ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ థియేటర్లోనే కాదు ఓటిటిలో వస్తున్నప్పుడు కూడా ఒక రకమైన హడావిడి చూస్తుంటాం. కానీ టైగర్ నాగేశ్వరరావు గుట్టుచప్పుడు కాకుండా నిన్న అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావడం చూసి అభిమానులే ఆశ్చర్యపోయారు. మాములుగా ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీకి ప్రైమ్ చేసే ప్రమోషన్లు ఓ రేంజ్ లో ఉంటాయి. సోషల్ మీడియాని వేదికగా మార్చుకుని ఆడియన్స్ ని సిద్ధం చేస్తుంది. కానీ దీని విషయంలో అలాంటిదేమీ చేయకపోవడం విచిత్రం. కేవలం 28 రోజుల నిడివి అంటే నాలుగు వారాల గ్యాప్ తో వచ్చేయడం విశేషం.
దసరా చిత్రాల్లో ఓటిటిలో ముందుగా ప్రత్యక్షమయ్యింది టైగర్ నాగేశ్వరరావే. వాస్తవానికి లియోని నెట్ ఫ్లిక్స్ నిన్న 16న విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంది. కానీ ఎందుకో మళ్ళీ మనసు మార్చుకుని 21కి వాయిదా వేసింది. భగవంత్ కేసరి హక్కులు కొన్నది ప్రైమే కాబట్టి టైగర్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చేలా బహుశా వచ్చే వారం అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి. ఇటీవలే నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ టైగర్ నాగేశ్వరరావు బిజినెస్, రెవిన్యూ కోణంలో తమకు మంచి లాభాలు వచ్చాయని, అలాంటప్పుడు ఫ్లాప్ అనే ముద్ర ఎలా వేస్తారని ప్రశ్నించడం చర్చకు దారి తీసింది.
అయినా ఇలా సౌండ్ లేకుండా రావడం మాత్రం అనూహ్యమే. ఇంకో ట్విస్టు ఏంటంటే ఓటిటిలో అన్ కట్ వెర్షన్ (కత్తిరింపులు లేకుండా) వస్తుందేమోనని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. థియేటర్లో మొదటి రెండు రోజులు చూసిన మూడు గంటల రెండు నిమిషాల ప్రింట్ కి బదులు తర్వాత ఎడిట్ చేసిన 2 గంటల 43 నిమిషాల వెర్షనే వదిలారు. సో ఇంకెప్పటికీ కోతకు గురైన నాగేశ్వరరావు భాగాన్ని చూడలేమన్న మాట. వంశీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు యాభై కోట్ల గ్రాస్ అందుకున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ కి దూరంలో నిలిచిపోయి చివరికి ఫ్లాప్ గా మిగిలింది.
This post was last modified on November 17, 2023 10:18 am
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…