నిన్న విడుదలైన రెండు డబ్బింగ్ సినిమాలు జపాన్, జిగర్ తండ డబుల్ ఎక్స్ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎదురీదేలా ఉన్నాయి. కార్తీ మూవీకి ఉదయం షోల నుంచే మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ఒరిజినల్ తమిళ వెర్షన్ కన్నా మన దగ్గరే డీసెంట్ నెంబర్స్ నమోదవుతాయని బయ్యర్లు అంచనా వేశారు. అయితే నెగటివ్ టాక్ మధ్యాన్నం నుంచే ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. కార్తీ 25వ మూవీగా ఇలాంటి కథను, దర్శకుడిని ఎంచుకోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రంలోనే మిస్ ఫైర్ రిపోర్ట్స్ వస్తున్న తరుణంలో పికప్ చూపించడం కష్టమే.
ఇక జిగర్ తండ డబుల్ ఎక్స్ లో టెక్నికల్ టేకింగ్ కి మంచి మార్కులు పడుతున్నా నెమ్మదైన టేకింగ్, మన నేటివిటికి దూరంగా అనిపించే వాతావరణం తెలుగు ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలా చేయలేకపోతోంది. అయినా సరే జపాన్ కన్నా కొంచెం ఎక్కువ ఎడ్జ్ తీసుకుని నిన్న సాయంత్రం నుంచి కొంచెం మెరుగుదల చూపిస్తోంది. అయితే అనూహ్యం అనిపించే అద్భుతాలు జరగడం అనుమానమే. రిలీజ్ కు ముందు ఎన్ని ప్రమోషన్లు చేసినా అవి ఓపెనింగ్స్ గా మారకపోవడం కార్తీ, లారెన్స్ లకు ఇబ్బందిగా మారింది. స్వయంగా వాళ్లే వచ్చి రోజుల తరబడి హైదరాబాద్ లో పబ్లిసిటీ చేసినాప్రయోజనం రాలేదు.
రేపు టైగర్ 3 రెస్పాన్స్ ని బట్టే వీటి రేంజ్ ఎక్కడ ఆగుతుందనేది తెలుస్తుంది. పఠాన్, జవాన్ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తున్నా టాక్ బాగుంటే మాత్రం వేగంగా పికప్ ఉంటుంది. ఇక ఒకే స్ట్రెయిట్ మూవీ అలా నిన్ను చేరిని ఎవరూ పట్టించుకోలేదు. హెబ్బా పటేల్ తప్ప తెలిసిన మొహాలు లేకపోవడంతో ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. జనాలంతా దీపావళి పండగ మూడ్ లో షాపింగులు, టపాసుల కొనుగోలు, లక్ష్మి పూజ ఏర్పాట్లలో బిజీగా ఉండటంతో థియేటర్లకు వెళ్లే మూడ్ లో పెద్దగా లేరు. ఒకరకంగా చెప్పాలంటే ఆదికేశవ వాయిదా వేసుకుని మంచి పనే చేసింది.
This post was last modified on November 11, 2023 6:57 pm
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…
ప్రభాస్ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…