ఎన్నికలకు కొంతకాలం ముందువరకు కేసీయార్, కేటీయార్, హరీష్ రావులు పదేపదే కాళేశ్వరం ప్రాజెక్టును బాగా హైలైట్ చేసేవారు. ఎక్కడ ఏ సందర్భం వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఘనంగా చెప్పుకునే వారు. తాము కాబట్టే అంత బారీ ప్రాజెక్టును కట్టగలిగినట్లు ప్రకటించుకునేవారు. కేంద్రప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోయినా కేసీయార్ ఒంటిచేత్తో ప్రాజెక్టును నిర్మించినట్లు అభినందించేవారు. నిజంగానే కాళేశ్వరం అంత గొప్ప నిర్మాణమే అయితే ఇపుడు దాని గురించి మాటమాత్రంగా కూడా ఎదుకుని ప్రస్తావించటంలేదు.
ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని డొల్లతనం బయటపడింది కాబట్టే. ఆమధ్య గట్టిగా కురిసిన వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ ముణిగిపోయింది. చాలా మోటార్లు పనిచేయలేదు. ప్రాజెక్టు లోపలకంతా నీళ్ళొచ్చేశాయి. దాంతోనే ప్రాజెక్టు నిర్మాణంలోని లోపాలు బయటపడ్డాయి. పాడైపోయిన పంపుహౌస్, మోటార్లను రిపేర్టు చేయటానికి విదేశాల నుండి ఇంజనీర్లు రావాల్సిందే అని అప్పట్లోనే మన ఇంజనీర్లు తేల్చిచెప్పారు. అప్పటినుండి ప్రాజెక్టు ఘనత గురించి చెప్పుకోవటం తగ్గించేశారు.
ఈమధ్యనే అంటే ఎన్నికల హీట్ బాగా పెరిగిపోతున్న సమయంలో సడెన్ గా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ కుంగిపోయింది. పిల్లర్ కుంగిపోవగంతో బ్యారేజికి కూడా క్రాక్ వచ్చేసింది. దాంతో మేడిగ్గడ బ్యారేజిలో అవినీతి బయటపడింది. ఇదే సమయంలో అన్నారం ప్రాజెక్టులో అవినీతి కూడా బయటపడింది. దాంతో ఇపుడు కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల గురించి మాట్లాడాలంటేనే కేసీయార్ అండ్ కో భయపడుతున్నారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడితే పరువు పోవటమే కాకుండా చెత్తను తమంతట తామే నెత్తిన వేసుకున్నట్లవుతుందని అసలా ప్రస్తావన కూడా తేవటంలేదు.
పోనీ వీళ్ళు ప్రస్తావించటంలేదు సరే ప్రతిపక్షాల ఆరోపణలకైనా సమాధానాలు ఇస్తున్నారా అంటే అంత ధైర్యం చేయటంలేదు. అసలు కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు తెలంగాణాలో లేవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్ధులు ఎవరు పై ప్రాజెక్టుల గురించి ఎక్కడా మాట్లాడద్దని, ఎవరైనా ప్రశ్నించినా సమాధానాలు చెపవద్దని కేసీయార్ స్పష్టంగా ఆదేశించారట. దీంతోనే అర్ధమైపోతోంది కేసీయార్ చెప్పుకున్న ప్రాజెక్టుల నిర్మాణాలు ఎంతటి ఘనమైనవో. అందుకనే ఎన్నికల్లో ఎక్కడా వాటి ప్రస్తావనే తేవటంలేదు.
This post was last modified on November 24, 2023 10:28 am
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…