ఈ ఏడాది ఇండియా మొత్తంలో భారీ హైప్ తెచ్చుకున్న సినిమాల్లో ‘లియో’ ఒకటి. పేరుకు ఇది తమిళ సినిమానే అయినా.. తెలుగులో కూడా స్ట్రెయిట్ సినిమా స్థాయిలో బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. హిందీలో సైతం ‘లియో’కు హైప్ వచ్చింది. కానీ అంచనాలను అందుకోవడంలో ‘లియో’ ఘోరంగా విఫలమైంది. ‘విక్రమ్’ తర్వాత లోకేష్ కనకరాజ్ తీసిన సినిమా కావడంతో ఎంతో ఊహించుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు దిమ్మదిరిగిపోయింది.
సిల్లీ కథను బోరింగ్గా నరేట్ చేసి ప్రేక్షకులకు షాకిచ్చాడు లోకేష్. ప్రి రిలీజ్ హైప్ వల్ల సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. తర్వాత నిలబడలేకపోయింది. తెలుగులో తొలి వీకెండ్ తర్వాత ‘లియో’కు సౌండే లేదు. తమిళనాడు మినహా ఎక్కడా ఈ సినిమా నిలబడలేదు. తమిళంలో మాత్రం వేరే ఆప్షన్ లేక దసరా టైంలో ఈ సినిమానే చూశారు ప్రేక్షకులు.
ఐతే సినిమా సాధించిన వసూళ్ల కంటే ఎక్కువ చూపించి ఫేక్ చేశారనే చర్చ రిలీజ్ టైంలో నడిచింది. బుకింగ్స్ను కూడా మేనేజ్ చేశారంటూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి. మొత్తానికి రెండు మూడు వారాల తర్వాత ‘లియో’ హడావుడికి తెరపడింది. ఈ సినిమా గురించి అందరూ మరిచిపోయారు. కానీ ఇప్పుడు ‘లియో’ను తమిళనాట రీ రిలీజ్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.
గత రెండు వారాల్లో వచ్చిన తమిళ సినిమాలు పెద్దగా ఆడలేదు. థియేటర్లు వెలవెలబోతున్నాయి. కొత్త సినిమాల కోసం ‘లియో’ను నెమ్మదిగా థియేటర్ల నుంచి లేపేశారు. ఆ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసిందనే అనుకున్నారంతా. కానీ ఇప్పటికే రిలీజైన సినిమాలకు వసూళ్లు లేకపోగా.. కొత్త చిత్రాలకూ సరైన స్పందన కనిపించకపోవడంతో ‘లియో’ను తిరిగి వంద థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు సన్నాహాలు చేస్తునన్నారట. నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర సరిగా పెర్ఫామ్ చేయలేకపోయిన సినిమాను ఇంత తక్కువ గ్యాప్లో మళ్లీ రిలీజ్ చేయడమేంటో అర్థం కాక జనాలు తలలు పట్టుకుంటున్నారు.
This post was last modified on November 17, 2023 3:41 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…