ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ థియేటర్లోనే కాదు ఓటిటిలో వస్తున్నప్పుడు కూడా ఒక రకమైన హడావిడి చూస్తుంటాం. కానీ టైగర్ నాగేశ్వరరావు గుట్టుచప్పుడు కాకుండా నిన్న అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావడం చూసి అభిమానులే ఆశ్చర్యపోయారు. మాములుగా ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీకి ప్రైమ్ చేసే ప్రమోషన్లు ఓ రేంజ్ లో ఉంటాయి. సోషల్ మీడియాని వేదికగా మార్చుకుని ఆడియన్స్ ని సిద్ధం చేస్తుంది. కానీ దీని విషయంలో అలాంటిదేమీ చేయకపోవడం విచిత్రం. కేవలం 28 రోజుల నిడివి అంటే నాలుగు వారాల గ్యాప్ తో వచ్చేయడం విశేషం.
దసరా చిత్రాల్లో ఓటిటిలో ముందుగా ప్రత్యక్షమయ్యింది టైగర్ నాగేశ్వరరావే. వాస్తవానికి లియోని నెట్ ఫ్లిక్స్ నిన్న 16న విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంది. కానీ ఎందుకో మళ్ళీ మనసు మార్చుకుని 21కి వాయిదా వేసింది. భగవంత్ కేసరి హక్కులు కొన్నది ప్రైమే కాబట్టి టైగర్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చేలా బహుశా వచ్చే వారం అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి. ఇటీవలే నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ టైగర్ నాగేశ్వరరావు బిజినెస్, రెవిన్యూ కోణంలో తమకు మంచి లాభాలు వచ్చాయని, అలాంటప్పుడు ఫ్లాప్ అనే ముద్ర ఎలా వేస్తారని ప్రశ్నించడం చర్చకు దారి తీసింది.
అయినా ఇలా సౌండ్ లేకుండా రావడం మాత్రం అనూహ్యమే. ఇంకో ట్విస్టు ఏంటంటే ఓటిటిలో అన్ కట్ వెర్షన్ (కత్తిరింపులు లేకుండా) వస్తుందేమోనని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. థియేటర్లో మొదటి రెండు రోజులు చూసిన మూడు గంటల రెండు నిమిషాల ప్రింట్ కి బదులు తర్వాత ఎడిట్ చేసిన 2 గంటల 43 నిమిషాల వెర్షనే వదిలారు. సో ఇంకెప్పటికీ కోతకు గురైన నాగేశ్వరరావు భాగాన్ని చూడలేమన్న మాట. వంశీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు యాభై కోట్ల గ్రాస్ అందుకున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ కి దూరంలో నిలిచిపోయి చివరికి ఫ్లాప్ గా మిగిలింది.
This post was last modified on November 17, 2023 10:18 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…