ఇప్పుడంతా ఎక్కడ చూసినా యానిమల్ గురించిన చర్చలు, టికెట్ల గురించిన వార్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సలార్ విడుదల ఇంకో ఇరవై మూడు రోజులు మాత్రమే ఉండటం చూసి ప్రమోషన్ పరంగా టెన్షన్ పడుతున్నారు. డిసెంబర్ 1 సాయంత్రం ట్రైలర్ విడుదలకు హోంబాలే ఫిలిమ్స్ రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో టైమర్ తో సహా మొత్తం సెట్ చేసి పెట్టారు. మరోవైపు డంకీ ట్రైలర్ కట్ సెన్సార్ చేసుకుని రెడీగా ఉంది. రెండు నిమిషాల నలభై సెకండ్ల వెర్షన్ ని ఎప్పుడు రిలీజ్ చేయాలనే చర్చలో రాజ్ కుమార్ హిరానీ బిజీగా ఉన్నారు.
ఈ యానిమల్ హడావిడి రెండు మూడు రోజులు బలంగా ఉంటుంది కాబట్టి కాస్త వేచి చూసి ఆపై నాన్ స్టాప్ గా ప్రమోషన్లు చేసేందుకు సలార్ టీమ్ రెడీ అవుతోంది. ట్రైలర్ లాంచ్ కి ఈవెంట్ చేసేది లేనిది ఇంకా తెలియదు. ప్రభాస్ అందుబాటులోనే ఉన్నాడు కానీ చెన్నై, హైదరాబాద్, ముంబై ఈ మూడు నగరాల్లో ఒక వేదిక మీద నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కానీ ప్రస్తుతానికి ఆ సూచనలైతే కనిపించడం లేదు. దీన్ని సింపుల్ గా కానిచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్లను పలు నగరాల్లో ఘనంగా చేయడం గురించి సీరియస్ గా చూస్తున్నారట. ఏదీ ఫైనల్ చేయలేదు.
ఇక్కడింకో సమస్య ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. రవి బస్రూర్ రీ రికార్డింగ్ సైతం విపరీతమైన ఒత్తిడిలో జరుగుతోంది. సెన్సార్ కాపీ సిద్ధమయ్యే దాకా ఈ ఇద్దరూ రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. ఎలాగూ ట్రైలర్ వచ్చాక అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ ఎలాంటి ఓవర్ పబ్లిసిటీ అక్కర్లేదని నీల్ అభిప్రాపడుతున్నారట. ఇంకా లిరికల్ వీడియోస్ వదలాలి. డిసెంబర్ 22 ఎంతో దూరంలో లేదు. రోజులు గడిచే కొద్దీ అభిమానుల ఎగ్జైట్ మెంట్ తారాస్థాయికి చేరుకుంటోంది. రెండో వారంలోనే బుకింగ్స్ మొదలవుతాయి.
This post was last modified on November 28, 2023 11:28 am
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…