టాలీవుడ్ లో థ్రిల్లర్ ప్లస్ హారర్ ట్రెండ్ బాగా నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు దీన్నో కామెడీ జానర్ లాగా మార్చేసిన లారెన్స్ లాంటి వాళ్ళు కమర్షియల్ సినిమాలకు షిఫ్ట్ కావడంతో మళ్ళీ సీరియస్ కథలకు డిమాండ్ వచ్చింది. విరూపాక్ష సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే పెద్ద హిట్టు కొట్టింది. ఓటిటి మూవీకి కొనసాగింపుగా వచ్చిన మా ఊరి పొలిమేర 2 థియేట్రికల్ రిలీజ్ కు రిస్క్ చేసి ఇరవై కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్లి, బయ్యర్లు నిర్మాత నమ్మకాన్ని రెట్టింపు స్థాయిలో నిలబెట్టింది. తాజాగా మంగళవారం తను టార్గెట్ చేసుకున్న ప్రేక్షకులను సంతృప్తి పరుస్తూ సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.
దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే ఎంటర్ టైన్మెంట్ లేకపోయినా కుర్చీలో కదలకుండా ఆసక్తి రేపెలా కథలు చెబితే ఆడియన్స్ థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. స్టార్లు, పాటలు పెద్దగా లేకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ ఈ సిరీస్ లో ఊరి పేరు భైరవకోన రెడీగా ఉంది. అనిల్ సుంకర నిర్మాణ భాగస్వామ్యంతో విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందింది. సందీప్ కిషన్ హీరోగా తీసిన ఈ సినిమా కూడా ఒక గ్రామం, దాని చుట్టూ అంతు చిక్కని ఒక మిస్టరీ, చేధించడానికి వచ్చిన హీరో ఈ తరహాలో సాగుతుంది. కానీ టీమ్ మాత్రం ఊహించని అంశాలు చాలా ఉంటాయని చెబుతున్నారు.
విడుదల తేదీ నిర్ణయించుకోవడంలో ఊరిపేరు భైరవకోన కిందా మీద పడుతోంది. బడ్జెట్ పాతిక కోట్ల దాకా అయ్యిందట. అంత రికవరీ కావాలంటే బ్లాక్ బస్టర్ కు తగ్గకుండా ఆడాలి. కంటెంట్ మీద నమ్మకముంది కానీ సందీప్ కిషన్ మీద అంత బిజినెస్ జరిగే పరిస్థితి లేదిప్పుడు. అందుకే స్వంతంగా రిలీజ్ చేసుకోవాల్సి రావొచ్చు. పైగా ఫిబ్రవరి దాకా డేట్లు లేవు. అప్పటిదాకా ఎదురుచూడాలంటే వడ్డీలు పెరిగిపోతాయి. ఇటీవలే ప్రమోషన్లు రీ స్టార్ట్ చేశారు కానీ ముందు విడుదలతేదీ ప్రకటించాలి. దానికన్నా ముందు హక్కులను అమ్మాలి. చూస్తుంటే ఫిబ్రవరి తప్ప అంతకు ముందు వచ్చే సూచనలు పెద్దగా లేవు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…