ఇవాళ సాయంత్రం జరగబోయే యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మల్లారెడ్డి యూనివర్సిటీ రెడీ అవుతోంది. హీరో హీరోయిన్ తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్ అందరూ ఈ వేడుకలో పాలు పంచుకోబోతున్నారు. ముఖ్య అతిథులుగా మహేష్ బాబు, రాజమౌళి రానున్నారని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు అలెర్టయిపోయారు. విపరీతమైన రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో కేవలం కాలేజ్ విద్యార్థులు, స్టాఫ్ కు మాత్రమే అనుమతి ఉంటుందనే మెసేజ్ రాత్రి నుంచి తెగ చక్కర్లు కొడుతోంది. అదేమీ లేదని ఎవరైనా హాజరు కావొచ్చని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
అయినా సరే ఎందుకైనా మంచిదేనని మల్లారెడ్డి స్టూడెంట్స్ గా లోపలి ప్రవేశించేందుకు కొందరు ఏకంగా ఐడి కార్డులు కూడా తయారు చేయించుకోవడానికి సిద్ధ పడటం అసలు ట్విస్టు. ఒకవేళ కామన్ పబ్లిక్ కి అనుమతి లేకపోతే లోపలికి ప్రవేశించడానికి ఇంతకన్నా మార్గం లేదు. ఇంత ఎగ్జైట్ అవ్వడానికి కారణాలున్నాయి. రన్బీర్, సందీప్, రష్మిక, అనిల్ కపూర్ లు మహేష్ గురించి చెప్పే నాలుగు మాటలు లైవ్ లో చూస్తేనే కిక్ వస్తుంది. అదే స్టేజి మీద రాజమౌళి ఉంటారు కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో రూపొందబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి ఏదైనా చెప్తారనే ఆశ మరొక రీజన్.
ఇవి కాకుండా యానిమల్ గురించి మహేష్ చెప్పబోయే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఒక్కడు టైంలో ఆ సినిమాని రన్బీర్ చూసిన వైనం, రష్మికతో సరిలేరు నీకెవ్వరు జ్ఞాపకాలు, వీటితో పాటు జక్కన్న గురించి ఓ రెండు ముక్కలు, చివరిగా యానిమల్ మీద తనకున్న అంచనాలు ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తేనే మజా అనేది ఫ్యాన్స్ అభిప్రాయం. విశాలమైన మైదానంలో చేస్తున్నప్పటికీ అందరికీ పర్మిషన్లు ఇస్తే మాత్రం చోటు సరిపోయేలా లేదు. ఎంత ఐడి నిబంధన పెట్టినా ఒరిజినల్, నకిలీలను పసిగట్టడం అంత సులభం కాదు. సినిమా రేంజ్ లో హడావిడి ఈవెంట్ కి రావడం మహేష్ వల్లనే.
This post was last modified on November 27, 2023 11:08 am
గత కొన్ని నెలలుగా తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి గురించి జోరుగా ఊహాగానాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.…
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన అభిలాష చిత్రం ‘ఉరిశిక్ష’పై ఎంత పెద్ద డిబేట్ కు తెరలేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.…
చట్టసభలను గతంలో చాలామంది నేతలు దేవాలయాలుగా భావించేవారు. ప్రజల జీవితాలను మార్చగలిగే చట్టాలను చేసేందుకు తమకు అధికారం ఇచ్చారని జవాబుదారీతనంగా…
గత కొన్ని రోజులుగా మలయాళ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. తన పాస్ట్ లవ్ స్టోరీ…
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ(సర్) తెలంగాణలో ముగిసింది. దాదాపు 2 మాసాలకు పైగానే ఈ…
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన శ్రష్ఠి వర్మ.. రాజకీయాల్లోకి…