సంక్రాంతి పోటీ ఎంత రసవత్తరంగా ఉండబోతోందో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. థియేటర్ల సర్దుబాటు, పోటీలో ఎవరుంటారు, ఎవరు తప్పుకుంటారనే దాని మీద రకరకాల విశ్లేషణలు జరుగుతూనే ఉన్నాయి. అందులో ఒకటి అల్లుడు వర్సెస్ తండ్రి కూతుళ్లు క్లాష్. ధనుష్ కెప్టెన్ మిల్లర్ డిసెంబర్ నుంచి తప్పుకుని జనవరి పొంగల్ పండక్కు వెళ్లడం ఇటీవలే ప్రకటించారు. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీలో ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటించగా శివ రాజ్ కుమార్ తదితరులు కీలకలు పాత్ర పోషిస్తున్నారు.
ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన లాల్ సలామ్ ని సంక్రాంతికే తీసుకొస్తున్నట్టు కొద్దిరోజుల క్రితమే అనౌన్స్ చేశారు. ఇందులో ఆమె తండ్రి కం సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ కీలక పాత్ర పోషించారు. ధనుష్, ఐశ్వర్య విడాకులు చట్టపరంగా తీసుకోలేదన్న మాటే కానీ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఏదైనా ఫంక్షన్ జరిగినా కలవడం లేదు. మళ్ళీ కలుస్తారనే ప్రచారం జరిగింది కానీ ప్రస్తుతానికి ఆ సూచనలు లేవు. సో ధనుష్ తో ఐశ్వర్య, రజనిలు బాక్సాఫీస్ యుద్ధంలో ఫేస్ టు ఫేస్ తలపడేందుకు రెడీ అయ్యారన్న మాట. ఇది జస్ట్ కాకతాళీయమని చెప్పడానికి లేదు.
ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా ఒకేసారి విడుదల కాబోతున్నాయి. ఇంకా హక్కుల వ్యవహారాలు పూర్తి కాలేదు కానీ సరిపడా స్క్రీన్లు దొరికినా దొరక్కపోయినా ఒకేసారి రిలీజ్ చేయాలనే ప్లాన్ తో ఉన్నారు నిర్మాతలు. ధనుష్, ఐశ్వర్యలలో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ మిల్లర్ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇంకోవైపు లాల్ సలామ్ టీజర్ పెద్దగా హైప్ పెంచలేకపోయింది. విష్ణు విశాల్ హీరో కావడం, రజని ముస్లిం గెటప్ హీరోయిజం యాంగిల్ లో అంతగా ఎలివేట్ కాకపోవడం పలు అనుమానాలు లేవనెత్తింది. చూడాలి ఈ క్లాష్ ఎలా ఉండతోందో.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…