Political News

ర‌మ్మంటున్నా.. రానంటున్న కేటీఆర్‌.. మునుగోడు ముచ్చట తెలుసా?

ఎన్నిక‌ల వేళ.. అగ్ర‌నాయ‌కుల ప్ర‌చారం కోరుకోని అభ్య‌ర్థులు ఎవ‌రుంటారు? అగ్ర‌నేత‌లు వ‌స్తే.. త‌మ గెలుపున‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌ని భావించ‌ని నాయ‌కులు ఎవ‌రుంటారు? అందుకే.. ఇప్పుడు తెలంగాణ‌లో అధికార పార్టీ బీఆర్ ఎస్ స‌హా కాంగ్రెస్‌లోఅగ్ర‌నేత‌ల‌కు డిమాండ్ పెరిగిపోయింది. ఐదు నిమిషాలు వ‌చ్చి ప్ర‌చారంలో ఇలా క‌నిపించి.. అలా వెళ్లిపోండి అంటూ.. ఈ రెండు పార్టీల్లోనూ అగ్ర‌నేత‌ల‌కు అభ్య‌ర్థుల నుంచి విన్న‌పాలు వ‌స్తున్నాయి.

ఇలానే బీఆర్ ఎస్ అగ్ర‌నేత, మంత్రి కేటీఆర్ కు కూడా అభ్య‌ర్థుల నుంచి ఫోన్లు.. మెసేజ్‌లు జోరుగా వ‌స్తున్నాయి. మా నియోజ‌క‌వ‌ర్గానికి రండి అంటే.. మా నియోజ‌వ‌క‌ర్గానికి రండి అంటూ నాయ‌కులు కోరుతున్నారు. ఈ క్ర‌మంలో కేటీఆర్ నిన్న మొన్న‌టి వ‌ర‌కు సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. అయితే.. డిజిట‌ల్ మీడియాలో కాంగ్రెస్ జోరుగా ఉండ‌డంతో దీనికి అడ్డుక‌ట్ట వేసేందుకు ఇంట‌ర్వ్యూలు, చిట్ చాట్‌ల‌కు ఆయ‌న ప్రాధాన్యం ఇస్తూ.. నిరంత‌రం టీవీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు.

ఇదిలావుంటే.. త‌న త‌ర‌ఫున ప్ర‌చారం చేయాల‌ని మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత బీఆర్ ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి కేటీఆర్‌ను కోరుతున్నారు. ఒక్క‌సారివ‌చ్చి పోరాదే! అని ప్రాధేయ ప‌డుతున్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ నుంచి బ‌ల‌మైన నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి ఇక్క‌డ నుంచి పోటీలో ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. పైగా క‌మ్యూనిస్టులు కూడా.. వేరుగా పోటీ చేస్తున్నారు. దీంతో ప్ర‌భాక‌ర్‌రెడ్డి గెలుపుపై ఆశ‌లు స‌న్న‌గిల్లుతున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలో కేటీఆర్ ద్వారా అయినా.. ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కానీ ఎంత అడిగినా.. కేటీఆర్ మాత్రం కాలు క‌ద‌ప‌డం లేదు. మునుగోడు ముచ్చ‌ట‌ను ప‌ట్టించుకోవ‌డం కూడా లేదు. దీంతో ఆయ‌న ఎందుకు ఇంత‌గా దీనిపై శీత‌క‌న్నేశారు? అనే చ‌ర్చ సాగుతోంది. దీనికి ప్ర‌ధానంగా.. గ‌త ఏడాది జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కేటీఆర్ ఇక్క‌డ విస్తృతంగా ప్ర‌చారం చేశారు. ఇక్క‌డే మ‌కాం వేశారు. ఇక్క‌డ క‌నుక ఉప ఎన్నిక‌లో కూసుకుంట్ల‌ను గెలిపిస్తే.. మునుగోడును తానే ద‌త్త‌త తీసుకుని డెవ‌ల‌ప్ చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

సిరిసిల్ల మాదిరిగా మునుగోడును ప‌రుగులు పెట్టిస్తాన‌ని, ద‌ళిత బంధును పూర్తిగా అమ‌లు చేస్తామ‌ని.. ఇళ్లు ఇస్తామ‌ని.. ఇలా అనేక హామీలు గుప్పించారు. ఏదేమైనా.. ఉప ఎన్నిక‌ల్లో కూసుకుంట్ల‌కు మునుగోడు ప్ర‌జ‌లు జై కొట్టారు. క‌ట్ చేస్తే.. ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ఉన్నాయి. అంతేకాదు.. ఉప పోరు త‌ర్వాత‌.. కేటీఆర్ క‌నీసం క‌న్నెత్తి కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం వైపు చూడ‌లేదు. దీంతో ఇప్పుడు మ‌రోసారిఇక్క‌డ‌కు వ‌చ్చి.. ఏం చెప్పాలి? అనేది ఆయ‌న ఆలోచ‌న కావొచ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అందుకే మునుగోడు ముచ్చ‌ట‌ను పక్క‌న పెట్టార‌ని చెబుతున్నారు.

This post was last modified on November 24, 2023 9:59 am

Share
Show comments

Recent Posts

మైఖేల్ జాక్సన్ మీద ఇంత ప్రేమ ఉందా

ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…

4 hours ago

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

5 hours ago

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…

7 hours ago

LSG: ఓనర్ గోయెంకా కోపంలో తప్పు లేదు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…

7 hours ago

తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…

7 hours ago

క‌విత దూకుడు మామూలుగా లేదు

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. మాజీసీఎం కేసీఆర్ త‌న‌య‌గా.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఆ పార్టీతో…

7 hours ago