ఎన్నికలకు కొంతకాలం ముందువరకు కేసీయార్, కేటీయార్, హరీష్ రావులు పదేపదే కాళేశ్వరం ప్రాజెక్టును బాగా హైలైట్ చేసేవారు. ఎక్కడ ఏ సందర్భం వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఘనంగా చెప్పుకునే వారు. తాము కాబట్టే అంత బారీ ప్రాజెక్టును కట్టగలిగినట్లు ప్రకటించుకునేవారు. కేంద్రప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోయినా కేసీయార్ ఒంటిచేత్తో ప్రాజెక్టును నిర్మించినట్లు అభినందించేవారు. నిజంగానే కాళేశ్వరం అంత గొప్ప నిర్మాణమే అయితే ఇపుడు దాని గురించి మాటమాత్రంగా కూడా ఎదుకుని ప్రస్తావించటంలేదు.
ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని డొల్లతనం బయటపడింది కాబట్టే. ఆమధ్య గట్టిగా కురిసిన వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ ముణిగిపోయింది. చాలా మోటార్లు పనిచేయలేదు. ప్రాజెక్టు లోపలకంతా నీళ్ళొచ్చేశాయి. దాంతోనే ప్రాజెక్టు నిర్మాణంలోని లోపాలు బయటపడ్డాయి. పాడైపోయిన పంపుహౌస్, మోటార్లను రిపేర్టు చేయటానికి విదేశాల నుండి ఇంజనీర్లు రావాల్సిందే అని అప్పట్లోనే మన ఇంజనీర్లు తేల్చిచెప్పారు. అప్పటినుండి ప్రాజెక్టు ఘనత గురించి చెప్పుకోవటం తగ్గించేశారు.
ఈమధ్యనే అంటే ఎన్నికల హీట్ బాగా పెరిగిపోతున్న సమయంలో సడెన్ గా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ కుంగిపోయింది. పిల్లర్ కుంగిపోవగంతో బ్యారేజికి కూడా క్రాక్ వచ్చేసింది. దాంతో మేడిగ్గడ బ్యారేజిలో అవినీతి బయటపడింది. ఇదే సమయంలో అన్నారం ప్రాజెక్టులో అవినీతి కూడా బయటపడింది. దాంతో ఇపుడు కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల గురించి మాట్లాడాలంటేనే కేసీయార్ అండ్ కో భయపడుతున్నారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడితే పరువు పోవటమే కాకుండా చెత్తను తమంతట తామే నెత్తిన వేసుకున్నట్లవుతుందని అసలా ప్రస్తావన కూడా తేవటంలేదు.
పోనీ వీళ్ళు ప్రస్తావించటంలేదు సరే ప్రతిపక్షాల ఆరోపణలకైనా సమాధానాలు ఇస్తున్నారా అంటే అంత ధైర్యం చేయటంలేదు. అసలు కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు తెలంగాణాలో లేవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్ధులు ఎవరు పై ప్రాజెక్టుల గురించి ఎక్కడా మాట్లాడద్దని, ఎవరైనా ప్రశ్నించినా సమాధానాలు చెపవద్దని కేసీయార్ స్పష్టంగా ఆదేశించారట. దీంతోనే అర్ధమైపోతోంది కేసీయార్ చెప్పుకున్న ప్రాజెక్టుల నిర్మాణాలు ఎంతటి ఘనమైనవో. అందుకనే ఎన్నికల్లో ఎక్కడా వాటి ప్రస్తావనే తేవటంలేదు.
This post was last modified on November 24, 2023 10:28 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…