ఫిలిం సెలబ్రెటీల గురించి మీడియాలో.. సోషల్ మీడియాలో అనేక పుకార్లు వస్తుంటాయి. వాటన్నింటి గురించి వాళ్లు పట్టించుకోవడం మొదలుపెడితే అంతే సంగతులు. అందుకే చాలా వరకు వీటిని లైట్ తీసుకుని ముందుకు వెళ్లిపోతుంటారు సెలబ్రెటీలు. కానీ వ్యక్తిగత విషయాల మీద పదే పదే టార్గెట్ చేస్తే మాత్రం ఎలాంటి వాళ్లకైనా బాధ వేస్తుంది.
ఏదో ఒక దశలో బరస్ట్ అవుతారు. మీడియా, సోషల్ మీడియా వార్తలను చాలా తేలిగ్గా తీసుకునేట్లు కనిపించే ఆలియా భట్ సైతం కొన్ని విషయాల్లో తన గురించి వచ్చే రూమర్లు చూసి చాలా బాధ పడిందట. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలు, భర్త రణబీర్ కపూర్తో రిలేషన్ విషయంలో వచ్చే వార్తలు తనను బాధ పెట్టాయని కాఫీ విత్ కరణ్ షోలో ఆమె వెల్లడించింది.
గతంలో కాఫీ విత్ కరణ్ షోలో తాను మాట్లాడుతూ.. రణబీర్కు తాను లిప్స్టిక్ వేస్తే నచ్చదని, వెంటనే తీసేయమంటాడని చెప్పానని.. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని తనను అతను వేధిస్తున్నాడంటూ వార్తలు రాశాడని.. ఇది తననెంతో బాధించిందని ఆలియా చెప్పింది. రణబీర్ చాలా మంచి వ్యక్తి అని.. అతను తననెంతో బాగా చూసుకుంటాడని ఆమె వ్యాఖ్యానించింది.
తన వైవాహిక జీవితంలో సమస్యలున్నట్లు చాలాసార్లు రూమర్లు క్రియేట్ చేశారని.. ఒకప్పుడు బాధ పడ్డా తర్వాత పట్టించుకోవడం మానేశానని ఆమె అంది. తాను కొవ్వు తగ్గించుకుని సన్నగా మారడం కోసం.. అలాగే తన చర్మాన్ని తెల్లగా చేసుకోవడం కోసం సర్జరీలను ఆశ్రయించానని కూడా ప్రచారం చేశానని.. ఈ ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి రూమర్లు వస్తూనే ఉంటాయని.. వీటిని తేలిగ్గా తీసుకుని ముందుకు వెళ్లిపోవాల్సిందే అని ఆలియా అభిప్రాయపడింది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం…
సినీ రంగంలో నటులుగా తొలి అవకాశం రావడం ఒకెత్తయితే.. తొలి సక్సెస్ అందుకోవడం ఇంకో ఎత్తు. కొందరికి తొలి అవకాశంతోనే…
అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా…
ఇవాళ విడుదలైన తండేల్ కు మంచి టాకే వినిపిస్తోంది. అదిరిపోయింది, రికార్డులు కొల్లగొడుతుందనే స్థాయిలో కాదు కానీ నిరాశ పరచలేదనే…
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలు,…