ఫిలిం సెలబ్రెటీల గురించి మీడియాలో.. సోషల్ మీడియాలో అనేక పుకార్లు వస్తుంటాయి. వాటన్నింటి గురించి వాళ్లు పట్టించుకోవడం మొదలుపెడితే అంతే సంగతులు. అందుకే చాలా వరకు వీటిని లైట్ తీసుకుని ముందుకు వెళ్లిపోతుంటారు సెలబ్రెటీలు. కానీ వ్యక్తిగత విషయాల మీద పదే పదే టార్గెట్ చేస్తే మాత్రం ఎలాంటి వాళ్లకైనా బాధ వేస్తుంది.
ఏదో ఒక దశలో బరస్ట్ అవుతారు. మీడియా, సోషల్ మీడియా వార్తలను చాలా తేలిగ్గా తీసుకునేట్లు కనిపించే ఆలియా భట్ సైతం కొన్ని విషయాల్లో తన గురించి వచ్చే రూమర్లు చూసి చాలా బాధ పడిందట. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలు, భర్త రణబీర్ కపూర్తో రిలేషన్ విషయంలో వచ్చే వార్తలు తనను బాధ పెట్టాయని కాఫీ విత్ కరణ్ షోలో ఆమె వెల్లడించింది.
గతంలో కాఫీ విత్ కరణ్ షోలో తాను మాట్లాడుతూ.. రణబీర్కు తాను లిప్స్టిక్ వేస్తే నచ్చదని, వెంటనే తీసేయమంటాడని చెప్పానని.. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని తనను అతను వేధిస్తున్నాడంటూ వార్తలు రాశాడని.. ఇది తననెంతో బాధించిందని ఆలియా చెప్పింది. రణబీర్ చాలా మంచి వ్యక్తి అని.. అతను తననెంతో బాగా చూసుకుంటాడని ఆమె వ్యాఖ్యానించింది.
తన వైవాహిక జీవితంలో సమస్యలున్నట్లు చాలాసార్లు రూమర్లు క్రియేట్ చేశారని.. ఒకప్పుడు బాధ పడ్డా తర్వాత పట్టించుకోవడం మానేశానని ఆమె అంది. తాను కొవ్వు తగ్గించుకుని సన్నగా మారడం కోసం.. అలాగే తన చర్మాన్ని తెల్లగా చేసుకోవడం కోసం సర్జరీలను ఆశ్రయించానని కూడా ప్రచారం చేశానని.. ఈ ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి రూమర్లు వస్తూనే ఉంటాయని.. వీటిని తేలిగ్గా తీసుకుని ముందుకు వెళ్లిపోవాల్సిందే అని ఆలియా అభిప్రాయపడింది.
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…