Movie News

ప‌వ‌న్ సినిమా.. క‌ల‌వ‌కేం చేస్తారు?

టాలీవుడ్లో కొన్ని విజ‌య‌వంత‌మైన డైరెక్ట‌ర్-రైట‌ర్ జోడీలున్నాయి. విజ‌య‌భాస్క‌ర్-త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీను వైట్ల‌-కోన వెంక‌ట్, సురేంద‌ర్ రెడ్డి-వ‌క్కంతం వంశీ జోడీలు ఈ కోవ‌లోనివే. వీళ్ల క‌ల‌యిక‌లో మ‌ర‌పురాని సినిమాలు వ‌చ్చాయి. ఐతే కొంత కాలం త‌ర్వాత ఈ జోడీలు విడిపోక త‌ప్ప‌లేదు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడిగా మారి పెద్ద రేంజికి వెళ్ల‌గా, విజ‌యభాస్క‌ర్ మ‌రుగున ప‌డిపోయాడు.

శ్రీను వైట్ల‌, కోన వెంక‌ట్ మ‌ధ్య విభేదాలు త‌లెత్తి విడిపోయారు. త‌ర్వాత ఇద్ద‌రూ గాడి తప్పారు. సురేంద‌ర్, వంశీ మ‌ధ్య మ‌రీ పెద్ద గొడ‌వ‌లేమీ కాలేదు కానీ.. ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌న్న‌ది మాత్రం వాస్త‌వం. అందుకు కిక్-2 డిజాస్ట‌ర్ కావ‌డం కూడా ఓ కార‌ణం కావ‌చ్చు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేయ‌లేదు.

సురేంద‌ర్ ధృవ‌, సైరా సినిమాల‌కు వేరే ర‌చ‌యిత‌లతో ప‌ని చేశాడు. వంశీ ద‌ర్శ‌కుడిగా మారి నా పేరు సూర్య సినిమా తీశాడు. ఈ సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో అత‌డి కెరీర్ గంద‌ర‌గోళంగా మారింది. సైరా త‌ర్వాత సురేంద‌ర్ సైతం స‌రైన ప్రాజెక్టు సెట్ కాక ఇబ్బంది ప‌డుతున్నాడు.

ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం వంశీ ఓ క‌థ రాసి ప‌వ‌న్ మిత్రుడైన నిర్మాత రామ్ తాళ్లూరికి వినిపించ‌డం.. అత‌ను ఓకే చేయ‌డం.. ప‌వ‌న్ ఈ సినిమా చేయ‌డానికి క‌మిట్మెంట్ ఇవ్వ‌డం, ఈ ప్రాజెక్టుక‌ సురేంద‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ఎంచుకోవ‌డం జ‌రిగిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ముందు విభేదాల సంగ‌తెలా ఉన్నప్ప‌టికీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవ‌కాశం రావ‌డంతో పాత విష‌యాల‌న్నీ ప‌క్క‌న పెట్టి సురేంద‌ర్, వంశీ క‌లిసి ప‌ని చేయ‌డానికి రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది.

This post was last modified on August 30, 2020 10:25 am

Share

Recent Posts

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…

15 minutes ago

ఇరుముడి ఇన్నింగ్స్ ఇంకా ఉన్నాయా

మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…

34 minutes ago

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

2 hours ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

3 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

4 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

8 hours ago