Movie News

పరశురామ్‌తో గొడవపై బన్నీ వాసు

యువ దర్శకుడు పరశురామ్‌కు, గీతా ఆర్ట్స్‌కు ఉన్న అనుబంధమే వేరు. ‘సారొచ్చారు’తో పెద్ద ఫ్లాప్ ఎదుర్కొని కష్టాల్లో ఉన్న సమయంలో గీతా ఆర్ట్స్ అతడికి అవకాశమిచ్చింది. అతను కూడా నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అల్లు అరవింద్ తనయుడు శిరీష్‌కు ఓ మంచి విజయాన్ని అందించాడు. తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ తీసిన ‘గీత గోవిందం’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. గీతా సంస్థకు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఇదొకటి. ఈ సినిమాతో పరశురామ్ రేంజ్ కూడా మారింది. మహేష్ బాబుతో సినిమా చేసే స్థాయికి వెళ్లాడు.

ఐతే ‘సర్కారు వారి పాట’ తర్వాత పరశురామ్.. గీతా సంస్థలోనే విజయ్ హీరోగా ఓ సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ అతను అనూహ్యంగా దిల్ రాజు కాంపౌండ్లో తేలాడు. విజయ్‌తోనే సినిమా ఓకే అయింది.

ఈ విషయంలో నిర్మాత అల్లు అరవింద్ బాగా హర్టయ్యాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒక ఈవెంట్లో పరోక్షంగా పరశురామ్ మీద ఆయన విమర్శలు కూడా చేశారు. ఈ వ్యవహారంపై అరవింద్ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా సిద్ధమైనట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ తర్వాత ఏమైందో తెలియదు. ఆ గొడవ గురించి ఇప్పుడు గీతా ఆర్ట్స్-2 అధినేత బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

“గీత గోవిందం తర్వాత విజయ్-పరశురామ్ కాంబినేషన్లో ఇంకో సినిమా చేయాలనుకున్నాం. అందుకోసం ఒక కథ కూడా అనుకున్నాం. అదే సమయంలో విజయ్ ఫోన్ చేసి పరశురామ్ చెప్పిన ఇంకో కథ తనకు నచ్చిందని.. దిల్ రాజు బేనర్లో అది చేస్తానని అన్నాడు. ఈ విషయంలో నన్ను, అరవింద్ గారిని ఎంతగానో బాధించింది. పరశురామ్ ఈ విషయాన్ని మాతో సరిగా కమ్యూనికేట్ చేయలేదు. విషయం అతడి ద్వారా కాకుండా వేరే మార్గంలో తెలవడంతో మేం హర్టయ్యాం. అప్పుడు మేమంతా వేడి మీద ఉన్నాం. అందుకు తగ్గట్లే రియాక్టయ్యాం. తర్వాత పరశురామ్ ఫోన్ చేసి.. తాను 14 రీల్స్ బేనర్లో ఉండగా అనుకున్న లైన్‌ను ఫ్లోలో దిల్ రాజుకు చెబితే.. ఆయన సినిమా ఓకే చేశాారని.. విజయ్‌కి కూడా కథ నచ్చి సినిమా చేయడానికి రెడీ అయ్యాడని.. ఆ విషయం తాను పొద్దున చెబుదాం అనుకునేలోపు ఇలా అయిపోయిందని వివరణ ఇచ్చాడు. తర్వాత దిల్ రాజు గారు ఫోన్ చేసి, నీకీ సినిమాలో వాటా కావాలంటే తీసుకో అన్నారు. కానీ అరవింద్ గారే.. అలా వద్దని చెప్పారు. ఇప్పుడు అంతా సద్దుమణిగింది. విజయ్, పరశురామ్ కాంబినేషన్లో మేం సినిమా చేస్తాం” అని బన్నీ వాసు తెలిపాడు.

Satya

Recent Posts

అమ‌రావ‌తికి ముంబై సినీ ప‌రిశ్ర‌మ‌!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌నుల నిర్మాణం వేగంగా జ‌రుగుతోంద‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. ఇక్క‌డ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు అనేక…

55 minutes ago

సమ్మతితో వేశ్యావృత్తి చేస్తే నో కేస్.. స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం

సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…

3 hours ago

‘సనాతనం’పై ఉదయనిధికి సీనియర్ హీరో కౌంటర్

సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…

3 hours ago

1000 కోట్ల భూ క‌బ్జా కేసు.. ప‌రారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. ఆపార్టీకి చెందిన నాయ‌కులు అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…

4 hours ago

విజయవాడ మ్యాచులో బౌండరీ దాటాల్సిందే

పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…

4 hours ago

కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…

6 hours ago