రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం స్థాయి ఉన్న సినిమాలకు తొలి వారం అదనపు షోలు వేసుకోవడానికి, రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలకు విన్నపాలు పెట్టుకోవడం.. అక్కడ్నుంచి అనుమతులు రావడం మామూలే. మధ్యలో ఆంధ్రప్రదేశ్ వరకు కొంచెం ఇబ్బంది తలెత్తింది కానీ.. తర్వాత చాలా వరకు సినిమాలకు అనుమతులు సులువుగానే వచ్చేస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’కు మాత్రం నిర్మాతలు అదనపు రేట్లే అడగలేదు.
పవన్కు, ఏపీ అధికార పార్టీతో ఉన్న కయ్యం తెలిసిందే కాబట్టి నిర్మాతలే తమకు తాముగా ఈ విషయంలో నియంత్రించుకుని ఉండిపోయారు. ఐతే తమకు అనుకూలంగా లేని హీరోలు, దర్శక నిర్మాతలను ఈ విషయంలో ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ప్రయత్నించింది. ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’కు అప్పట్లో కొంత ఇబ్బంది తప్పలేదు. ‘ఆదిపురుష్’కు అలాంటి సమస్యేమీ లేకపోయింది.
ఐతే అదనపు షోలు, రేట్ల కోసం సాధారణంగా రిలీజ్ వీక్లోనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. కానీ ప్రభాస్ కొత్త చిత్రం ‘సలార్’ విషయంలో మాత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్ ప్లానింగ్లో ఉన్నారు. విడుదలకు నెల రోజుల ముందే ఇందుకోసం అప్లికేషన్లు పెట్టేశారట. 50 నుంచి 75 రూపాయల మేర టికెట్ల ధరలు పెంచుకునే సౌలభ్యం కల్పించాలని.. ఐదు షోలకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాలకు విన్నవించుకున్నారట.
రిలీజ్ టైంలో హడావుడి లేకుండా ఇప్పుడే ఈ పని పూర్తి చేయాలని భావించినట్లున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా ముందుగానే మొదలుపెట్టాలని.. అందుకే ఇప్పుడే రేట్లు ఖరారైపోతే మంచిదని చూస్తున్నారట. కొన్ని రోజుల్లోనే అనుమతులు వచ్చేస్తాయని.. విడుదలకు పది రోజుల ముందే బుకింగ్స్ మొదలైపోతాయని అంటున్నారు.
This post was last modified on November 18, 2023 7:28 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…