రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం స్థాయి ఉన్న సినిమాలకు తొలి వారం అదనపు షోలు వేసుకోవడానికి, రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలకు విన్నపాలు పెట్టుకోవడం.. అక్కడ్నుంచి అనుమతులు రావడం మామూలే. మధ్యలో ఆంధ్రప్రదేశ్ వరకు కొంచెం ఇబ్బంది తలెత్తింది కానీ.. తర్వాత చాలా వరకు సినిమాలకు అనుమతులు సులువుగానే వచ్చేస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’కు మాత్రం నిర్మాతలు అదనపు రేట్లే అడగలేదు.
పవన్కు, ఏపీ అధికార పార్టీతో ఉన్న కయ్యం తెలిసిందే కాబట్టి నిర్మాతలే తమకు తాముగా ఈ విషయంలో నియంత్రించుకుని ఉండిపోయారు. ఐతే తమకు అనుకూలంగా లేని హీరోలు, దర్శక నిర్మాతలను ఈ విషయంలో ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ప్రయత్నించింది. ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’కు అప్పట్లో కొంత ఇబ్బంది తప్పలేదు. ‘ఆదిపురుష్’కు అలాంటి సమస్యేమీ లేకపోయింది.
ఐతే అదనపు షోలు, రేట్ల కోసం సాధారణంగా రిలీజ్ వీక్లోనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. కానీ ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’ విషయంలో మాత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్ ప్లానింగ్లో ఉన్నారు. విడుదలకు నెల రోజుల ముందే ఇందుకోసం అప్లికేషన్లు పెట్టేశారట. 50 నుంచి 75 రూపాయల మేర టికెట్ల ధరలు పెంచుకునే సౌలభ్యం కల్పించాలని.. ఐదు షోలకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాలకు విన్నవించుకున్నారట.
రిలీజ్ టైంలో హడావుడి లేకుండా ఇప్పుడే ఈ పని పూర్తి చేయాలని భావించినట్లున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా ముందుగానే మొదలుపెట్టాలని.. అందుకే ఇప్పుడే రేట్లు ఖరారైపోతే మంచిదని చూస్తున్నారట. కొన్ని రోజుల్లోనే అనుమతులు వచ్చేస్తాయని.. విడుదలకు పది రోజుల ముందే బుకింగ్స్ మొదలైపోతాయని అంటున్నారు.
This post was last modified on November 18, 2023 7:28 pm
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్పడమే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆయన తన వాణిని…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…
టాలీవుడ్ దర్శకుల్లో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కమర్షియల్ లెక్కలకు దూరంగా సెన్సిబుల్ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్,…
ఇండిపెండెన్స్ డేకి ఒక రోజు ముందు ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఎంత డబ్బింగ్ సినిమా…
పెద్ద సినిమాలకు షూటింగ్ పూర్తి చేయడమే కాదు సరైన రిలీజ్ డేట్లు సెట్ చేసుకోవడం చాలా పెద్ద ఛాలెంజ్. ఈ…
కూటమిలో నాయకులకు కలివిడితప్పదు. ఈ విషయాన్ని గతంలో అనేక సందర్భాల్లో టీడీపీ-జనసేన కూడా స్పష్టం చేశాయి. అయినప్పటికీ.. కొందరు నాయకులు…