డిసెంబర్ 21, 22 తేదీల్లో షారుఖ్ ఖాన్ వర్సెస్ ప్రభాస్ పోటీని తలుచుకుని డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటి నుంచే నిద్ర పట్టడం లేదు. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా వీటికి ఒకే రకమైన ఫీవర్ కనిపించేలా ఉంది. థియేటర్లు, షోల సర్దుబాటు కోసం ఎగ్జిబిటర్లు పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే డిసెంబర్ 15 ఎవరూ తమ సినిమాను రిలీజ్ చేసేందుకు జంకేంతగా. కేవలం వారం రోజుల రన్ కి రిస్క్ లో పడటం ఇష్టం లేక వదిలేస్తున్నారు. అయితే మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ మాత్రం అయితే ఏంటి నేనూ వస్తున్నాను అంటున్నారు.
ఆయన కొత్త చిత్రం నేరు డిసెంబర్ 21 విడుదల చేయబోతున్నారు. దర్శకుడు జీతూ జోసెఫ్ కావడంతో క్రేజ్ మాములుగా లేదు. దృశ్యం సృష్టికర్తగా ఆయన పరిచయం చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్ జానర్ ని ఇప్పటికీ ఎందరో డైరెక్టర్లు ఫాలో అవుతూనే ఉన్నారు. వెంకటేష్ తో తీసిన తెలుగు రీమేక్ జీతూ జోసెఫ్ చేయకపోయినా ఓటిటిలో రిలీజైన సీక్వెల్ మాత్రం తనే హ్యాండిల్ చేశారు. సరిగ్గా పదేళ్ల క్రితం దృశ్యం విడుదలైన రోజే తమ కాంబో మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం విశేషం. ప్యాన్ ఇండియా భాషల్లో చేస్తారో లేదో ఇంకా చెప్పలేదు కేరళలో మాత్రం సలార్, డంకీలకు చిక్కు తప్పదు.
మహా క్లాష్ కు నెల రోజుల కంటే తక్కువ టైం ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు ప్రమోషన్ ప్లాన్లలో బిజీగా ఉన్నారు. ఒకటో తేదీ సలార్ ట్రైలర్ వచ్చాక అంచనాలు ఎలా పెరుగుతాయో చూడాలి. షారుఖ్ ఖాన్ టీజర్ వచ్చేసింది కాబట్టి కంటెంట్ మీద దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ హింట్ ఇచ్చారు. ఇక మోహన్ లాల్ నేరు పబ్లిసిటీని ఇంకొద్ది రోజుల్లో ప్రారంభించబోతున్నారు. మాములుగా అయితే దీని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ కేరళలో షారుఖ్, ప్రభాస్ లు మిస్ చేసుకునే రెవిన్యూ కాస్త ఎక్కువే ఉంటుందని అక్కడి పంపిణీదారులు అంటున్నారు. దేనికైనా ఫైనల్ గా టాకే కీలకం.
This post was last modified on November 24, 2023 9:07 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…