ఈ ఏడాది ఇండియా మొత్తంలో భారీ హైప్ తెచ్చుకున్న సినిమాల్లో ‘లియో’ ఒకటి. పేరుకు ఇది తమిళ సినిమానే అయినా.. తెలుగులో కూడా స్ట్రెయిట్ సినిమా స్థాయిలో బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. హిందీలో సైతం ‘లియో’కు హైప్ వచ్చింది. కానీ అంచనాలను అందుకోవడంలో ‘లియో’ ఘోరంగా విఫలమైంది. ‘విక్రమ్’ తర్వాత లోకేష్ కనకరాజ్ తీసిన సినిమా కావడంతో ఎంతో ఊహించుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు దిమ్మదిరిగిపోయింది.
సిల్లీ కథను బోరింగ్గా నరేట్ చేసి ప్రేక్షకులకు షాకిచ్చాడు లోకేష్. ప్రి రిలీజ్ హైప్ వల్ల సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. తర్వాత నిలబడలేకపోయింది. తెలుగులో తొలి వీకెండ్ తర్వాత ‘లియో’కు సౌండే లేదు. తమిళనాడు మినహా ఎక్కడా ఈ సినిమా నిలబడలేదు. తమిళంలో మాత్రం వేరే ఆప్షన్ లేక దసరా టైంలో ఈ సినిమానే చూశారు ప్రేక్షకులు.
ఐతే సినిమా సాధించిన వసూళ్ల కంటే ఎక్కువ చూపించి ఫేక్ చేశారనే చర్చ రిలీజ్ టైంలో నడిచింది. బుకింగ్స్ను కూడా మేనేజ్ చేశారంటూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి. మొత్తానికి రెండు మూడు వారాల తర్వాత ‘లియో’ హడావుడికి తెరపడింది. ఈ సినిమా గురించి అందరూ మరిచిపోయారు. కానీ ఇప్పుడు ‘లియో’ను తమిళనాట రీ రిలీజ్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.
గత రెండు వారాల్లో వచ్చిన తమిళ సినిమాలు పెద్దగా ఆడలేదు. థియేటర్లు వెలవెలబోతున్నాయి. కొత్త సినిమాల కోసం ‘లియో’ను నెమ్మదిగా థియేటర్ల నుంచి లేపేశారు. ఆ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసిందనే అనుకున్నారంతా. కానీ ఇప్పటికే రిలీజైన సినిమాలకు వసూళ్లు లేకపోగా.. కొత్త చిత్రాలకూ సరైన స్పందన కనిపించకపోవడంతో ‘లియో’ను తిరిగి వంద థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు సన్నాహాలు చేస్తునన్నారట. నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర సరిగా పెర్ఫామ్ చేయలేకపోయిన సినిమాను ఇంత తక్కువ గ్యాప్లో మళ్లీ రిలీజ్ చేయడమేంటో అర్థం కాక జనాలు తలలు పట్టుకుంటున్నారు.
This post was last modified on November 17, 2023 3:41 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…