Movie News

రణబీర్ నన్ను వేధించడమా?

ఫిలిం సెలబ్రెటీల గురించి మీడియాలో.. సోషల్ మీడియాలో అనేక పుకార్లు వస్తుంటాయి. వాటన్నింటి గురించి వాళ్లు పట్టించుకోవడం మొదలుపెడితే అంతే సంగతులు. అందుకే చాలా వరకు వీటిని లైట్ తీసుకుని ముందుకు వెళ్లిపోతుంటారు సెలబ్రెటీలు. కానీ వ్యక్తిగత విషయాల మీద పదే పదే టార్గెట్ చేస్తే మాత్రం ఎలాంటి వాళ్లకైనా బాధ వేస్తుంది.

ఏదో ఒక దశలో బరస్ట్ అవుతారు. మీడియా, సోషల్ మీడియా వార్తలను చాలా తేలిగ్గా తీసుకునేట్లు కనిపించే ఆలియా భట్ సైతం కొన్ని విషయాల్లో తన గురించి వచ్చే రూమర్లు చూసి చాలా బాధ పడిందట. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలు, భర్త రణబీర్ కపూర్‌తో రిలేషన్ విషయంలో వచ్చే వార్తలు తనను బాధ పెట్టాయని కాఫీ విత్ కరణ్ షోలో ఆమె వెల్లడించింది. 

గతంలో కాఫీ విత్ కరణ్ షోలో తాను మాట్లాడుతూ.. రణబీర్‌కు తాను లిప్‌స్టిక్ వేస్తే నచ్చదని, వెంటనే తీసేయమంటాడని చెప్పానని.. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని తనను అతను వేధిస్తున్నాడంటూ వార్తలు రాశాడని.. ఇది తననెంతో బాధించిందని ఆలియా చెప్పింది. రణబీర్ చాలా మంచి వ్యక్తి అని.. అతను తననెంతో బాగా చూసుకుంటాడని ఆమె వ్యాఖ్యానించింది.

తన వైవాహిక జీవితంలో సమస్యలున్నట్లు చాలాసార్లు రూమర్లు క్రియేట్ చేశారని.. ఒకప్పుడు బాధ పడ్డా తర్వాత పట్టించుకోవడం మానేశానని ఆమె అంది. తాను కొవ్వు తగ్గించుకుని సన్నగా మారడం కోసం.. అలాగే తన చర్మాన్ని తెల్లగా చేసుకోవడం కోసం సర్జరీలను ఆశ్రయించానని కూడా ప్రచారం చేశానని.. ఈ ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి రూమర్లు వస్తూనే ఉంటాయని.. వీటిని తేలిగ్గా తీసుకుని ముందుకు వెళ్లిపోవాల్సిందే అని ఆలియా అభిప్రాయపడింది. 

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

43 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

1 hour ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago