నిన్న జరిగిన మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ తన ప్రసంగంలో పుష్ప 2 ప్రస్తావన తేవడంతో ఒక్కసారిగా అభిమానుల్లో జోష్ వచ్చింది. రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని, నేరుగా అక్కడి నుంచే వస్తున్నానని చెప్పాడు. జాతర్ ఎపిసోడ్ గురించి హింట్ చేస్తూ చేతికి ఉన్న నైల్ పాలిష్ తో పాటు ఈ గెటప్ కు సంబంధించిన గుర్తులు అలాగే ఉండిపోయాయని చూపించాడు. పుష్ప 2లో ఇది చాలా కీలకమైన ట్విస్ట్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో బన్నీ ఆడవేషం వేసింది ఇందులో భాగంగానే. అయితే మ్యాటర్ ఇక్కడితో అయిపోలేదు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం జాతర గురించి బన్నీ చెప్పింది చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే అసలేం రివీల్ చేయలేదు. వందలాది జూనియర్ ఆర్టిస్టుల మధ్య అల్లు అర్జున్ గ్రామ సంప్రదాయం ప్రకారం వేషం వేసుకుని పాటకు డాన్స్ చేస్తూ, ఊగిపోతూ శత్రు సంహారం చేయడం పూనకాలు వచ్చే రేంజ్ లో దర్శకుడు సుకుమార్ తీస్తున్నాడట. సరిగ్గా పేలి ఆడియన్స్ కి కనెక్ట్ అయితే థియేటర్ జనాలు ఊగిపోవడం ఖాయమని తెగ ఊరిస్తున్నారు. డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య కంపోజింగ్ కూడా అంతే స్థాయిలో గూస్ బంప్స్ ఇచ్చే స్థాయిలో వచ్చిందని లీకుల ప్రధాన సారాంశం.
ఇది ఇంటర్వెల్ కు వస్తుందా లేక క్లైమాక్స్ ఘట్టమా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రధాన తారాగణం పాల్గొనే ఈ ఎపిసోడ్ గురించి చాలా కాలం మాట్లాడుకుంటారని ఊరిస్తున్నారు. సెట్ లో విన్నవాళ్ళు దేవీశ్రీ ప్రసాద్ విశ్వరూపం మరోసారి చూడొచ్చని అంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఫ్యాన్స్ ఇంకా వచ్చే ఏడాది ఆగస్ట్ 15 దాకా ఎదురు చూడాల్సి రావడం వాళ్లకు మహా కష్టంగా ఉంది. ప్రమోషన్ కూడా ఏప్రిల్ తర్వాతే చేస్తారట. షూటింగ్ కి ఎప్పుడు గుమ్మడకాయ కొడతారనేది ఇప్పట్లో తేలదు. క్వాలిటీ విషయంలో రాజీ పడని సుకుమార్ మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేసేస్తున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…