డిసెంబర్ 21, 22 తేదీల్లో షారుఖ్ ఖాన్ వర్సెస్ ప్రభాస్ పోటీని తలుచుకుని డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటి నుంచే నిద్ర పట్టడం లేదు. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా వీటికి ఒకే రకమైన ఫీవర్ కనిపించేలా ఉంది. థియేటర్లు, షోల సర్దుబాటు కోసం ఎగ్జిబిటర్లు పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే డిసెంబర్ 15 ఎవరూ తమ సినిమాను రిలీజ్ చేసేందుకు జంకేంతగా. కేవలం వారం రోజుల రన్ కి రిస్క్ లో పడటం ఇష్టం లేక వదిలేస్తున్నారు. అయితే మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ మాత్రం అయితే ఏంటి నేనూ వస్తున్నాను అంటున్నారు.
ఆయన కొత్త చిత్రం నేరు డిసెంబర్ 21 విడుదల చేయబోతున్నారు. దర్శకుడు జీతూ జోసెఫ్ కావడంతో క్రేజ్ మాములుగా లేదు. దృశ్యం సృష్టికర్తగా ఆయన పరిచయం చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్ జానర్ ని ఇప్పటికీ ఎందరో డైరెక్టర్లు ఫాలో అవుతూనే ఉన్నారు. వెంకటేష్ తో తీసిన తెలుగు రీమేక్ జీతూ జోసెఫ్ చేయకపోయినా ఓటిటిలో రిలీజైన సీక్వెల్ మాత్రం తనే హ్యాండిల్ చేశారు. సరిగ్గా పదేళ్ల క్రితం దృశ్యం విడుదలైన రోజే తమ కాంబో మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం విశేషం. ప్యాన్ ఇండియా భాషల్లో చేస్తారో లేదో ఇంకా చెప్పలేదు కేరళలో మాత్రం సలార్, డంకీలకు చిక్కు తప్పదు.
మహా క్లాష్ కు నెల రోజుల కంటే తక్కువ టైం ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు ప్రమోషన్ ప్లాన్లలో బిజీగా ఉన్నారు. ఒకటో తేదీ సలార్ ట్రైలర్ వచ్చాక అంచనాలు ఎలా పెరుగుతాయో చూడాలి. షారుఖ్ ఖాన్ టీజర్ వచ్చేసింది కాబట్టి కంటెంట్ మీద దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ హింట్ ఇచ్చారు. ఇక మోహన్ లాల్ నేరు పబ్లిసిటీని ఇంకొద్ది రోజుల్లో ప్రారంభించబోతున్నారు. మాములుగా అయితే దీని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ కేరళలో షారుఖ్, ప్రభాస్ లు మిస్ చేసుకునే రెవిన్యూ కాస్త ఎక్కువే ఉంటుందని అక్కడి పంపిణీదారులు అంటున్నారు. దేనికైనా ఫైనల్ గా టాకే కీలకం.
This post was last modified on November 24, 2023 9:07 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…