రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం స్థాయి ఉన్న సినిమాలకు తొలి వారం అదనపు షోలు వేసుకోవడానికి, రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలకు విన్నపాలు పెట్టుకోవడం.. అక్కడ్నుంచి అనుమతులు రావడం మామూలే. మధ్యలో ఆంధ్రప్రదేశ్ వరకు కొంచెం ఇబ్బంది తలెత్తింది కానీ.. తర్వాత చాలా వరకు సినిమాలకు అనుమతులు సులువుగానే వచ్చేస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’కు మాత్రం నిర్మాతలు అదనపు రేట్లే అడగలేదు.
పవన్కు, ఏపీ అధికార పార్టీతో ఉన్న కయ్యం తెలిసిందే కాబట్టి నిర్మాతలే తమకు తాముగా ఈ విషయంలో నియంత్రించుకుని ఉండిపోయారు. ఐతే తమకు అనుకూలంగా లేని హీరోలు, దర్శక నిర్మాతలను ఈ విషయంలో ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ప్రయత్నించింది. ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’కు అప్పట్లో కొంత ఇబ్బంది తప్పలేదు. ‘ఆదిపురుష్’కు అలాంటి సమస్యేమీ లేకపోయింది.
ఐతే అదనపు షోలు, రేట్ల కోసం సాధారణంగా రిలీజ్ వీక్లోనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. కానీ ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’ విషయంలో మాత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్ ప్లానింగ్లో ఉన్నారు. విడుదలకు నెల రోజుల ముందే ఇందుకోసం అప్లికేషన్లు పెట్టేశారట. 50 నుంచి 75 రూపాయల మేర టికెట్ల ధరలు పెంచుకునే సౌలభ్యం కల్పించాలని.. ఐదు షోలకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాలకు విన్నవించుకున్నారట.
రిలీజ్ టైంలో హడావుడి లేకుండా ఇప్పుడే ఈ పని పూర్తి చేయాలని భావించినట్లున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా ముందుగానే మొదలుపెట్టాలని.. అందుకే ఇప్పుడే రేట్లు ఖరారైపోతే మంచిదని చూస్తున్నారట. కొన్ని రోజుల్లోనే అనుమతులు వచ్చేస్తాయని.. విడుదలకు పది రోజుల ముందే బుకింగ్స్ మొదలైపోతాయని అంటున్నారు.
This post was last modified on November 18, 2023 7:28 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…