కొన్ని వారాల ముందు తన కొత్త చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్ విషయమై హీరో విశ్వక్సేన్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక పోస్టు, విధించిన అల్టిమేటం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాను డిసెంబరు 8న రిలీజ్ చేయాలని చాలా ముందుగానే నిర్ణయించారు. కానీ క్రిస్మస్ సినిమాల మీద ‘సలార్’ బాంబు పడటంతో లెక్కలు మారిపోయాయి. హాయ్ నాన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు సైతం డిసెంబరు రెండో వారానికి షెడ్యూల్ అయ్యాయి.
ఆల్రెడీ వరుణ్ తేజ్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సైతం డిసెంబరు రెండో వారానికే ఫిక్స్ కావడంతో పితలాటకం తప్పలేదు. ఒకటి లేదా రెండు సినిమాలను వాయిదా వేయాల్సిన పరిస్థితి. విశ్వక్ సినిమానే వాయిదా వేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో.. బ్యాగ్రౌండ్ లేకపోవడం వల్ల తొక్కేస్తున్నారని, డేట్ మారిస్తే ప్రమోషన్లకే రానన్నట్లుగా పోస్టు పెట్టాడు విశ్వక్.
ఇది నిర్మాత నాగవంశీకి కూడా ఇబ్బందికరంగా మారింది. డేట్ మార్చకపోతే ఇండస్ట్రీలో ఇబ్బంది తప్పదు. సినిమాకూ సమస్యే. మారిస్తే హీరో ఒప్పుకోడు. మరి నాగవంశీ ఏం చేస్తాడా అని అంతా ఎదురు చూశారు. ఐతే ఈ మధ్య నాగవంశీ మాటల్ని బట్టి సినిమాను వాయిదా వేస్తున్నట్లే కనిపించింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుంచి ప్రస్తుతం ఎలాంటి సౌండ్ లేదు. దాన్ని బట్టి సినిమా డిసెంబరు 8న రావడం కష్టమే అనిపిస్తోంది.
హాయ్ నాన్న సినిమా ప్రమోషన్ల పరంగా ముందుండగా.. ‘ఎక్స్ట్రా’ కూడా కొంత సందడి చేస్తోంది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఆ వీకెండ్ బరిలో ఉంటే కచ్చితంగా విశ్వక్ ఇప్పట్నుంచే హడావుడి చేసేవాడు. కాబట్టి సినిమా వాయిదా పడ్డట్లే. ఐతే సోషల్ మీడియాలో ఇంకే రకమైన యాక్టివిటీ కూడా లేకపోవడంతో విశ్వక్ తాను చెప్పినట్లే.. సినిమా వాయిదా పడితే ప్రమోషన్లకు రానన్న మాటకు కట్టబడి సైలెంట్ అయిపోతాడా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి టీంలో అంతర్గతంగా ఏం జరుగుతోందో?
This post was last modified on November 21, 2023 9:31 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…