ఇటీవలే నాగచైతన్య హఠాత్తుగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. నిజానికి మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా అధిక శాతం స్టార్ హీరోలకు ఛానల్స్ ఉన్నప్పటికీ వాటిలో రెగ్యులర్ గా కంటెంట్ అప్లోడ్ చేయరు. ట్విట్టర్, ఇన్స్ టా మీద ఉన్న ఫోకస్ ఈ వీడియో ప్లాట్ ఫార్మ్ మీద పెట్టరు. ఆడియో కంపెనీలకు హక్కులు అమ్మేసి ఉంటారు కాబట్టి పాటలు, ట్రైలర్లు పెట్టడానికి కూడా ఛాన్స్ ఉండదు. అందుకే ఫ్యాన్స్ సైతం వీటిని లైట్ తీసుకుంటారు. ఇంత రివర్స్ ట్రెండ్ నడుస్తున్న టైంలో చైతు ఛానల్ పెట్టడంతో ఆశించిన స్థాయిలో భారీ స్పందన కనిపించడం లేదు.
దీని వెనుక ప్రత్యేక కారణం ఉందట. చైతు డిజిటల్ డెబ్యూ వచ్చే నెల డిసెంబర్ 1న ప్రైమ్ లో దూత వెబ్ సిరీస్ ద్వారా జరగబోతున్న సంగతి తెలిసిందే. దీని ప్రమోషన్ కోసం చైతన్య పేరు మీద ఒక ఛానల్ ఓపెన్ చేస్తే దాని ద్వారా ఎక్కువ రీచ్ వస్తుందని భావించి ప్రైమ్ ప్రతినిధులు ప్రత్యేకంగా అడిగారట. ఎలాగూ ఎప్పటి నుంచో ఆలోచన కాబట్టి పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయనే ఆలోచనతో అక్కినేని హీరో ఓకే చెప్పాడు. అందులో భాగంగానే తాజాగా కొందరు అభిమానులను కలుసుకున్న సర్ప్రైజ్ మూమెంట్స్ ని ఇందులోనే పంచుకున్నాడు. అందులో దూతనే హైలైట్ చేశారు.
చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ కోసం రెడీగా ఉన్న నాగచైతన్య ఒక్కసారి దూత స్ట్రీమింగ్ లోకి వచ్చాక ఒక వారం గ్యాప్ తీసుకుని సెట్స్ లోకి అడుగు పెడతాడు. ఇకపై తన షూటింగ్ కబుర్లు, వ్యక్తిగత విషయాలు, అప్డేట్లు అందులో పెడతాడో లేదో చూడాలి. ఒకవేళ క్రమం తప్పకుండ కంటెంట్ లేకపోతే మాత్రం ఇది దూత కోసమేనని అందుకోవాలి. వరస ఫ్లాపులతో ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తున్న చైతుకి బలమైన కంబ్యాక్ అవసరం. ఓటిటి అయినా కూడా దూతలో క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందని, ఆడియన్స్ ని షాక్ చేస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు.
This post was last modified on November 21, 2023 3:22 pm
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…