గత వారం దీపావళి పండగ సందర్భంగా విడుదలైన మూడు డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏమంత జోష్ ఇవ్వలేకపోయాయి. జపాన్ మొదటి ఆటకే ఆడియన్స్ తిరస్కరించగా, తమిళంలో ఘనవిజయం సాధించిన జిగర్ తండా డబుల్ ఎక్స్ మన జనాలకు కనెక్ట్ కాలేక ఫ్లాప్ మూటగట్టుకుంది. ప్రీ రిలీజ్ కు ముందున్న హైప్, సల్మాన్ ఖాన్ ఇమేజ్ పుణ్యమాని టైగర్ 3 మూడు రోజులు బాగానే ఆడినప్పటికీ తర్వాత విపరీతంగా నెమ్మదించింది. రెండో వారంలో వసూళ్లు ఇంకా పడిపోతాయని ట్రేడ్ టాక్. జవాన్, పఠాన్ లను దాటడం అసాధ్యమని డిస్ట్రిబ్యూటర్లు చెప్పేస్తున్నారు.
ఇక రేపటి పోరు ఆసక్తికరంగా ఉంది. మంగళవారం మీద క్రమంగా హైప్ పెరుగుతోంది. కంటెంట్ మీద నమ్మకంతో ఎంపిక చేసిన సెంటర్లలో ఇవాళ రాత్రే ప్రీమియర్లు వేస్తున్నారు. దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇద్దరి మీదే ప్రమోషన్ల భారం ఉన్నా దాన్ని బాగా నిర్వర్తించారు. క్రైమ్ ప్లస్ హారర్ కలగలిసిన మంగళవారంలో ఊహించినని ట్విస్టులు షాక్ ఇస్తాయని టీమ్ తెగ ఊరిస్తోంది. మొదటి భాగం రిలీజ్ లో జరిగిన జాప్యం వల్ల ఫ్లాపైన సప్తసాగరాలు దాటి సీక్వెల్ సైడ్ బి మీద మెల్లగా బజ్ వస్తోంది. అసలు కథ ఇందులో చెప్పబోతున్న విషయం పబ్లిక్ కి అర్థమైపోయింది.
మంగళవారం, సప్తసాగరాలు దాటి సైడ్ బి రెండూ హై ఎమోషన్ మీద నడిచే సీరియస్ డ్రామాలు. ఒక దాంట్లో సస్పెన్స్ కు పెద్ద పీఠ వేస్తే మరొకటి రివెంజ్ మీద నడుస్తుంది. ఇవి కాకుండా మెహ్రీన్ నటించిన స్పార్క్ లైఫ్ లో కొత్త హీరో కావడంతో దాని మీద హైప్ లేదు. హన్సిక మై నేమ్ ఈజ్ శృతి వస్తోంది. టాక్ వస్తే తప్ప ఆడియన్స్ వీటి వైపు చూడలేని పరిస్థితి. గత కొన్ని వారాలుగా టికెట్ కౌంటర్లకు ఊపిచ్చిన సినిమాలు పెద్దగా రాలేదు. ఆ కారణంగానే అయిదో వారంలో అడుగు పెడుతున్న భగవంత్ కేసరికే మంచి వసూళ్లు వస్తున్నాయి. మరి ఈ ఫ్రైడే అజయ్ భూపతి, రక్షిత్ శెట్టి తమకు అందివచ్చిన ఈ గోల్డెన్ ఛాన్స్ ని ఎలా వాడుకుంటారో.
This post was last modified on November 16, 2023 12:19 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…