టాలీవుడ్లో కొన్ని విజయవంతమైన డైరెక్టర్-రైటర్ జోడీలున్నాయి. విజయభాస్కర్-త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీను వైట్ల-కోన వెంకట్, సురేందర్ రెడ్డి-వక్కంతం వంశీ జోడీలు ఈ కోవలోనివే. వీళ్ల కలయికలో మరపురాని సినిమాలు వచ్చాయి. ఐతే కొంత కాలం తర్వాత ఈ జోడీలు విడిపోక తప్పలేదు. త్రివిక్రమ్ దర్శకుడిగా మారి పెద్ద రేంజికి వెళ్లగా, విజయభాస్కర్ మరుగున పడిపోయాడు.
శ్రీను వైట్ల, కోన వెంకట్ మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. తర్వాత ఇద్దరూ గాడి తప్పారు. సురేందర్, వంశీ మధ్య మరీ పెద్ద గొడవలేమీ కాలేదు కానీ.. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందన్నది మాత్రం వాస్తవం. అందుకు కిక్-2 డిజాస్టర్ కావడం కూడా ఓ కారణం కావచ్చు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పని చేయలేదు.
సురేందర్ ధృవ, సైరా సినిమాలకు వేరే రచయితలతో పని చేశాడు. వంశీ దర్శకుడిగా మారి నా పేరు సూర్య సినిమా తీశాడు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అతడి కెరీర్ గందరగోళంగా మారింది. సైరా తర్వాత సురేందర్ సైతం సరైన ప్రాజెక్టు సెట్ కాక ఇబ్బంది పడుతున్నాడు.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కోసం వంశీ ఓ కథ రాసి పవన్ మిత్రుడైన నిర్మాత రామ్ తాళ్లూరికి వినిపించడం.. అతను ఓకే చేయడం.. పవన్ ఈ సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇవ్వడం, ఈ ప్రాజెక్టుక సురేందర్ను దర్శకుడిగా ఎంచుకోవడం జరిగినట్లు వార్తలొస్తున్నాయి. ముందు విభేదాల సంగతెలా ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్తో సినిమా చేసే అవకాశం రావడంతో పాత విషయాలన్నీ పక్కన పెట్టి సురేందర్, వంశీ కలిసి పని చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ అగ్ర నిర్మాత సి అశ్వినీదత్ ఇవాళ ఎమోషనల్ అయ్యారు. సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
జెన్ జీ యుగంలో యువత ఎక్కడికి పోతోందో?… ఏమేం చేస్తుందోనన్న విషయాలపై అంతు చిక్కడం లేదని చెప్పాలి. ఏదో ఒక…
లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. భవిషత్తుని కూడా చక్కగా అంచనా వేస్తారు. విశ్వరూపం…
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…