ఈ ఏడాది ఇండియా మొత్తంలో భారీ హైప్ తెచ్చుకున్న సినిమాల్లో ‘లియో’ ఒకటి. పేరుకు ఇది తమిళ సినిమానే అయినా.. తెలుగులో కూడా స్ట్రెయిట్ సినిమా స్థాయిలో బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. హిందీలో సైతం ‘లియో’కు హైప్ వచ్చింది. కానీ అంచనాలను అందుకోవడంలో ‘లియో’ ఘోరంగా విఫలమైంది. ‘విక్రమ్’ తర్వాత లోకేష్ కనకరాజ్ తీసిన సినిమా కావడంతో ఎంతో ఊహించుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు దిమ్మదిరిగిపోయింది.
సిల్లీ కథను బోరింగ్గా నరేట్ చేసి ప్రేక్షకులకు షాకిచ్చాడు లోకేష్. ప్రి రిలీజ్ హైప్ వల్ల సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. తర్వాత నిలబడలేకపోయింది. తెలుగులో తొలి వీకెండ్ తర్వాత ‘లియో’కు సౌండే లేదు. తమిళనాడు మినహా ఎక్కడా ఈ సినిమా నిలబడలేదు. తమిళంలో మాత్రం వేరే ఆప్షన్ లేక దసరా టైంలో ఈ సినిమానే చూశారు ప్రేక్షకులు.
ఐతే సినిమా సాధించిన వసూళ్ల కంటే ఎక్కువ చూపించి ఫేక్ చేశారనే చర్చ రిలీజ్ టైంలో నడిచింది. బుకింగ్స్ను కూడా మేనేజ్ చేశారంటూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి. మొత్తానికి రెండు మూడు వారాల తర్వాత ‘లియో’ హడావుడికి తెరపడింది. ఈ సినిమా గురించి అందరూ మరిచిపోయారు. కానీ ఇప్పుడు ‘లియో’ను తమిళనాట రీ రిలీజ్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.
గత రెండు వారాల్లో వచ్చిన తమిళ సినిమాలు పెద్దగా ఆడలేదు. థియేటర్లు వెలవెలబోతున్నాయి. కొత్త సినిమాల కోసం ‘లియో’ను నెమ్మదిగా థియేటర్ల నుంచి లేపేశారు. ఆ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసిందనే అనుకున్నారంతా. కానీ ఇప్పటికే రిలీజైన సినిమాలకు వసూళ్లు లేకపోగా.. కొత్త చిత్రాలకూ సరైన స్పందన కనిపించకపోవడంతో ‘లియో’ను తిరిగి వంద థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు సన్నాహాలు చేస్తునన్నారట. నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర సరిగా పెర్ఫామ్ చేయలేకపోయిన సినిమాను ఇంత తక్కువ గ్యాప్లో మళ్లీ రిలీజ్ చేయడమేంటో అర్థం కాక జనాలు తలలు పట్టుకుంటున్నారు.
This post was last modified on November 17, 2023 3:41 pm
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే…
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…