బాక్సాఫీస్ వద్ద అయిదో వారంలోనూ నిలకడ చూపిస్తున్న భగవంత్ కేసరి నిన్న అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. మాములుగా ఇలాంటి పెద్ద సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్లతో భారీ హడావిడి చేసే ఈ డిజిటల్ కంపెనీ ఇప్ప్పుడు స్ట్రాటజీ మార్చింది. ముందు గుట్టుచప్పుడు కాకుండా విడుదల చేసి ఆ తర్వాత సోషల్ మీడియాతో మొదలుపెట్టి శాటిలైట్ ఛానల్స్ దాకా ప్రచారాన్ని ఊపందుకునేలా చేస్తుంది. గత వారం టైగర్ నాగేశ్వరరావుకు ఇదే ఫాలో అయిన ప్రైమ్ ఇప్పుడు బాలయ్య మూవీకి అంతకు మించి పబ్లిసిటీని గట్టిగా ప్లాన్ చేస్తోంది.
ఇప్పుడొచ్చిన భగవంత్ కేసరి మరోసారి చూసేందుకు బాలయ్య అభిమానులకో బలమైన కారణం దొరికింది. మొదటిసారి ఆయన స్వయంగా హిందీలో డబ్బింగ్ చెప్పిన వెర్షన్ ని అందుబాటులో ఉంచారు. ఈ విషయాన్ని ఇటీవలే సక్సెస్ మీట్ లో చెప్పిన బాలకృష్ణ నిజంగానే స్వంత గొంతుతో మెప్పించారు. అర్జున్ రామ్ పాల్ కు ధీటుగా డైలాగులు చెబుతున్న వీడియోలను ఫ్యాన్స్ ఆల్రెడీ షేర్ చేయడం మొదలుపెట్టారు. ముందస్తు ఒప్పందాల కారణంగా నాలుగు వారాలు దాటగానే భగవంత్ కేసరి ఓటిటిలో వచ్చింది. దీంతో పాటే రావాల్సిన లియోని ఆలస్యంగా మధ్యాన్నం నుంచి వదులుతున్నారు.
బ్యాక్ టు బ్యాక్ బాలయ్యకు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాబట్టి భగవంత్ కేసరి ప్రైమ్ కి భారీ వ్యూస్ తేవడం ఖాయమే. గత కొన్ని నెలలుగా నెట్ ఫ్లిక్స్ దూకుడుకి పెద్ద సినిమాలు చేజార్చుకున్న ప్రైమ్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. అందుకే అన్ని భాషలను ఒకేసారి డబ్బింగ్ రూపంలో ఇస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే పాయింట్ ఎంతగా ఫ్యామిలీ జనాలకు రీచ్ అయ్యిందో చూస్తున్నాం. గత పది రోజులుగా పలు చోట్ల స్కూల్ పిల్లలకు ప్రత్యేకంగా షోలు వేసి మరీ భగవంత్ కేసరిని చూపిస్తున్నారు. ఇప్పుడిక నేరుగా పాఠశాలల్లోనే వేస్తారేమో.
This post was last modified on November 24, 2023 9:47 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…