Movie News

రణబీర్ నన్ను వేధించడమా?

ఫిలిం సెలబ్రెటీల గురించి మీడియాలో.. సోషల్ మీడియాలో అనేక పుకార్లు వస్తుంటాయి. వాటన్నింటి గురించి వాళ్లు పట్టించుకోవడం మొదలుపెడితే అంతే సంగతులు. అందుకే చాలా వరకు వీటిని లైట్ తీసుకుని ముందుకు వెళ్లిపోతుంటారు సెలబ్రెటీలు. కానీ వ్యక్తిగత విషయాల మీద పదే పదే టార్గెట్ చేస్తే మాత్రం ఎలాంటి వాళ్లకైనా బాధ వేస్తుంది.

ఏదో ఒక దశలో బరస్ట్ అవుతారు. మీడియా, సోషల్ మీడియా వార్తలను చాలా తేలిగ్గా తీసుకునేట్లు కనిపించే ఆలియా భట్ సైతం కొన్ని విషయాల్లో తన గురించి వచ్చే రూమర్లు చూసి చాలా బాధ పడిందట. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలు, భర్త రణబీర్ కపూర్‌తో రిలేషన్ విషయంలో వచ్చే వార్తలు తనను బాధ పెట్టాయని కాఫీ విత్ కరణ్ షోలో ఆమె వెల్లడించింది. 

గతంలో కాఫీ విత్ కరణ్ షోలో తాను మాట్లాడుతూ.. రణబీర్‌కు తాను లిప్‌స్టిక్ వేస్తే నచ్చదని, వెంటనే తీసేయమంటాడని చెప్పానని.. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని తనను అతను వేధిస్తున్నాడంటూ వార్తలు రాశాడని.. ఇది తననెంతో బాధించిందని ఆలియా చెప్పింది. రణబీర్ చాలా మంచి వ్యక్తి అని.. అతను తననెంతో బాగా చూసుకుంటాడని ఆమె వ్యాఖ్యానించింది.

తన వైవాహిక జీవితంలో సమస్యలున్నట్లు చాలాసార్లు రూమర్లు క్రియేట్ చేశారని.. ఒకప్పుడు బాధ పడ్డా తర్వాత పట్టించుకోవడం మానేశానని ఆమె అంది. తాను కొవ్వు తగ్గించుకుని సన్నగా మారడం కోసం.. అలాగే తన చర్మాన్ని తెల్లగా చేసుకోవడం కోసం సర్జరీలను ఆశ్రయించానని కూడా ప్రచారం చేశానని.. ఈ ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి రూమర్లు వస్తూనే ఉంటాయని.. వీటిని తేలిగ్గా తీసుకుని ముందుకు వెళ్లిపోవాల్సిందే అని ఆలియా అభిప్రాయపడింది. 

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago