నిన్న విడుదలైన రెండు డబ్బింగ్ సినిమాలు జపాన్, జిగర్ తండ డబుల్ ఎక్స్ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎదురీదేలా ఉన్నాయి. కార్తీ మూవీకి ఉదయం షోల నుంచే మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ఒరిజినల్ తమిళ వెర్షన్ కన్నా మన దగ్గరే డీసెంట్ నెంబర్స్ నమోదవుతాయని బయ్యర్లు అంచనా వేశారు. అయితే నెగటివ్ టాక్ మధ్యాన్నం నుంచే ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. కార్తీ 25వ మూవీగా ఇలాంటి కథను, దర్శకుడిని ఎంచుకోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రంలోనే మిస్ ఫైర్ రిపోర్ట్స్ వస్తున్న తరుణంలో పికప్ చూపించడం కష్టమే.
ఇక జిగర్ తండ డబుల్ ఎక్స్ లో టెక్నికల్ టేకింగ్ కి మంచి మార్కులు పడుతున్నా నెమ్మదైన టేకింగ్, మన నేటివిటికి దూరంగా అనిపించే వాతావరణం తెలుగు ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలా చేయలేకపోతోంది. అయినా సరే జపాన్ కన్నా కొంచెం ఎక్కువ ఎడ్జ్ తీసుకుని నిన్న సాయంత్రం నుంచి కొంచెం మెరుగుదల చూపిస్తోంది. అయితే అనూహ్యం అనిపించే అద్భుతాలు జరగడం అనుమానమే. రిలీజ్ కు ముందు ఎన్ని ప్రమోషన్లు చేసినా అవి ఓపెనింగ్స్ గా మారకపోవడం కార్తీ, లారెన్స్ లకు ఇబ్బందిగా మారింది. స్వయంగా వాళ్లే వచ్చి రోజుల తరబడి హైదరాబాద్ లో పబ్లిసిటీ చేసినాప్రయోజనం రాలేదు.
రేపు టైగర్ 3 రెస్పాన్స్ ని బట్టే వీటి రేంజ్ ఎక్కడ ఆగుతుందనేది తెలుస్తుంది. పఠాన్, జవాన్ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తున్నా టాక్ బాగుంటే మాత్రం వేగంగా పికప్ ఉంటుంది. ఇక ఒకే స్ట్రెయిట్ మూవీ అలా నిన్ను చేరిని ఎవరూ పట్టించుకోలేదు. హెబ్బా పటేల్ తప్ప తెలిసిన మొహాలు లేకపోవడంతో ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. జనాలంతా దీపావళి పండగ మూడ్ లో షాపింగులు, టపాసుల కొనుగోలు, లక్ష్మి పూజ ఏర్పాట్లలో బిజీగా ఉండటంతో థియేటర్లకు వెళ్లే మూడ్ లో పెద్దగా లేరు. ఒకరకంగా చెప్పాలంటే ఆదికేశవ వాయిదా వేసుకుని మంచి పనే చేసింది.
This post was last modified on November 11, 2023 6:57 pm
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు మనసులో ఏదీ దాచుకోరు. ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తారు. నిన్న హైదరాబాద్ లో దాసరి…
దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ…
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే…
తమిళనాట ఎవరి అంచనాకు అందని విదంగా దళపతి విజయ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన అధికారంలోకి…
దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందుంటాయి.…
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. అప్పటికే ప్రేమతో మీ కార్తీక్…