇటు ఇండస్ట్రీ జనాలు.. అటు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లో సైతం ఈ డేట్ ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా బాలీవుడ్ నుంచే బడా సినిమాలు ఓటీటీల్లో నేరుగా రిలీజయ్యాయి. సౌత్లో అన్నీ చిన్న సినిమాలే వచ్చాయి. ఇప్పటిదాకా ‘వి’ స్థాయి సినిమా ఏదీ సౌత్ ఇండియాలో నేరుగా ఓటీటీలో రిలీజ్ కాలేదు.
ఈ స్థాయి సినిమా ఇక్కడ రిలీజై ఎలాంటి స్పందన రాబట్టుకుంటుంది.. ఆ సినిమాను కొన్న అమేజాన్ ప్రైమ్కు ఎలాంటి ఫలితాన్నందిస్తుంది.. పెట్టుబడికి తగ్గ ప్రయోజనం చేకూరుస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటిదాకా ఓటీటీల్లో రిలీజైన సినిమాల మీద అవి పెట్టిన పెట్టుబడి తక్కువ. కాబట్టి వాటికి ఏ స్థాయిలో వ్యూస్ ఉన్నాయి.. కొత్తగా ఏ మేర సబ్స్క్రిప్షన్లు పెరిగాయన్నది పెద్ద విషయం కాదు.
కానీ ‘వి’ సినిమా అలా కాదు. దాని మీద అమేజాన్ ప్రైమ్ రూ.32 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ సినిమాకు ఏ స్థాయిలో వ్యూస్ వస్తాయన్నది కీలకం. దాన్ని బట్టే ఆ యాప్కు తెలుగులో ఉన్న రీచ్ ఏంటో.. కొత్తగా ఎన్ని సబ్స్క్రిప్షన్లు పెరిగాయో తెలుస్తుంది. ఇప్పటిదాకా ఇలాంటి ప్రయోజనం బాలీవుడ్ సినిమాలు మాత్రమే చేకూరుస్తాయని.. వాటి మీద భారీ పెట్టుబడులు పెట్టాయి ఓటీటీలు. సౌత్ సినిమాల మీద అలాంటి నమ్మకం కుదర్లేదు. అలాగే ఇక్కడి నిర్మాతలు కూడా ఓటీటీల్లో రిలీజ్ చేసే విషయంలో వెనుకంజ వేశారు.
‘వి’ కనుక భారీగా ప్రేక్షకుల్ని ఆకర్షించి.. పెద్ద ఎత్తున వ్యూస్ తెచ్చుకుంటే, కొత్త సబ్స్క్రిప్షన్లను పెంచితే.. ఓటీటీలు తెలుగు సినిమాల మీద కూడా పెద్ద పెట్టుబడులు పెడతాయి. మరిన్ని సినిమాలకు మంచి డీల్స్ వస్తాయి. ఇరు వైపులా ప్రయోజనం ఉంటుంది. అలాగే థియేటర్లకు దూరమైన ప్రేక్షకులకు కూడా మంచి వినోదం అందుతుంది. మరి సెప్టెంబరు 5న నాని సినిమా ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.
This post was last modified on August 31, 2020 9:51 am
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…